Wuhan Deaths Mystery: వుహాన్‌ కరోనా చావుల మిస్టరీ, కరోనా వల్ల వుహాన్‌లో 42 వేల మందికి పైగా మృతి, 3200 మంది చనిపోయారంటూ చైనా అధికారిక ప్రకటన, RFA కథనంలో నిజమెంత ?

చైనాలో 2019లో పుట్టిన కరోనావైరస్ (Coronavirus outbreak in China) ఆ దేశాన్ని 4 నెలల పాటు వణికించిన సంగతి విదితమే. కాగా ఈ వైరస్ దెబ్బకు చైనాలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే వైరస్ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ చైనాలో కోవిడ్ 19 కారణంగా వుహాన్ లో (Wuhan) కేవలం 3200మంది మాత్రమే చనిపోయారని ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది అంతా అవాస్తవమని ((Wuhan Deaths Mystery) RFA సంచలన కథనాన్ని వెలువరించింది.

Image Used For Representative Purpose Only. | File Photo

Wuhan, Mar 30: చైనాలో 2019లో పుట్టిన కరోనావైరస్ (Coronavirus outbreak in China) ఆ దేశాన్ని 4 నెలల పాటు వణికించిన సంగతి విదితమే. కాగా ఈ వైరస్ దెబ్బకు చైనాలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే వైరస్ తీవ్రత ఆ స్థాయిలో ఉన్నప్పటికీ చైనాలో కోవిడ్ 19 కారణంగా వుహాన్ లో (Wuhan) కేవలం 3200మంది మాత్రమే చనిపోయారని ఆ దేశం అధికారికంగా వెల్లడించింది. అయితే ఇది అంతా అవాస్తవమని ((Wuhan Deaths Mystery) RFA సంచలన కథనాన్ని వెలువరించింది.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

ఇదిలా ఉంటే చైనాలోని (China) వుహాన్ వాసులు మాత్రం తమ నగరంలోనే ఏకంగా 42,000 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారని చెబుతున్నారు. కాగా సెంట్రల్ చైనా నగరమైన వుహాన్‌లో అధికారులు రెండు నెలల తర్వాత కరోనావైరస్ లాక్‌డౌన్‌ను (Coronavirus lockdown) ఎత్తివేసినప్పుడు, నగరంలో ఇప్పటి వరకు 2,500 మంది మరణించారని అదికారులు చెబుతున్నారు. అయితే ఇది ఖచ్చితమైన సంఖ్య కాదని దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అక్కడి నివాసితులు తెలిపారు.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

మీడియాకు అందిన సమాచారం ప్రకారం మృతుల గురించి సమగ్రంగా దర్యాప్తు జరగలేదని, లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే మరణించారని చెబుతున్నారు. ఒక్క నెలలోనే 28 వేల మృతదేహాలను దహనం చేశారనే వార్తలు వినిపించాయి.

చైనాలో పంజావిప్పిన ఘోరమైన నోవల్ కరోనావైరస్ 

వారం ప్రారంభం నుండి చనిపోయిన వారి అస్తిక కళశాలను బంధువులకు ఇస్తున్నారని వీటి సంఖ్య ప్రతి రోజు 500కు పైగానే ఉందని అక్కడి వాసులు చెబుతున్నారు. ఇలా 7 అంత్యక్రియల గృహాల నుంచి ప్రతిరోజూ సుమారు 3500 మందికి అస్తికలు కలశాలను ఇస్తున్నారు.ఈ విధంగా 12 రోజుల్లో 42 వేల అస్తికలు కలశాలను వారి బంధువులకు అందజేయనున్నారని తెలుస్తోంది.

ప్రపంచ దేశాలకు పరుగులు

కాగా అధికారిక గణాంకాల కంటే గతంలో ఎక్కువ మంది మరణించారని వారు సూచిస్తున్నారు. ఈ సంఖ్య దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చైనా ఇంత తక్కువ మంది ఎలా చనిపోయారని చెబుతుందో అర్థం కావడం లేదని అక్కడ నివసిస్తున్న జాంగ్ అనే వ్యక్తి RFA కి చెప్పారు.

వైరస్ భారీన పడి మృతి చెందిన వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్

కాగా అంత్యక్రియల గృహాలు ఏప్రిల్ 5 న క్వింగ్ మింగ్ యొక్క సాంప్రదాయ సమాధి-ఉత్సవానికి ముందు దహన సంస్కారాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాయని ఇప్పటికే  చనిపోయిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చాయి, ఇది మార్చి 23 నుండి ప్రారంభమయితే 12 రోజుల ప్రక్రియను సూచిస్తోంది. దీని ప్రకారం చూసినా కూడా 42 వేల మంది మరణాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచానికి పెను ముప్పు

కాగా అంత్యక్రియలకు గృహాల దహన సామర్థ్యంపై ఆధారపడి ఉందని అక్కడి వారు చెబుతున్నారు. ఇందులో 84 కొలిమిలను ఉపయోగిస్తున్నారు. ఒక్కో గృహా దహనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని వారు చెబుతున్నారు. వుహాన్ రాజధాని అయిన హుబీ ప్రావిన్స్ నివాసి, లాక్డౌన్కు ముందు మరియు సమయంలో నగరంలో 40,000 మందికి పైగా మరణించారని దీనిని అక్కడి చాలా మంది ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు.

శ్మశానాలుగా మారిన చైనా నగరాలు

కాగా "అధికారులు క్రమంగా వాస్తవ గణాంకాలను, ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా విడుదల చేస్తున్నారని, తద్వారా ప్రజలు క్రమంగా వాస్తవికతను అంగీకరించడానికి వస్తారని హుబీ ప్రావిన్స్ నివాసి మీడియాకు తెలిపారు. COVID-19 తో బాధపడుతున్న లేదా చికిత్స చేయకుండా చాలా మంది ఇంట్లో మరణించారని ప్రావిన్షియల్ సివిల్ ఎఫైర్స్ బ్యూరోకు దగ్గరగా ఉన్న ఒక సంస్థ RFAకి తెలిపింది.

ఘోస్ట్ నగరంగా మారిన చైనా

కాగా వూహాన్లో ఒకే నెలలో 28,000 దహన సంస్కారాలను చూశారని, రెండున్నర నెలల కాలంలో ఆన్‌లైన్ అంచనాలు అక్కడ అధికంగా లేవని సూచిస్తున్నాయి. మరణించిన వారి బంధువులు తమ ప్రియమైనవారి బూడిదను సేకరించడానికి అంత్యక్రియల గృహాల వెలుపల పొడవైన గీతలు ఏర్పాటు చేస్తున్నారని వుహాన్ నివాసి సన్ లినాన్ తెలిపారు.

అమెరికా, చైనాల మధ్య కరోనా వార్

ఇది ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఏదైమైనా ఈ వార్తలు నిజమెంతో తెలియాలంటే చైనా మాత్రమే దీనిని బయటపెట్టాల్సి ఉంటుంది. లేదా అక్కడి మీడియా దీనిని బయటి ప్రపంచానికి చెప్పాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఇది మిస్టరీగానే ఉంటుంది.

Content Source: Radio Free Asia

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now