Amaravati Land Scam: అమరావతి కుంభకోణంలో ఎవ్వర్నీ వదిలిపెట్టం, అవినీతి మొత్తం బయటకు తీసి అందర్నీ అరెస్టు చేస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

రాజధాని అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సిట్‌ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.

Sajjala Ramakrishna Reddy (Photo-Twitter)

Amaravati, May 3: రాజధాని అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సిట్‌ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట, సిట్‌పై హైకోర్టు స్టేని కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం, మెరిట్ ప్రాతిపదికన విచారించాలని కీలక తీర్పు

గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కందుకూరు సందుల్లో నీవల్ల మనుషులు పోయారు, అందుకే ప్రభుత్వం జోవో నంబర్‌-1 తెచ్చింది, చంద్రబాబు, ఫేక్ న్యూస్‌పై మండిపడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్‌ ఏర్పాటు జరిగిందని, సిట్‌ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్‌ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now