No Sleep For 45 Days: '45 రోజులుగా నిద్రలేదు'.. పని ఒత్తిడితో మరో ఉద్యోగి ఆత్మహత్య.. బజాజ్ ఫైనాన్స్‌ సంస్థలో ఘటన

పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది.

Work Pressure Suicide (Credits: X)

Newdelhi, Oct 1: పని ఒత్తిడి (Work Pressure) కారణంగా సతమతమై చివరకు ప్రాణాలు కోల్పోతున్న  ఉద్యోగుల ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకొంది. బజాజ్ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. దాదాపు 45 రోజులు నిద్ర పోకుండా పని చేశానని.. ఒత్తిడి కారణంగానే చనిపోతున్నట్లు సూసైడ్‌ లేఖలో తెలిపాడు. మృతుడిని ఝాన్సీకి చెందిన తరుణ్‌ సక్సేనా (42)గా గుర్తించారు.

'జ‌గ‌న‌న్న తోడు' ప‌థ‌కం పేరు మారుస్తూ ఏపీ స‌ర్కార్‌ ఉత్తర్వులు జారీ.. 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మార్చిన ప్ర‌భుత్వం

అసలేం జరిగింది?

తరుణ్‌ సక్సేనా బజాజ్ ఫైనాన్స్‌ కంపెనీలో ఏరియా మేనేజర్‌ గా పని చేస్తున్నారు. అయితే.. టార్గెట్‌ లు పెడుతూ తనపై ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. పనిని సమయానికి పూర్తి చేయకపోతే.. జీతాన్ని కుదిస్తామని బెదిరించేవారు. దీంతో 45 రోజులు నిద్ర మానేసి మరి పని చేశారు. తన సమస్య గురించి సీనియర్లకు వివరించినా.. పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడికి గురైన తరుణ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు భార్యకు రాసిన ఐదు పేజీల సూసైడ్‌ నోట్‌ లో తన ఆత్మహత్యకు గల కారణాలను తరుణ్ వివరించారు. కాగా.. పని ఒత్తిడి కారణంగా యర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Kisan Credit Card: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..

Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బ‌డ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం హైలెట్స్ మీకోసం..

Andhra Pradesh Horror: పల్నాడు జిల్లాలో దారుణం, తండ్రి వృద్ధుడు అయ్యాడని కాలువలో తోసిన కొడుకు, భార్య పోరు పడలేక అలా చేశానని పోలీసులకు వాంగ్మూలం

Andhra Pradesh Horror: విశాఖలో దారుణం, కన్నతల్లిని దారుణంగా చంపిన కసాయి కొడుకు, ఆన్ లైన్ గ్రేమ్స్‌ ఆడవద్దన్నందుకు కక్ష గట్టి ఘాతుకం

Share Now