Uttar Pradesh: వైద్యులే కామాంధులైన వేళ..ఆపరేషన్ ధియేటర్లో సామూహిక అత్యాచారానికి గురైన మీర్జాపూర్ యువతి మృతి, ఘటనపై దర్యాప్తు కోసం రెండు విచారణ కమిటీలు ఏర్పాటు
ఆసుపత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ (Woman Dies After She Was Allegedly Raped In Operation Theatre) మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి వైద్యులు (SRN Hospital) తనపై అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించారు.
Prayagraj, June 8: ఆసుపత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ (Woman Dies After She Was Allegedly Raped In Operation Theatre) మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి వైద్యులు (SRN Hospital) తనపై అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించారు. మే 29వతేదీన తాను పేగు సమస్యతో ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేరితే శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లి తనపై వైద్యులు అత్యాచారం చేశారని బాధితురాలు తన సోదరుడికి ఫిర్యాదు చేశారు.
మే 29 న మహిళ పేగు సమస్యల వల్ల ఆసుపత్రిలో చేరింది.జూన్ 1 న, మహిళను శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు, ఈ సమయంలో ఆమెను వైద్యుల బృందం సామూహిక అత్యాచారం చేసింది. శస్త్రచికిత్స తర్వాత చాలా అసౌకర్యానికి గురైన ఓ మహిళ, తన సోదరుడికి OT లోపల ఆసుపత్రి వైద్యులు సామూహిక అత్యాచారం చేసినట్లు ఒక నోట్లో వెల్లడించారు.
వైద్యులు మంచివారు కాదని, తప్పు చేశారని, తనకు చికిత్స కూడా చేయలేదని బాధితురాలు కాగితంపై రాశారు. దీంతో స్థానిక పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. అయితే మరికాసేపట్లో పోలీసులు వాగ్మూలం రిపోర్ట్ చేసుకునేందుకు వస్తారనగా యువతి మృతి చెందింది. దీంతో యువతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Here's Video
దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. యువతికి ఆపరేషన్ చేసిన సమయంలో ఇద్దరు మగ వైద్యులున్నారని, నలుగురు మహిళా సర్జన్లు, నర్సు ఉన్నారని అత్యాచారం జరిగిందనే విషయాన్ని ఎస్పీ సింగ్ కొట్టిపారేశారు. యువతి మానసిక స్థితి బాగాలేకనే వైద్యులపై ఆరోపణలు చేసిందని పోలీసులంటున్నారు.
మహిళ యొక్క సోదరుడు బాధితురాలి కాగితం మీద రాస్తున్న సమయంలో వీడియో (Video Showing Her Seeking Help in Writing) తీశారు, దీనిలో ఆమె సహాయం కోసం విజ్ఞప్తి చేయడం మరియు OT లోపల ఆమెకు ఏమి జరిగిందో దాని గురించి ఒక చిన్న గమనిక రాయడం చూడవచ్చు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వైరల్ అయ్యింది.
ఎస్ఆర్ఎన్ హాస్పిటల్ వైద్యులపై మహిళ చేసిన సామూహిక అత్యాచార ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి రెండు విచారణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక దర్యాప్తు కమిటీని ఎస్ఆర్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ ఏర్పాటు చేయగా, రెండవ దర్యాప్తు బృందాన్ని సిఎంఓ ప్రయాగ్రాజ్ ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో డాక్టర్ వత్సల మిశ్రా, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ అరవింద్ గుప్తా, డాక్టర్ అమృత చౌరాసియా, డాక్టర్ అర్చన కౌల్ ఉన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)