TTD Darshan: శ్రీవారిని దర్శనానికి నేటి నుంచి 9 వేల టికెట్లు అందుబాటులోకి, ప్రత్యేక‌ ప్రవేశ ద‌ర్శన టికెట్ ధర రూ. 300, జూలై ఒకటి నుంచి రోజుకు 3,000 చొప్పున స‌ర్వ ద‌ర్శనం టోకెన్ల జారీ

అన్లాక్ 1.0 సమయంలో జూన్ 11 న తిరిగి తెరిచిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam), రోజువారీ దర్శనంలో భాగంగా కోటాను మరికొంత పెంచింది. ముందుగా 3000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించగా ఆ తరువాత మరో 3000 మందికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా మరో 3 వేల మందికి అవకాశం కల్పించారు. ఆన్ లైన్ బుకింగ్ (online booking darshan quota) ద్వారా రోజుకు 9 వేల మంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు.

coronavirus outbreak: Unwell devotees asked to skip trip to Tirupati (Photo-PTI)

Tirumala,June 29: అన్లాక్ 1.0 సమయంలో జూన్ 11 న తిరిగి తెరిచిన తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam), రోజువారీ దర్శనంలో భాగంగా కోటాను మరికొంత పెంచింది. ముందుగా 3000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించగా ఆ తరువాత మరో 3000 మందికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా మరో 3 వేల మందికి అవకాశం కల్పించారు. ఆన్ లైన్ బుకింగ్ (online booking darshan quota) ద్వారా రోజుకు 9 వేల మంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు. ఏపీలో తాజాగా 793 కరోనావైరస్‌ కేసులు, రాష్ట్రంలో 13,891కి చేరిన మొత్తం కేసుల సంఖ్య, 180కి చేరిన మరణాలు

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ద‌ర్శనానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జూలై నెల‌కు సంబంధించిన రూ. 300 ప్రత్యేక‌ ప్రవేశ ద‌ర్శన టికెట్ల కోటాను సోమ‌వారం (ఈ నెల 29న) టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసింది. రోజుకు 9,000 టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) వెల్లడించింది. అలాగే, జూలై ఒకటి నుంచి రోజుకు 3,000 చొప్పున స‌ర్వ ద‌ర్శనం టోకెన్లను కూడా జారీ చేస్తామని పేర్కొంది.

తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లను పొంద‌వ‌చ్చు. జూలై ఒకటిన శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను తిరుపతిలోని కౌంటర్లలో మంగళవారం జారీ చేస్తారు.

జూలై నెలలో దర్శనానికి జూన్ 29 నుండి అమల్లోకి వచ్చే ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా అందుబాటులో ఉంటుంది. కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని భక్తులు థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి మరియు అవసరమైన అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించాలి. అయితే, 65 ఏళ్లు పైబడిన భక్తులకు, 10 ఏళ్లలోపు, గర్భిణీ స్త్రీలకు దర్శనం అందుబాటులో ఉండదు. భక్తులందరూ ముసుగు ధరించాలి సామాజిక దూర నియమాలను ఖచ్చితంగా పాటించాలి.

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఏడు కొండల పైన, శేషాచలం, తూర్పు కనుమల పరిధిలో ఉంది. విష్ణువుకు అంకితం చేసిన స్వయంభు క్షేత్రాలలో ఈ దేవస్థానం ఒకటి. ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక ప్రార్థనా స్థలాలలో ఒకటిగా భావిస్తున్నారు. ఒక సాధారణ రోజు (లాక్డౌన్ ముందు), తిరుమల ఆలయం ప్రతిరోజూ కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకునేవారు. అయితే లాక్ డౌన్ తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement