Cyclone Michaung Alert: నెల్లూరు జిల్లాలో తీరం దాటుతున్న మైచాంగ్ తుపాను.. మైపాడు బీచ్ వద్ద తీరం దాటే ప్రక్రియ మొదలు
గత రెండ్రోజులుగా తమిళనాడుతో పాటు ఏపీ తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది.
Hyderabad, Dec 5: గత రెండ్రోజులుగా తమిళనాడుతో (Tamilnadu) పాటు ఏపీ (AP) తీర ప్రాంతాన్ని వణికించిన తీవ్ర తుపాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరు జిల్లాలో భూభాగంపైకి ప్రవేశిస్తోంది. జిల్లాలోని మైపాడు బీచ్ వద్ద తుపాను తీరం దాటే ప్రక్రియ మొదలైంది. ఇది గత 6 గంటలుగా 10 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా బలహీనపడే అవకాశాలున్నాయి. తుపాను ప్రభావంతో ఇప్పటివరకు బాపట్లలో 213.6 మిల్లీమీటర్లు, నెల్లూరులో 209.5 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 149.3 మిల్లీమీటర్లు, కావలిలో 142.6 మిల్లీమీటర్లు, ఒంగోలులో 114.4 మిల్లీమీటర్లు, కాకినాడలో 59 మిల్లీమీటర్లు, నరసాపురంలో 58.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)