CM Revanth Reddy Tour: నేడు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట, మూసీ పునరుజ్జీవ యాత్ర.. రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు.

CM Revanth Reddy Pree Meet (Photo/X/Congress)

Hyderabad, Nov 8: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanthreddy) నేడు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ (Hyderabad) నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన యాదగిరిగుట్ట చేరుకుంటారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం అక్కడి నుంచి సంగెంకు చేరుకుంటారు.

మీ కొవ్వును కరిగిస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి సీఎం చంద్రబాబు వార్నింగ్, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

ఇక సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రను కూడా నేడే రేవంత్ చేపడతారు. శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు. మూసీ పరీవాహక రైతులతో ఆయన ముచ్చటించనున్నారు.

మైక్ ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పిన జగన్, ఇక నుంచి మీరే నా స్పీకర్లు అని మీడియా ప్రతినిధులకు సూచన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement