Andhra Cricket Controversy: ఆంధ్రా క్రికెట్ వివాదంలో దూరిన రవిచంద్రన్ అశ్విన్, కుట్టి కథలకు మీరు రెడీనా అంటూ ట్వీట్, నేను రెడీ అంటూ బదులిచ్చిన హనుమ విహారీ

ఇటీవలి ఆంధ్రా క్రికెట్ వివాదంలో 'కుట్టి కథలు'లో తనతో చేరాలని రవిచంద్రన్ అశ్విన్ చేసిన అభ్యర్థనపై భారత క్రికెటర్ హనుమ విహారి స్పందించారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ కోసం అతన్ని ఆహ్వానించడంతో, 30 ఏళ్ల అతను దానికి అంగీకరించాడు.

Hanuma Vihari and R Ashwin. | (Credits: Twitter)

ఇటీవలి ఆంధ్రా క్రికెట్ వివాదంలో 'కుట్టి కథలు'లో తనతో చేరాలని రవిచంద్రన్ అశ్విన్ చేసిన అభ్యర్థనపై భారత క్రికెటర్ హనుమ విహారి స్పందించారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చాట్ కోసం అతన్ని ఆహ్వానించడంతో, 30 ఏళ్ల అతను దానికి అంగీకరించాడు. దాని ప్రత్యుత్తరం X లో వైరల్ కావడంతో తెలుగులోనే స్పందించాడు. అశ్విన్ (Ravichandran Ashwin) తన ‌ఎక్స్‌లో మీరు రెడీనా అని తెలుగులో చెప్పగా, నేనే రెడీ అంటూ విహారీ తెలుగులోనే సమాధాన మిచ్చాడు. ఆంధ్రా క్రికెట్ వివాదం (Andhra Cricket Controversy) మొత్తానికి ముదురుతోందని తెలుస్తోంది.

ఇంగ్లండ్‌పై 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ రికార్డు, వీడియో ఇదిగో..

ఇదిలా ఉంటే భవిష్యత్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టుకు ఆడబోనని హనుమ విహారి (Hanuma Vihari) వెల్లడించిన సంగతి విదితమే. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఓటమిపాలైంది.ఈ ఓటమి అనంతరం అంధ్ర టీమ్‌కు గుడ్‌బై చెబుతూ విహారి ఓ పోస్ట్ పెట్టాడు. క్రికెట్‌లో ఏపీ రాజకీయ నేత జోక్యం ఉందని మనస్తాపం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో విహారి పోస్టు చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనని తెలిపాడు.

Here's Tweets

Response by Prudhvi Raj to Hanuma Vihari.

Andhra Cricket is turning into a box office. pic.twitter.com/F0TZMIKfbi

 

View this post on Instagram

 

A post shared by Hanuma vihari (@viharigh)

రాజకీయ నేత కుమారుడి కోసం నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. రంజీ మ్యాచ్‌ సందర్భంగా 17వ ఆటగాడి అయిన పృధ్వి రాజ్ కెఎన్‌పై ఆటపరంగా అరిచాను. అతను నాపై రాజకీయ నేత అయిన తన తండ్రికి చెప్పాడు. ఆయన నాపై చర్యల కోసం ఏసీఏపై ఒత్తిడి చేశాడు. ఆ ఒత్తిడితోనే నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. వ్యక్తిగతంగా నేను ఎవరినీ ఏమీ అనలేదని పోస్టులో పేర్కొన్నారు. కొద్దిసేపటి తర్వాత, పృధ్వీ రాజ్ కెఎన్ విహారి చెప్పినది అబద్ధమని, సానుభూతి ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు. బంతిని అంచనా వేయకుండా ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి వికెట్ సమర్పించుకున్న రోహిత్ శర్మ, వీడియో ఇదిగో..

అందరీకి హలో.. హనుమ విహారి ఆరోపించిన ఆటగాడిని నేనే. నా గురించి మీరు విన్నదంతా అసత్యం. ఆట కంటే ఎవరూ కూడా గొప్ప కాదు. అయితే అన్నింటికంటే నా ఆత్మగౌరవం చాలా ముఖ్యమైనది. ఎలాంటి వేదికలోనైనా వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఆహ్వానించదగినది కాదు. ఆ రోజు ఏమైందో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు.

నువ్వు ఇంతకు మించి ఏమి పీకలేవురా.. ఛాంపియన్. నీకు కావాల్సిన సానుభూతి గేమ్స్ ఆడుకో'అని పృథ్వీ రాజ్ ఘాటుగా బదులిచ్చాడు. ఆంధ్రకు చెందిన పృథ్వీ రాజ్ 24 ఏళ్ల యువ వికెట్ కీపర్. ఇంత వరకు ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడలేదు. ఆంధ్ర జట్టు తరఫున ఒకే ఒక లిస్ట్ ఏ గేమ్ ఆడాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now