తాజా వార్తలు
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులపై తీవ్ర ఆగ్రహం, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు
Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: ముక్కోటి ఏకాదశి రోజున మీ స్నేహితులకు శుభాకాంక్షలను Whatsapp, Instagram, Facebook ద్వారా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
sajayaVaikunta Ekadasi 2025 Wishes In Telugu: ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన పర్వదినాలలో ఒకటి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలను పొందవచ్చని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆలయంలో పూజ చేస్తున్న పూజారిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి, పొన్నూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఘటన
Hazarath Reddyగుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయంలో పనిచేస్తున్న అర్చకుడి పై ఒక వర్గానికి చెందిన వారు దాడిచేశారు. ఈనెల ఆరవ తేదీన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే అతను ఎందుకు దాడి చేశాడనేదానిపై సమాచారం లేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
L&T Chairman S.N.Subrahmanyan: ఇంట్లో కూర్చుని భార్యని ఎంతసేపు చూస్తారు, ఆదివారం కూడా ఆఫీసుకు రండి, ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల వీడియో వైరల్
Hazarath Reddyనారాయణ మూర్తి వారానికి 70 గంటల పని చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొత్త వాయిస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సూచించారు.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, బాధితుల ఫిర్యాదు మేరకు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదంలో ఆరుమంది మృతి
Hazarath Reddyతిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు మృతి చెందడంతో తిరుపతి తూర్పు పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ సంఘటనలు జనవరి 8 న నగరంలోని వివిధ ప్రదేశాలలో జరిగాయి.
Tirupati Stampede: గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడూ ఇలా జరగలేదు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై స్పందించిన టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడం ఆవేదన కలిగిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో ఎప్పుడూ జరగలేదు.
Mecca Rains: వీడియోలు ఇవిగో, మక్కాలో వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, సౌదీ అరేబియాను ముంచెత్తిన భారీ వర్షాలు, ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ
Hazarath Reddyకుండపోత వర్షం, తీవ్రమైన ఉరుములు మక్కా, జెడ్డా, మదీనా అంతటా వినాశనాన్ని సృష్టించాయి. విస్తృతమైన వరదలతో వీధులు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. బస్సులు వరద వీధుల్లో చిక్కుకున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి,
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, నా భార్యను భూమి మీద పుట్టలేదని చూపిద్దామని అనుకున్నారా, భక్తులు ఎలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలిపే వీడియోలు ఇవిగో..
Hazarath Reddyతిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుమంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తోపులాటకు సంబంధించిన వీడియోలు గుండెల్ని పిండేస్తున్నాయి.
Dil Raju Controversial Comments Row: దిల్ రాజు కల్లు, మటన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు, సినిమాలు వదిలేసి కల్లు కాంపౌండ్ లేదా మాంసం దుకాణం పెట్టుకోండని విమర్శలు
Hazarath Reddy‘తెలంగాణ సంస్కృతి’పై దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ దేశపతి తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్లో జరిగిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా గ్రాండ్ ట్రైలర్ లాంచ్లో ఆయన మాట్లాడుతూ, “ఆంధ్రలో ప్రజలు సినిమాలతో అలరిస్తారు, తెలంగాణలో ప్రజలు కల్లు, మటన్తో అలరిస్తారు” అని వ్యాఖ్యానించారు
Pravasi Bharatiya Express: ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ, మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలను చుట్టిరానున్న ట్రైన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyవిదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలు(Pravasi Bharatiya Express)ను నేడు ప్రారంభించింది. భువనేశ్వర్లో జరుగుతున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఈ రైలును వర్చువల్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు
Roja on Tirupati Stampede: చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే, సనాతన యోధుడు అని చెప్పుకునే ఆయన ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట జరిగిందని తెలిపిన రోజా
Hazarath Reddyటీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు.
Manchu Family Dispute Case: అప్పటివరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును మోహన్ బాబు ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తరుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది
Chinta Mohan on Tirupati Stampede: తొక్కిసలాట వల్ల కాదు, బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతొక్కిసలాట వల్ల కాదు భక్తులు వాళ్ళంతట వాళ్లే పడిపోయారు. ఇందులో టీటీడీ వైఫల్యం ఏమి లేదు. తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. గంటల తరబడి ప్రయాణం చేసి ఏమి తినకుండా ఆకలితో భక్తులు లైన్లో నిలబడ్డారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయారని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ అన్నారు.
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, బాధితులకు అండగా ఉంటామని భరోసా
Hazarath Reddyతిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Minister Anagani Satyaprasad) తెలిపారు.
Pritish Nandy Dies: గుండెపోటుతో మృతి చెందిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రీతిష్ నంది, సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన నటుడు అనుపమ్ ఖేర్
Hazarath Reddyప్రముఖ బాలీవుడ్ నిర్మాత ప్రీతిష్ నంది ఈరోజు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ప్రీతిష్ నంది మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన ప్రియమైన మిత్రుడు ప్రీతిష్ నంది మరణ వార్తను తెలుసుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యానని అనుపమ్ ఖేర్ అన్నారు
Chandrayaan-4 Update: ఇస్రో కొత్త చీఫ్గా వి నారాయణన్, చంద్రయాన్-4, గగన్యాన్ మిషన్లపై కీలక అప్డేట్ ఇచ్చిన వి నారాయణన్
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త చీఫ్గా వి నారాయణన్ బుధవారం నియమితులయ్యారు, ప్రధాన మంత్రి నరేంద్ర అప్పగించిన గొప్ప బాధ్యతగా ఆయన అభివర్ణించారు.
Formula E Race Case: ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్, లుచ్చాగాళ్ల ముందు తలవంచను, కేసీఆర్ బిడ్డగా తెలంగాణ కోసం అవసరమైతే చచ్చిపోతానని ప్రకటన
Hazarath Reddyఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. ఈ కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్.. మాజీ మంత్రిని విచారిస్తున్నారు
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ , గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
Hazarath Reddyతిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు మృతి చెందడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన చంద్రబాబు, భక్తులు భారీగా వస్తారని తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం
Hazarath Reddyభక్తులు పెద్దఎత్తున హాజరవుతారని ముందే తెలిసినా తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.