Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.
Tirumala, Oct 22: తిరుమల (Tirumala) శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి (Sridevi), భూదేవి (Bhudevi) సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పురవీధుల్లోకి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కర్పూరహారతులతో దర్శించుకుంటున్నారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడి వాహనసేవ కనులవిందుగా జరుగుతోంది.
ఆదివారం రాత్రి 7 గంటల వరకు భక్తులకు శ్రీనివాసుడు దర్శనమివ్వనున్నాడు. అశ్వ వాహనంపై ఊరేగనున్నారు. కాగా నేటితో శ్రీవారి వాహన సేవలు ముగుస్తాయి. సోమవారం ఉదయం నిర్వహించనున్న చక్రస్నానంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement