తెలంగాణ

India Covid Updates: తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా (UK covid Strain) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు.

Banjara Hills Shocker: పనిమనిషిపై బంజారాహిల్స్‌లో 2 వారాలుగా అత్యాచారం, నిందితుడు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వ్యాపారి, ఐపీసీ సెక్షన్‌–342, 376(2), 323, 504, 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆమె పని చేస్తుండగా బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి (Sexual Harassment) పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి పొక్కితే నిన్ను, నీ కూతురును చంపేస్తానంటూ బెదిరించాడు. అంతే కాదు ఆమె సెల్‌ఫోన్‌ కూడా తన వద్దే పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడటమే కాకుండా గదిలో బంధించి బయటి నుంచి తాళం వేసి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె కూతురికి చెప్పడానికి కూడా వీల్లేకుండా పోయింది.

AP Ex-Ranji Cricketer Held: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ రూ. 40 లక్షలకు టోకరా, ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Team Latestly

వివిధ కంపెనీలు మరియు కార్పోరేట్ ఆసుపత్రులకు సంబంధించిన వెబ్‌సైట్లలో ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా వారి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించి ప్రభుత్వ టెండర్లకు ప్రతిపాదనలు చేస్తున్నాడు. ఇలా ఎల్‌బి స్టేడియంలో కంపెనీలకు సంబంధించిన హోర్డింగ్‌లు పెట్టడానికి మంత్రి నుంచి ప్రపోజల్...

COVID19 in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 170 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, అర్హులైన వారు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని అధికారుల సూచన

Team Latestly

ప్రస్తుతం రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి టీకాల పంపిణీ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు....

Advertisement

COVID19 in TS: హైదరాబాద్ నగరంలో 54 శాతం జనాభాకి వారి శరీరంలో కరోనా యాంటీబాడీలు, వెల్లడించిన తాజా సర్వే; తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 166 పాజిటివ్ కేసులు

Team Latestly

తెలంగాణలో కోవిడ్19 వ్యాప్తి కొనసాగుతోంది, అయితే రోజూవారీ కేసుల్లో గణనీయమైన మార్పులేమి లేవు. ప్రతిరోజూ 100 నుంచి 160 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో తొలి కరోనా కేసు గతేడాది మార్చి మొదటి వారంలోనే నమోదు కాగా, అప్పట్నించీ ఇప్పటివరకు ఒక ఏడాది కాలంలో హైదరాబాద్ నగరంలో...

Yadadri Temple Reopening: భక్తులకు యాదాద్రి నరసింహా స్వామి దర్శన ప్రాప్తం మే నెలలో! యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్, దేశంలోని ఆన్ని దేవస్థానాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని దిశానిర్ధేశం

Vikas Manda

శివాలయాన్ని దర్శించిన సీఎం ఋత్విక్కుల కోసం మండపం బాగా కట్టారని కితాబిచ్చారు. క్యూ కాంప్లెక్సులో భక్తులకు ఆహ్లాదంగా ఉండేలా శ్లోకాలు, భక్తి గీతాలు శ్రావ్యంగా వినిపించేలా ఏర్పాట్లుండాలన్నారు. మెట్లదారి నుంచి వచ్చే భక్తుల కోసం...

Telangana CM KCR Yadadri Tour: ఐదు నెలల తర్వాత యాదాద్రిలో సీఎం కేసీఆర్, అభివృద్ధి పనులను గురించి ఆరా తీసిన తెలంగాణ ముఖ్యమంత్రి, రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు యాదాద్రికి చేరుకున్నారు. ప్రధానాలయంతో పాటు కొండపైన, కొండకింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. హెలికాప్టర్‌లో ఉదయం 11.30 గంటల సమయంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ (Telangana CM KCR Yadadri Tour) ముందుగా స్వామివారి పూజలో పాల్గొన్నారు.

Corona in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 152 పాజిటివ్ కేసులు, మరో 2 కోవిడ్ మరణాలు నమోదు, రాష్ట్రంలో ప్రాధాన్యతా గ్రూప్ వయోజనులకు కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్

Team Latestly

బుధవారం సాయంత్రం వరకు మరో 114 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,95,821 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1948 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది....

Advertisement

Khammam Shocker: భార్యను కత్తితో పొడిచి..పురుగుల మందు తాగిన భర్త,  రక్తపు మడుగులో ఇద్దరూ విగతజీవులుగా.. ఖమ్మం జిల్లాలో విషాద ఘటన, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తే కాలయముడుగా మారి భార్యను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి (Man Assassinated His Wife) చంపేశాడు. విషాద ఘటన వివరాల్లకెళితే.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర్‌కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావు(65), విజయలక్ష్మి(60) దంపతులు కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కుమార్తె ఫారిన్‌లో ఉండగా.. మరొకరు రామగుండంలో ఉద్యోగం చేస్తున్నారు.

Bird Flu Fear in Telangana: తెలంగాణలో మిస్టరీ వ్యాధి, రెండు గంటల్లో నాలుగు వేల కోళ్లు మృతి, కాల్వ శ్రీరాంపూర్‌లో నాటు కోళ్లు అకస్మాత్తుగా మృతిపై జిల్లాలో కలకలం, బర్డ్ ఫ్లూ సోకిందనే అనుమానాలు

Hazarath Reddy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాల్వ శ్రీరాంపూర్‌లో నాలుగు వేల నాటు కోళ్లు (4000 hens died) అకస్మాత్తుగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. బర్డ్ ఫ్లూ సోకిన (Bird Flu Fear in Telangana) కారణంగానే కోళ్లు చనిపోయినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పూట దాణా తిన్న తర్వాత రెండు గంటల్లోనే నాలుగు వేల కోళ్లు మృతి చెందాయి.

COVID Status in TS: తెలంగాణలో కోరోనా సెకండ్ వేవ్ సంకేతాలు లేవు, కొనసాగుతున్న కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా 168 పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు పబ్లిక్ హెల్త్ కేర్ ఆఫీసర్లు పేర్కొన్నారు. తెలంగాణలో కరోనావైరస్ సెకండ్ వేవ్ పరిస్థితులు ఏమి లేవని, రోజూవారీ కరోనా కేసులు సాధారణ స్థాయిలోనే ఉంటున్నాయని వారు స్పష్టం చేశారు....

Hyderabad Nawabs: భాగ్యనగరంలో అపర భాగ్యవంతులు, ప్రపంచ కుబేరుల జాబితాలో 10 మంది హైదరాబాదీలు, ఫార్మా రంగం నుంచే నగరానికి చెందిన ఏడుగురు బిలియనీర్లు

Team Latestly

Advertisement

Telangana Shocker: వయసు ఎక్కువని తోటి విద్యార్థులు గేలి, మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య, అప్పులు బాద తట్టుకోలేక మరోచోట యువకుడు బలవన్మరణం, ఇంకో చోట కులాంతర వివాహంతో యువకుడు ఆత్మహత్య, న్యాయం చేయాలని అత్తింటి ఎదుట బైఠాయించిన వివాహిత

Hazarath Reddy

స్కూలులో తోలి విద్యార్థులు నీవు మా కంటే పెద్దవాడివని హేలన చేయడంతో తట్టుకోలేక ఈ యువకుడు ఆత్మహత్య (Young Man committed suicide) చేసుకున్న విషాద ఘటన వికారాబాద్‌ ఠాణా పరిధిలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.

Vaccination in TS: తెలంగాణలో చురుగ్గా కొనసాగుతున్న రెండో ఫేస్ కోవిడ్ వ్యాక్సినేషన్, తొలిరోజు 70 శాతం పైగానే టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Vikas Manda

తెలంగాణలో తొలిరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో 75 శాతం వ్యాక్సినేషన్ జరిగిందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 62 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయబడుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డోసుకు రూ. 250 ఛార్జ్ చేయాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది....

Telangana Shocker: ఆ అంకుల్ నచ్చాడు..అందుకే ఆయనతో వెళ్లిపోతున్నా, హయత్‌నగర్‌లో ఓ మైనర్ బాలిక నిర్వాకం, యాదయ్య అంకుల్‌ నచ్చాడు.. నా ఇష్టప్రకారమే వెళ్తున్నా అంటూ సోదరుడికి మెసేజ్, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో విచిత్రఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పిన ఓ అంకుల్ ఆమెను తనతో (Telangana Shocker) తీసుకుపోయాడు. తెలిసీ తెలియని వయసలు ఆ మైనర్ బాలిక ఆ ఆంకుల్ తో వెళ్తన్నానంటూ (minor girl Escaped with his uncle) వాట్సప్ ద్వారా సోదరుడికి మెసేజ్ పంపింది.

Medaram Temple Closed: మేడారం ఆలయం మూసివేత, మార్చి 21 వరకు ఆలయం తెరచుకోదని తెలిపిన ఈవో రాజేంద్ర, మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన పలువురుకి కరోనా

Hazarath Reddy

నదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు రోజుపాటు జరిగిన చిన్న జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 21 రోజులపాటు మూసిఉంచాలని (Medaram Temple Closed) అధికారులు నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఈ నెల 21 వరకు ఆలయం తెరచుకోదని వెల్లడించారు.

Advertisement

Telangana COVID Report: నేటి నుంచి తెలంగాణలో రెండో ఫేజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, 60 ఏళ్లు పైబడిన వారికి టీకాల పంపిణీ, రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా మరో 116 పాజిటివ్ కేసులు నమోదు

Vikas Manda

టీకా పొందేందుకు అర్హులైన పౌరులందరూ తమ పేర్లను www.cowin.gov.in లో లేదా COWIN 2.0 యాప్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్ ద్వారా టీకా వేసే తేదీ మరియు టైమ్ స్లాట్ గురించి తమ మొబైల్‌లో సందేశం పొందుతారు.....

Cows Slaughtered in TS: గోవధ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 14 రోజుల రిమాండ్‌ విధించిన కోర్టు, సిద్ధిపేటలో 16 గోవులను వధించి హైదరాబాద్‌లో విక్రయించిన నిందితులు

Hazarath Reddy

సిద్దిపేట పట్టణంలో శుక్రవారం పట్టణ శివారులోని ఓ కోళ్ల ఫాంలో కొందరు 68 గోవులను తీసుకొచ్చి వాటిని చంపి (Cows Slaughtered in TS) మాంసాన్ని హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యా రు. తొలుత 16 గోవులను వధించిన విషయం విదితమే. ఈ గోవధ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana Shocker: నడిరోడ్డుపై తండ్రిని అతి దారుణంగా చంపేసిన కొడుకు, నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లిలో దారుణ ఘటన, పోలీసులపై మండి పడుతున్న స్థానికులు

Hazarath Reddy

నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రిని కన్నకొడుకే తండ్రిని బండరాయితో అతిదారుణంగా (Telangana Shocker) హత్యచేశాడు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు.

India Covid Updates: దేశంలో భారీ స్థాయిలో పెరుగుతున్న కోవిడ్ కేసులు, తాజాగా 16,752 మందికి కరోనా, మహారాష్ట్రలో కొత్తగా 8,623 మందికి కోవిడ్, తెలంగాణలో 176 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో 118 మందికి కోవిడ్

Hazarath Reddy

దేశంలో గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్‌ కేసులు (India Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి.

Advertisement
Advertisement