Kerala Horror: కేరళలో ఘోరం.. సీటు కోసం రైలులో తోటి ప్రయాణీకులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు.. ముగ్గురు మృతి..

కేరళలో ఘోరం చోటు చేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో సీటు కోసం వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో సహా ముగ్గురు మరణించారు.

Representational Image (Credits: Twitter)

Newdelhi, April 3: కేరళలో (Kerala) ఘోరం చోటు చేసుకుంది. రైలులో (Train) ప్రయాణిస్తున్న సమయంలో సీటు (Seat) కోసం వివాదం తలెత్తడంతో ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో మహిళతో సహా ముగ్గురు మరణించారు. రైలు బోగీకికూడా మంటలు అంటుకొన్నాయి. దీంతో ప్రయాణీకులు భయబ్రాంతులకు గురయ్యారు. చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడినుంచి ఓ బైక్ పై పరారయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. అలప్పుజా – కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ ప్రెస్‌లోని డీ1 కోచ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

McDonald’s Layoffs: అమెరికాలోని తమ కార్పొరేట్ కార్యాలయాలను ఈ వారం మూసేస్తున్నట్టు మెక్ డొనాల్డ్స్ ప్రకటన.. ఉద్యోగులను తీసివేయడంలో ఇది ముందస్తు వ్యూహమని అనుమానాలు

సీటు కోసం..

కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌ను దాటి కోరాపుజ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు ఎక్కే సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సీటు విషయంలో మహిళతో వ్యక్తి గొడవ పడ్డాడు. అయితే బోగీలోని కొందరు ప్రయాణీకులు మహిళకు మద్దతుగా నిలిచాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వ్యక్తి.. తన వద్దఉన్న పెట్రోల్ బాటిల్ ను తీసుకొని మహిళా ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో ముగ్గురు మరణించారు.

SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు.. 8.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి.. తొలి రోజు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి.. హాల్ టికెట్ చూయిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం.. పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ జరిగితే ఇన్విజిలేటర్లదే బాధ్యత

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement