AP Global Investment Summit 2023: పెట్టుబడులే ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, ప్రారంభ సెషన్‌లో స్పీచ్ ఇవ్వనున్న బిజినెస్ టైకూన్స్

విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చ్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (AP Global Investment Summit) సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డు షోలను నిర్వహిస్తుంది.

Global Investors Summit, Vishakhapatnam March 3-4, 2023

Amaravati, Feb 27: విశాఖలో ప్రతిష్టాత్మకంగా మార్చ్ 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (AP Global Investment Summit) సన్నాహకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రాష్ట్రాలలో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి పలు రోడ్డు షోలను నిర్వహిస్తుంది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) డైనమిక్ నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించడానికి ఈ సదస్సు వేదికను అందిస్తుంది.

మార్చి 3,4న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ముస్తాబవుతున్న విశాఖపట్నం, పెట్టుబడుదారులను ఆహ్వానిస్తూ సీఎం జగన్ ట్వీట్

శిఖరాగ్ర సమావేశానికి ముందు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆరు ఆపరేటింగ్ పోర్ట్‌లతో దేశంలో రెండవ అతిపెద్ద తీరప్రాంతాన్ని కలిగి ఉన్నాము. మరో నాలుగు త్వరలో పనిచేస్తాయి. మనకు ముఖ్యమైన నగరాలను కలుపుతూ ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి.

విశాఖపట్నమా అమరావతా, మార్చి 28న తేలిపోనున్న ఏపీ రాజధాని అంశం, ఆ రోజు విచారణ జరుపుతామని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

సమ్మిట్ ప్రారంభ సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, గౌతం అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్, KM బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్, హరి మోహన్ బంగూర్, చైర్మన్, శ్రీ సిమెంట్ లిమిటెడ్, సజ్జన్ జిందాల్, చైర్మన్, JSW గ్రూప్, సంజీవ్ బజాజ్, బజాజ్ ఫిన్సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO, నవీన్ జిందాల్, చైర్మన్, జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్ కీలక ప్రసంగాలు చేస్తారు. మార్చి 3 సమ్మిట్ యొక్క మొదటి రోజు, ప్రారంభ వేడుక తర్వాత, అవసరమైన అన్ని రంగాలను హైలైట్ చేయడానికి ప్యానెల్ చర్చలు నిర్వహించబడతాయి.

హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ వేదికగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ తరపున ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పాల్గొని వివరించారు.

ఐటీ డెస్టినేషన్‌గా విశాఖపట్నం - ఐటీ మంత్రి గుడివాడ అమర్నాధ్

హైదరాబాద్ లానే విశాఖపట్నం కూడా కాస్మోపాలిషియన్ సంస్కృతితో వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధిని కలిగి ఉంది. సుందరమైన వాతావరణం,సుదీర్ఘ సముద్ర తీరం వంటి వాటితో విశాఖపట్నం అన్ని రంగాలకు వసతులు కల్పించనుంది.ప్రపంచ ఐటీ డెస్టినేషన్‌గా విశాఖపట్నంపై మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరుతో పాటు హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఏపీ కలిగి ఉంది.పారిశ్రామిక కేటాయింపులకు ఏపీలో 48,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

దాదాపు 19 రాష్ట్రాలతో పోటీ పడి దక్షిణాదిలోనే బల్క్ డ్రగ్స్ పార్క్ పొందిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా ఏపీ నెం.1 స్థానంలో ఉంది. త్వరలో 2023-2028కి కొత్త ఐటీ పాలసీని తీసుకురాబోతున్నాం. స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహిస్తూ, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, నైపుణ్యంతో పాటు ఉపాధి కల్పనను ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీ సామాజిక, ఆర్థిక, పర్యావరణ ప్రమాణాలలో నీతి ఆయోగ్ ద్వారా ఎస్డీజీలో 4వ స్థానంలో ఉంది. ఎగుమతుల్లో 1.44 లక్షల కోట్ల వృద్ధితో 6వ స్థానంలో ఉంది, గత ఏడాదితో పోలిస్తే 15.33% వృద్ధిని సాధించాం. పత్తి, పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఏపీ 2వ అతిపెద్ద ఉత్పత్తిదారు. మొబైల్ తయారీ రంగంలో ప్రతి నెలా 3.5 మిలియన్ మొబైల్‌లను ఏపీ అందిస్తోంది. అంటే ప్రతి సెకనుకు మొబైల్ ఏపీలో తయారవుతున్నాయి. రాష్ట్రంలో నాలుగు ఎలక్ట్రానిక్‌ తయారీ రంగాలు ఉన్నాయని తెలిపారు.

ఏపీ అన్ని రకాల ఎగుమతులు దిగుమతులకు ఆసియా దేశాలకు ముఖ ద్వారం - ఆర్థిక మంత్రి బుగ్గన

ఆటోమోటివ్‌లో, అశోక్ లేలాండ్, కియా, హీరో, ఇసుజు, అపోలో, యోకోహామా, భారత్ ఫోర్జ్ వంటివి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ డిజైన్ అండ్ తయారీలో బ్లూ స్టార్, ఫాక్స్‌కాన్, డయాకాన్, పానాసోనిక్, జడ్ టీటీ, ఫ్లెక్స్, వింటెక్ వంటి క్లస్టర్‌లను ఏపీ కలిగి ఉంది. అలాగే మొబైల్ తయారీకి ఏపీ కేంద్రంగా ఉంది. ఫార్మాస్యూటికల్స్ కు హైదరాబాద్‌తో పాటు ఏపీలో మైనోల్న్, బయోకాన్, లుబెన్, హెటెరో, లూరెస్, దివిస్, ఆరిబిందో, జీ.ఎస్.కె, డాక్టర్ రెడ్డిస్, వంటివి ఉన్నాయి. ఏపీలో వ్యాపార వాతావరణం కోసం సరైన పర్యావరణ వ్యవస్థ ఉందని తెలిపారు. ఇవన్నీ వరుసగా మూడేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉండేలా చేసిందని ఆయన గుర్తు చేసారు.

జంట నగరాలుగా వైజాగ్, విజయనగరం - రవిచంద్రారెడ్డి

హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఏపీటీపీసీ చైర్మన్ రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవిస్తాయని అన్నారు. కాకినాడ, నెల్లూరు, కడప ఇలా అనేక ఇతర జిల్లాలలో అనేక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అపారమైన అవకాశాలను ఏపీ అందిస్తుంది.

హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత, మేము మా ప్రాణాన్ని కోల్పోలేదని ఏపీకి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వైజాగ్ అని అన్ని రకాల మౌలిక సదుపాయాలను కలిగి ఉందని అన్నారు. అంతేకాకుండా భోగాపురం విమానాశ్రయంతో విజయనగరం, వైజాగ్ జంట నగరాలుగా ఆవిర్భవించనున్నాయి. నేను జర్మనీకి వెళ్లినప్పుడు అక్కడ హాంబర్గ్ నగరం జర్మనీకి ఆదాయాన్ని ఇవ్వడాన్ని చూసామని అలా వైజాగ్ ను ఎందుకు అభివృద్ధి చేయలేమని ఆయన ప్రశ్నించారు.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ అగ్రగామి - భరత్ కుమార్ తోట, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్

హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో భరత్ మాట్లాడుతూ.. కోకో ఉత్పత్తిలో 70% ఆంధ్రప్రదేశ్ నుండి వస్తోందని, ఏపీ కేవలం రైస్ బౌల్ మాత్రమే కాదు, ఇది దేశంలోనే పెద్ద చాక్లెట్ బౌల్ అని, అరటిపండ్లు, ఆహారం, సుగంధ ద్రవ్యాలు, టమాటా ప్రాసెసింగ్‌ కోసం ఏపీలో నాలుగు మెగా యూనిట్లు రానున్నాయని అలాగే ఏపీ అతిపెద్ద పల్ప్ ఎగుమతిదారు, ఎక్కువ పల్ప్ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, అనంతపురం జిల్లాల నుండి వస్తుందని ఆయన తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement