Mobile Bill May Rise: మళ్లీ పేలనున్న మొబైల్ బాంబు, టారిఫ్ ధరలను పెంచే యోచనలో కంపెనీలు, 25 నుంచి 30 శాతం వరకూ పెరిగే అవకాశం, విపరీతంగా పెరిగిన మొబైల్ వినియోగం

టెల్కోలు మళ్లీ మొబైల్ యూజర్లపై బాంబును పేల్చేందుకు రెడీ అయింది. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం(Mobile Bill May Rise) పడనుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూజర్‌ (Mobile User) నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటమే..ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు(Telcos) మొబైల్‌ టారిఫ్‌ను(Mobile tariff) మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telecom companies starved for funds, your mobile bill may rise up to 30%( Photo-PTI)

New Delhi,January 30: టెల్కోలు మళ్లీ మొబైల్ యూజర్లపై బాంబును పేల్చేందుకు రెడీ అయింది. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్‌ ఫోన్‌ యూజర్లపై ఈ ఏడాది అధిక చార్జీల భారం(Mobile Bill May Rise) పడనుందనే సంకేతాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూజర్‌ (Mobile User) నుంచి సగటు రాబడి ఇంకా తక్కువగానే ఉండటమే..ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు(Telcos) మొబైల్‌ టారిఫ్‌ను(Mobile tariff) మరోసారి 25 నుంచి 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏజీఆర్‌ చెల్లింపులపై సుప్రీంకోర్టు(Supreme Court) నుంచి వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లకు ఎలాంటి ఊరట లేకపోవడంతో వనరుల సమీకరణ కోసం కాల్‌ చార్జీల పెంపునకు ఈ కంపెనీలు మొగ్గుచూపనున్నాయి. యూజర్‌ నుంచి సగటు రాబడి రూ 180 కంటే తక్కువగా ఉండటంతో కొంచె పెంచితే రాబడి రావచ్చనే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి.

3 రోజుల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ

అదీకాకుండా ప్రపంచ దేశాలతో పోలిస్తే టెలికాంపై వినియోగదారులు వెచ్చించే మొత్తం భారత్‌లోనే తక్కువే కావడం వంటి అంశాలను పరిశీలిస్తే టెలికాం కంపెనీలు ఈ ఏడాది చివరిలో టారిఫ్‌లను 30 శాతం వరకూ పెంచే అవకాశం ఉందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు.

యూజర్లకు జియో షాక్, 40 శాతం పెరిగిన టారిఫ్ ధరలు

కాగా గత నెలలో భారతి ఎయిర్‌టెల్‌(Airtel), వొడాఫోన్‌ ఇండియా Vodafone), రిలయన్స్‌ జియో(Jio) మూడేళ్లలో తొలిసారిగా కాల్‌ చార్జీలను 14 నుంచి 33 శాతం వరకూ పెంచిన సంగతి తెలిసిందే.

యూజర్లకు టెల్కోల షాక్

టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్‌ను పెంచినా వినియోగదారులు ఇప్పటికీ వారి కమ్యూనికేషన్‌ అవసరాలపై కేవలం 0.86 శాతం మాత్రమే తలసరి ఆదాయం వెచ్చిస్తున్నారని ఇది నాలుగేళ్ల కిందటి మొత్తంతో పోలిస్తే చాలా స్వల్పమని సెల్యులార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మ్యాథ్యూస్‌ అన్నారు.

ఛార్జింగ్‌లో ఉండగా పేలిన మొబైల్ ఫోన్

డేటా అందుబాటులోకి రావడంతో మొబైల్‌ వినిమయం విపరీతంగా పెరిగిన క్రమంలో మొబైల్‌ బిల్లు కొంత అదనంగా చెల్లించేందుకు యూజర్లు వెనుకాడరని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ భాసిన్‌ చెప్పుకొచ్చారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Waqf Bill Approved: వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం, ఈ నెల 31 నుంచి రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు, ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే..

Birthright Citizenship Panic: అమెరికా పౌరసత్వం కోసం భారత మహిళలు దారుణం, 9 నెలలకు పుట్టాల్సిన బిడ్డను మధ్యలోనే సీజేరియన్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఆస్పత్రులకు పరుగులు

CM Chandrababu Davos Tour Highlights: దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన హైలెట్స్ ఇవిగో, బిల్ గేట్స్‌తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్

Share Now