India

Tuni Sexual Assault Case: మలుపులు తిరుగుతున్న తుని కేసు, నిందితుడు నారాయణరావు ఆత్మహత్య, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు, అసలేం జరిగింది ?

Team Latestly

కాకినాడ తునిలో బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు

Andhra Pradesh: వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన

Team Latestly

ఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు.

Andhra Pradesh Shocker: కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..

Team Latestly

కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.

Droupadi Murmu Helipad Mishap in Kerala: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం, ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్, వీడియో ఇదిగో..

Team Latestly

కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన హెలిప్యాడ్‌లో అనుకోని సమస్యల కారణంగా కొంచెం కుంగి, ఒక పక్కకు ఒరిగింది. ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

HC On Sexual Assault Case: శారీరక సంబంధం అంటే రేప్ కాదు, పోక్సో కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు, నిందితుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశం, కేసు పూర్వాపరాలు ఏమిటంటే..

Team Latestly

పోక్సో చట్టం కింద నమోదైన ఒక ముఖ్యమైన కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో, బాధితురాలు తన వాంగ్మూలంలో ఉపయోగించిన శారీరక సంబంధం అనే పదాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడు అత్యాచారం చేశాడని ట్రయల్ కోర్టు నిర్ణయించగా.. హైకోర్టు ఈ తీర్పును రద్దు చేసింది.

Sleep Tips: మీరు 8 గంటలు నిద్రపోతున్నా మీ సమస్య తీరడం లేదా.. బెడ్ మీద నుంచి లేవగానే నీరసంగా ఉంటోందా.. కారణం ఇదే అంటున్న వైద్య నిపుణులు

Team Latestly

వైద్యులు తరచుగా కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తారు. ఎందుకంటే మన శరీరం శక్తిని పునరుద్ధరించడానికి, మానసిక ఫోకస్ నిలుపుకోవడానికి, జీవక్రియలను సరిగా కొనసాగించడానికి నిద్రను అత్యవసరంగా అవసరమని గుర్తించారు వైద్యులు. కానీ నిజానికి, కేవలం 8 గంటలు నిద్రపోవడం అంటే మేల్కొన్నప్పుడు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉండటం అనే హామీ కాదు.

Diabetic Wound Treatment: మధుమేహం రోగులకు గుడ్ న్యూస్, పాదాలకు అయ్యే పుండ్లకు చెక్, గాయాలను వేగంగా మాన్పే సహజ సిద్ధ ఔషధాన్ని కనిపెట్టిన నాగాలాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు

Team Latestly

మధుమేహం (డయాబెటిస్) రోగులను ఎప్పుడూ వేధించే సమస్య ఏదైనా ఉందంటే అది త్వరగా మానని పుండ్లు. ముఖ్యంగా పాదాలకు అయ్యే ఈ పుండ్లు (డయాబెటిక్ ఫుట్ అల్సర్) ఒక్కోసారి ఇన్ఫెక్షన్లకు దారితీసి, అవయవాలను తొలగించాల్సిన పరిస్థితిని కల్పిస్తాయి. దీంతో మధుమేహం వ్యాధిగ్రస్తులు అంగవైకల్యానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది.

Tirumala Rain Alert: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, వీడియో ఇదిగో..

Team Latestly

తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడుగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది.

Advertisement

Sanae Takaichi: జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సనై టకైచి, పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ- జపాన్‌ ఇన్నోవేషన్‌ పార్టీ కూటమితో భారీ మద్ధతు

Team Latestly

జపాన్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సనై టకైచి దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (LDP) అధ్యక్షురాలిగా ఉన్న తకైచి, పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పదవీ విరమణ చేసిన షిగెరు ఇషిబాకు తరువాత ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.

IMD Alert: వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు, అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

Team Latestly

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే వారంలో దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వివరణాత్మక హెచ్చరిక జారీ చేసింది.

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ జోన్‌ను తాకిన వాయు కాలుష్యం, పట్టపగలు కూడా ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిక, వీడియోలు ఇవిగో..

Team Latestly

ఢిల్లీలో కాలుష్యం (Air Pollution) రెడ్ జోన్‌ను తాకింది.దీపావళి వేడుకల తర్వాత వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీ అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అనేక ప్రాంతాల్లో AQI 400 మార్కును దాటింది.

Andhra Pradesh: ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్ళమని చెప్పినందుకు బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగిన మహిళ, పోలీస్ స్టేషన్‌లో నా బొమ్మ చూపించు అంటూ ఫైర్

Team Latestly

జగ్గయ్యపేట నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. బస్ ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్లమని డ్రైవర్ సూచించిన తరువాత డ్రైవర్, మరో ప్రయాణికునితో తీవ్రంగా గొడవకు దిగింది. ఈ సంఘటన బస్‌లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల ముందు చోటుచేసుకుంది.

Advertisement

Bengaluru: దారుణం, కాలేజీలోనే ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై క్లాస్‌మేట్‌ అత్యాచారం , గర్భం రాకుండా పిల్ కావాలా అంటూ ఫోన్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Team Latestly

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ఇంజినీరింగ్‌ విద్యార్థినిపై తన క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన అక్టోబర్ 10న లంచ్‌ బ్రేక్ సమయంలో జరిగింది. 21 ఏళ్ల జీవన్ గౌడ అనే వ్యక్తి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు.

Dhanteras 2025: ధంతేరస్ నాడు బంగారమే కాదు ఈ వస్తువుల కూడా కొంటే అదృష్టం మీ తలుపు తడుతుంది, ధనలక్ష్మిని ఆరాధించే పవిత్రమైన రోజు గురించి తెలుసుకోండి

Team Latestly

ధంతేరస్, దీపావళి పండుగకు ముందే వచ్చే పండుగ. హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యత కలిగినది. దీన్ని త్రయోదశి నాడు జరుపుకుంటారు, అందుకే ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది (2025) ధంతేరస్ అక్టోబర్ 18న జరిగింది. దీపావళి వేడుకలు దీనితో ప్రారంభమై ఐదు రోజులు కొనసాగుతాయి.

Diwali Wishes in Telugu: దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్ ఇవిగో.. దీపావళి అక్టోబర్ 20 లేదా 21నా? ఏ తేదీ కరెక్ట్.. పండితులు ఏమి చెబుతున్నారు?

Team Latestly

భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగలో ఒకటి దీపావళి. పెద్దలు కూడా పిల్లలులాగా ఆనందించే ఈ పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి, హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగగా.. లక్ష్మీదేవి పూజతో పాటుగా సంపద, శ్రేయస్సు, సుఖశాంతి కోసం జరుపుకుంటారు.

Lakshmi Puja Wishes in Telugu: దీపావళి పండుగ నాడు లక్ష్మీ పూజ చేసే సమయం ఇదే..ఈ టైంలో పూజ చేస్తేనే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని చెబుతున్న పండితులు, బెస్ట్ విషెస్, కోట్స్ మీకోసం..

Team Latestly

దీపావళి అనేది హిందూ ధర్మంలో వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందినది. దీన్ని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు ప్రారంభమై, కార్తీక మాసం శుక్లపక్షం విదియ తేది వరకు ఐదు రోజులుగా జరుపుకుంటారు.

Advertisement

CWG 2030 in India: 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్, అహ్మదాబాద్ వేదికగా క్రీడలు ప్రారంభం, భారతదేశానికి దక్కబోతున్న మరో అంతర్జాతీయ గౌరవం

Team Latestly

భారతదేశానికి మరో అంతర్జాతీయ గౌరవం దక్కబోతోంది.2030 కామన్వెల్త్ క్రీడలను భారత్ నిర్వహించబోతుంది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఈరోజు (అక్టోబర్ 16) ప్రకటించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఈ మహత్తర క్రీడా సమారంభానికి వేదిక కానుంది.

Bengaluru: వీడియో ఇదిగో, నాకే ఎదురు చెబుతావా అంటూ.. ప్రయాణికుడిని పదేపదే చెంప దెబ్బలు కొట్టిన ట్రాఫిక్ పోలీసు, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

Team Latestly

భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్ దగ్గర తప్పుడు మార్గంలో వాహనం నడిపినందుకు బైకర్‌ను ఆపేసిన ఒక ట్రాఫిక్ పోలీసు అతడిని పదేపదే చెంపదెబ్బ కొట్టినట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఆ ఫుటేజ్‌లో ఆ రైడర్ ట్రాఫిక్ పోలీసుతో వాదులాడుతుండగా.. ఇతర అధికారులు పరిస్థితిని శాంతింపజేయడానికి ముందుకు వస్తున్నట్లు కనిపిస్తోంది

PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.

SC Verdict on BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టులో విచారణ సాగుతున్నందున పిటిషన్‌ను స్వీకరించబోమని స్పష్టం

Team Latestly

తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Advertisement
Advertisement