Gold Particles Found In Bore Well: బోరు తవ్విస్తే, బురదతో పాటు పైకి వచ్చిన బంగారాన్ని పోలిన పొడి.. బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం.. ఒడిశాలో ఘటన
ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం రంగులో ఉన్న పొడి బయటికి వచ్చింది.
Newdelhi, March 26: ఒడిశాలో (Odisha) చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బొలంగీర్ జిల్లా బహాలి గ్రామానికి చెందిన మహ్మద్ జావెద్ తన పొలంలో సాగునీటి కోసం బోరు (Bore Well) తవ్వించాడు. అయితే, ఆ బోరు నుంచి బురద నీటితో పాటు బంగారం (Gold) రంగులో ఉన్న పొడి (Powder) కూడా పైకి వచ్చింది. చూడ్డానికి అచ్చం అది బంగారంలోనే ఉంది. ఇంకేముంది.. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ఊరంతా పాకిపోయింది.. బోరు వేస్తే బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం సాగింది.
ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు రైతు పొలంలోని బోరు వద్దకు చేరుకుని ఆ పొడి నమూనాలు సేకరించారు. ఆ పొడి బంగారమో కాదో తేల్చేందుకు నమూనాలను ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు, ల్యాబ్ ఫలితాలు వచ్చేవరకు బోర్ ను మూసివేయాలని ఆదేశించారు.
Advertisement
సంబంధిత వార్తలు
Kerala: భర్తను కాపాడుకునేందుకు సాహసం చేసిన భార్య, వామ్మో ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేరు
Telangana Shocker: ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి అదే బావిలో దూకిన తండ్రి, కుటుంబ కలహాలే కారణమని చెబుతున్న పోలీసులు, కామారెడ్డిలో విషాదకర ఘటన
50 Members Hospitalized in Narayanakhed: బావి నీళ్లు తాగి 50 మందికి తీవ్ర అస్వస్థత, ఇద్దరు మృతి, పలువురి పరిస్థితి విషమం, మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో బావిలో నీరు తాగిన గ్రామస్తులు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఘటన
Talc Cancer Link: టాల్కం పౌడర్ తో అండాశయ క్యాన్సర్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement