Vizag Car Accident: విశాఖలో కారు బీభత్సం.. డివైడర్ ను దాటి బైక్ ను ఢీకొట్టి.. ఆపై చెట్టు పొదల్లోకి వెళ్లిన వాహనం.. ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ ను దాటి ఎదురుగా బైక్ పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు.

Road Accident (Representational Image)

Vizag, Aug 8: విశాఖలో (Vizag) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన కారు (Car) అదుపు తప్పి డివైడర్​ ను (Divider) దాటి ఎదురుగా బైక్ (Bike) పై వస్తున్న వారిని అనంతరం ఢీకొట్టింది. ఆపై చెట్టు పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో బైక్ పైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ విషాద ఘటన సోమవారం రాత్రి 10గంటల సమయంలో విశాఖపట్టణంలోని బీచ్ రోడ్డులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో భార్యభర్తలు సింగారపు పృథ్వీరాజ్ (28), ప్రియాంక(21)గా పోలీసులు గుర్తించారు. కారులో మరణించిన వ్యక్తిని మణికుమార్‌(25)గా గుర్తించారు. ఈ విషాదం ఘటన సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నట్లు తెలిసింది. వారిలో ముగ్గురు ఘటన స్థలం నుంచి పరారవ్వగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.

Malayalam Director Siddique: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్క్రీన్ రైటర్ సిద్ధిక్ కు గుండెపోటు... పరిస్థితి విషమం

Jagtial Shocker: శిథిలావస్థకు ఎంపీడీఓ ఆఫీసు.. హెల్మెట్లు ధరించి డ్యూటీ చేస్తున్న ఉద్యోగులు.. జగిత్యాల జిల్లా బీర్‌ పూర్ లో ఘటన.. ఫోటోలు వైరల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement