APSRTC Special Buses: దసరా నేపథ్యంలో 1,850 ప్రత్యేక సర్వీసులకు ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్, తెలంగాణతో ఇంకా కొలిక్కిరాని చర్చలు, జోరు పెంచిన ప్రైవేటు ఆపరేటర్లు

రానున్న దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు (APSRTC will operate 1,850 special buses) నడపనుంది. అక్టోబర్ 15 నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది .

APSRTC to Resume Indra AC Bus Services (Photo-Facebook)

Amaravati, Oct 16: రానున్న దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు (APSRTC will operate 1,850 special buses) నడపనుంది. అక్టోబర్ 15 నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది . సాధారణంగా ఏటా దసరా పండుగకు (Vijayadashami) 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో (Telangana) అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది.

ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆర్టీసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు కొలిక్కి రావడం లేదు. విజయదశమి పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది.

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం నేడే, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా లాంచ్, తీరనున్న విజయవాడ వాసుల కష్టాలు

ఇక తెలంగాణతో ఒప్పందం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్‌ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభించారు.

ఉన్మాదిలా మారిన యువకుడు, ప్రేమించలేదని కత్తితో యువతిపై దాడి, తర్వాత ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, ఉన్మాద చర్యలను ఉపేక్షించేది లేదని తెలిపిన హోం మంత్రి సుచరిత

టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రవాణా శాఖ కమిషనర్‌ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్‌ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సులివీ..

శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి–342, పశి్చమగోదావరి–40,

కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68,

నెల్లూరు–156, చిత్తూరు–252, కర్నూలు–254, కడప–90, అనంతపురం–228

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement