Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణీ, కోస్తాంధ్రకు వర్ష సూచన జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలకు చెన్నై మరోసారి విలవిల

చెన్నైకి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.

Rains (Photo-Twitter)

తమిళనాడు రాష్ట్రాన్ని (Tamil Nadu) మరోసారి భారీ వర్షాలు (Rain) ముంచెత్తాయి. ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని కన్యాకుమారి సహా 18 జిల్లాలో ఆదివారం భారీ వర్షపాతం నమోదయింది. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ఈ నేపథ్యంలో చెన్నైకి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర జిల్లాలకు కూడా వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాతాన్ని అనుకొని ద్రోణి కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించిన ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర శ్రీలంక తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించింది. ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ.

వీడియోలు ఇవిగో, బంగాళాఖాతంలో అల్పపీడనం, మళ్లీ తప్పని భారీ వర్షాలు, తమిళనాడులో స్కూల్స్‌ బంద్‌, మరో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు

దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా వేసింది. ఇక రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది.

ఉత్తర కోస్తాలో ఆదివారం తేలికపాటి వర్షాలు పడుతాయని ఐఎండీ చెప్పింది. రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. రాయలసీమ జిల్లాలో చూస్తే.... ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని పేర్కొంది. రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

 ఏపీలో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు, దేశంలో పలు రాష్ట్రాల్లో వడగండ్లుతో కూడిన వానలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన భారత వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మైచాంగ్ తుఫాను అంత తీవ్రంగా ఇప్పుడు ఉండదని, అయితే తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

Maha Kumbh Mela 2025: దారుణం, కుంభమేళాలో స్నానం చేసిన మహిళల వీడియోలు అమ్మకానికి, ఇద్దరిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు, మెటా సాయం కోరిన అధికారులు

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Andhra Pradesh: ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ, 100 శాతం న‌ష్టాన్ని కేంద్రం భ‌రించాల‌ని లేఖలో విజ్ఞ‌ప్తి

Share Now