Weather Forecast: వాయుగుండగా మారనున్న బలపడిన అల్పపీడనం, దీని ప్రభావం ఏపీపై అంతగా ఉండదని తెలిపిన వాతావరణ శాఖ, రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (low pressure) బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా (Chance of turning into a cyclone) బలపడనుంది.

Low pressure (Photo Credits: PTI)

Vjy, Dec 22: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం (low pressure) బుధవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా (Chance of turning into a cyclone) బలపడనుంది. అనంతరం ఆ వాయు­గుండం పశ్చి­మ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమ­రిన్‌ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావర­ణ విభాగం (ఐఎండీ) బుధవా­రం తెలిపింది. దీని ప్రభావం ఏపీ రాష్ట్రంపై నామమాత్రంగానే ఉండనుంది.

ఈ లక్షణాలు ఉంటే ఒమిక్రాన్ బిఎఫ్.7 బారీన పడినట్లే, నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం

మరో­­వైపు రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నే­య గాలులు వీస్తున్నా­యి. వీటి ఫలితంగా రాష్ట్రంలో (Andhra Pradesh) పొగమంచు కొనసాగనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్షీణిస్తుండడంతో చలి ప్రభా­వం అధికంగా ఉంటోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద­యం వరకు రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రం­లో పొడి వాతావరణ నెలకొంటుందని ఐఎండీ పేర్కొంది.

కరోనాపై మరోసారి యుద్ధానికి సిద్ధం, రంగంలోకి ప్రధాని మోదీ, అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్న ప్రధాని, ప్రికాషన్ డోసు సహా కరోనా కట్టడి చర్యలపై సూచనలు చేసే అవకాశం

ఈ నెల 24 నుంచి ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉం­ద­ని, ఉత్తర కోస్తాంధ్రలో పొడి వా­తావరణం ఉంటుందని తెలిపింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement