Telangana Unlock Update: హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో మార్పులు, ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో సర్వీసులు, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదేశాలు

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తి వేసిన నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు అందుబాటులో (Hyderabad Metro to Operate From 7 AM to 9 PM) ఉంటాయి.

metro Representative Image

Hyderabad, June 20: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తి వేసిన నేపథ్యంలో మెట్రో రైలు సర్వీసుల సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం నుంచి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు అందుబాటులో (Hyderabad Metro to Operate From 7 AM to 9 PM) ఉంటాయి.

ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్‌, చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం నిబంధనలు పాటించాలని మెట్రో అధికారులు కోరారు.

ఈ పాస్ అవసరం లేదు, తెలంగాణ సరిహద్దులో ఆంక్షలు ఎత్తివేసిన అధికారులు, అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై ఇంకా రాని క్లారిటీ, ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ

జీహెచ్ఎంసీలో (GHMC Vaccination) వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ జోరుగా కొనసాగుతోంది. ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. రోజుకి 45 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు 6 లక్షల 50 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్‌ కోసం మొత్తం 60 సెంటర్లను బల్దియా ఏర్పాటు చేసింది. మరోవైపు రేపటి నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు.

తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం, పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో హాజరుకావచ్చు, విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్‌ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి నుంచి ఆంక్షలు కూడా ఎత్తేస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో వాహనాలు యధావిధిగా నడువనున్నాయి. కాగా.. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో నడస్తాయని ప్రకటించినప్పటికీ.. ఒక్క అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలపై క్లారిటీ రాలేదు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Hyderabad Metro: 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)

Good News For Sankranti: సంక్రాంతి వేళ రైల్వే శాఖ శుభవార్త.. విశాఖ-హైదరాబాద్ వందేభారత్ రైలుకు అదనంగా 8 బోగీలు.. అందుబాటులోకి మొత్తంగా 16 కోచ్ లు

CM Revanth Reddy On Metro DPR: మెట్రో డీపీఆర్‌లకు మార్చ్ డెడ్‌లైన్..ఏప్రిల్‌లో టెండర్లు పిలవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి..ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని ఆదేశం

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

Share Now