Andhra Pradesh Horror: గాజువాకలో దారుణం, కోడలి నోట్లో మామ పురుగుమందు పోస్తే ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టిన భర్త, చికిత్సపొందుతూ బాధితురాలు మృతి

కట్టుకున్న మొగుడే కాల యముడయ్యడు. భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. విశాఖలోని గాజువాకలో భార్యా భర్తలు పద్మిని నివాసం ఉంటున్నారు.

Husband kills Wife by drinking pesticides and Trying to believe she dies by Suicide in Visakhapatnam

విశాఖపట్నం గాజువాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న మొగుడే కాల యముడయ్యడు. భార్యను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా పురుగుల మందు తాగించి చంపేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు.

విశాఖలోని గాజువాకలో భార్యా భర్తలు పద్మిని నివాసం ఉంటున్నారు. సోమేశ్వరరావు తొలుత భర్త బాగానే ఉన్నా ఆ తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అత్తామమలు వీరికి తోడయ్యారు. తీసుకురాలేనని పద్మిని చెప్పడంతో చంపేయాలనుకున్నారు.  వీడియో ఇదిగో, ఏపీ హోం మంత్రి ఇలాకాలో ఇద్దరు మహిళలపై పాశవిక దాడి, లో దుస్తులు చించివేసి మరీ దౌర్జన్యానికి పాల్పడి..

ఆమెను బంధించి పద్మిని మామ నోట్లో పురుగుల మందు పోశాడు. ఆమె భర్త ఆ మందు కక్కకుండా నోటికీ చేతిని అడ్డుపెట్టుపెట్టాడు. బలవంతంగా పురుగులు మందు తాగించారు. దీంతో ఆమెకు వాంతులయ్యాయి. ఇరుగు పొరుగు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఏం తెలియనట్లుగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ జరిగినదంతా బాధితురాలు ఆడియో రికార్డు చేసి మేనమామకు, బంధువులకు పంపింది.

Here's News

చివరకు ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడియో రికార్డు విన్న బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త సోమేశ్వరరావు, బాధితురాలి అత్తామామల్ని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు.