SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచే పదోతరగతి పరీక్షలు.. ఉదయం 9.30 గంటలకు పరీక్ష.. తెలంగాణ ఎస్సెస్సీ విద్యార్థులకు గ్రేస్‌ టైమ్‌.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

Representative Image (Photo Credit: PTI)

Hyderabad, Mar 18: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పదోతరగతి పరీక్షలు (SSC Exams) సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఏపీలో (AP) 7.25 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణలో (Telangana) 5.08 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే తెలంగాణ విద్యార్థులకు ఐదు నిమిషాలు అదనంగా గ్రేస్‌ టైమ్‌ ఇచ్చారు. అంటే విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు సాధ్యమైనంత ముందుగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు పేపర్లు, ఇతరత్రా పత్రాలను వెంట తీసుకెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే డిబార్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Andhra Pradesh Assembly Elections 2024: ఏపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏర్పడటం ఖాయం..ఎన్డీయేకు 400 సీట్లు ఖాయం..10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్..సీఎం జగన్ పై విమర్శలకు మోదీ దూరం..చిలకలూరిపేటలో ప్రధాని మోదీ ప్రసంగం హైలైట్స్ ఇవే..

ఉచిత బస్సు ప్రయాణం

ఎస్సెస్సీ పరీక్షలకు హాజరయ్యేవారికి తెలంగాణ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. హాల్‌ టికెట్‌ చూపిస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశాన్నిచ్చింది. ఈ సౌకర్యాన్ని సెలవు రోజుల్లోనూ వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కాంబినేషన్‌ టికెట్‌ తో ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.

Skoda Epic EV: మ‌రో ఎల‌క్ట్రిక్ కారును ఆవిష్క‌రించిన స్కోడా, ఒక్క‌సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 కి.మీ రేంజ్ ఇచ్చేలా త‌యారీ, మార్కెట్లో ఈ కంపెనీలే టార్గెట్ గా రెండో ఈవీ కారు త‌యారీ