AP Covid Report: ఏపీలో అత్యంత తక్కువగా కేసులు నమోదు, తాజాగా 128 మందికి కోవిడ్ పాజిటివ్, ముగ్గురు మృతితో 7,118కి చేరుకున్న మరణాల సంఖ్య, 2,943 మందికి కొనసాగుతున్న చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ (AP Covid Report) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. తూర్పు గోదావరిలో 19, కృష్ణా జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కేసులు (Coronavirus) నమోదయ్యాయి.

Coronavirus in India (Photo Credits: PTI)

Amaravati, Jan 4: ఏపీలో గడచిన 24 గంటల్లో 29,714 కరోనా పరీక్షలు నిర్వహించగా 128 మందికి పాజిటివ్ (AP Covid Report) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు గుర్తించారు. తూర్పు గోదావరిలో 19, కృష్ణా జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కేసులు (Coronavirus) నమోదయ్యాయి.

అదే సమయంలో 252 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ముగ్గురు (Covid Deaths) మరణించారు. చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,315కి చేరింది. 8,70,254 కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా 2,943 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 7,118కి చేరింది.

కరోనావైరస్ కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 16,505 మందికి కరోనా నిర్ధారణ (Covid in India) అయింది. అదే స‌మ‌యంలో 19,557 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,03,40,470కు (COVID-19 Cases in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

కోవిడ్ లేదంటూ కరోనా సెంటర్లు మూసివేత, కీలక నిర్ణయం తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం, ముంబైలో తగ్గిన కోవిడ్ కేసులు

దీంతో మృతుల సంఖ్య 1,49,649కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,46,867 మంది కోలుకున్నారు. 2,43,953 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement