తాజా వార్తలు

RG Kar Doctor Rape-Murder Case: ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం, పోస్టుమార్టం నివేదికలో షాకింగ్‌ విషయాలు, దర్యాప్తు కోసం కోల్‌కతా చేరుకున్న సీబీఐ

Hazarath Reddy

కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యురాలిపై దారుణ అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది.ఈ కేసులో ఇప్పటికే కొత్త సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది.

SC on Royalty Issue: గనులు కలిగిన భూములపై రాయల్టీ, కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు, ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు బకాయిలు చెల్లించాలని కీలక తీర్పు

Hazarath Reddy

ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు విషయంలో సుప్రీంకోర్టు గత నెలలో కీలక తీర్పును వెలువరించిన సంగతి విదితమే. ఖనిజాలు, గనుల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు పూర్తిస్థాయి అధికారాన్ని రాజ్యాంగం కట్టబెట్టలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Nalgonda: వాగులో చిక్కుకుపోయిన ఎస్సై వెంకట్‌ రెడ్డి, స్థానికుల సాయంతో బయటపడ్డ ఎస్సై, వీడియో వైరల్

Arun Charagonda

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షాలకు గట్టుప్పల్, పుట్టపాక మధ్యలోని ఆరుమాళ్ల వాగు పొంగి పొర్లింది. దీంతో సొంతూరు వెళ్తూ వాగులో చిక్కుకుపోయారు గట్టుప్పల్ ఎస్సై గుత్త వెంకట్ రెడ్డి. సిబ్బంది, స్థానికుల సహాయంతో బయయటపడ్డారు ఎస్సై.

Sheikh Hasina Seeks Justice: నాకు న్యాయం కావాలి,ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత తొలి ప్రకటన చేసిన హసీనా,బంగ్లా విధ్వంసంపై దర్యాప్తు చేయాలని డిమాండ్

Arun Charagonda

బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశం తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు షేక్ హసీనా. ఆగస్టు 5న దేశం విడిచి వెళ్లిన తర్వాత సోషల్ మీడియా ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొదటి ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో నిరసనల సందర్భంగా జరిగిన హింస, విధ్వంసంపై దర్యాప్తు చేయాలని కోరారు.

Advertisement

Duvvada Srinivas: క్లాసికల్ డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మాధురి, దువ్వాడ శ్రీనివాస్‌ ఘటన నేపథ్యంలో మాధురి ట్వీట్ వైరల్

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి ఎపిసోడ్ రోజుకో టర్న్ తీసుకుంటుంది. మాధురి ఆత్మహత్య యత్నం చేసుకోగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో తన క్లాసికల్ డ్యాన్స్ చూడాలనుకునేవారి కోసం వీడియో రిలీజ్ చేసింది మాధురి.

Train Hits Goats At Vikarabad: 50 మేకలను ఢీ కొట్టిన ట్రైన్స్, అక్కడికక్కడే మేకలు మృతి,వీడియో వైరల్

Arun Charagonda

వికారాబాద్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 50 మేకల్ని ఢీకొట్టాయి రెండు రైళ్లు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండల్ డీకే తండాకు చెందిన రైతులు మేకల్ని తీసుకొస్తుండగా ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల గుంపు ఎదురవడంతో రైలు పట్టాలపైకి వెళ్లాయి మేకలు. 50 మేకలు మృత్యువాత పడ్డాయి.

Andhra Pradesh Shocker: వైరల్ వీడియో.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన స్నేహితులు, ఆస్పత్రిలో చేరిక, చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి తల్లి ఆరోపణ

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. బాపట్ల జిల్లా చుండూరు మండలం, చిన్నపరిమి గ్రామంలో ఆగస్టు 6వ తేదీన ఓ వ్యక్తిని తీసుకెళ్లి, అతని స్నేహితులు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన కుమారుడిని కొట్టిన వ్యక్తులు మళ్లీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తన కొడుకును చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది

Venu Swamy Wife Veena Srivani: నాగచైతన్యను గిఫ్ట్ కావాలని కోరిన వేణుస్వామి భార్య, చైతూ - శోభిత విడిపోతారని చెప్పినందుకు గిఫ్ట్ ఇవ్వాలా అని మండిపడుతున్న నెటిజన్లు!

Arun Charagonda

అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎంగేజ్‌మెంట్ జరిగి 24 గంటలు కాకముందే వీరిద్దరూ విడిపోవడం ఖాయమని జ్యోతిష్యం చెప్పారు వేణు స్వామి. దీనిపై పెద్ద రచ్చ జరుగగా తాజాగా ఆయన భార్య వాణి స్పందించారు.

Advertisement

Andhra Pradesh Shocker: కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుని హతమార్చిన దుండగులు

Arun Charagonda

ఏపీలో హత్యారాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్యకు గురయ్యాడు. పత్తికొండ మండలం హోసూరులో మాజీ సర్పంచ్ వాకిటి శారద భర్త శ్రీనివాసుని హతమార్చారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

CAS Verdict On Vinesh Phogat: వినేష్‌ ఫోగట్‌కు తప్పని నిరీక్షణ, తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసిన CAS, తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Arun Charagonda

అధిక బరువు కారణంగా పారిస్ ఒలింపింక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగం నుండ డిస్ క్వాలిఫై అయింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్. దీనిపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)ను ఆశ్రయించగా మరోసారి నిరీక్షణ తప్పలేదు. తీర్పును ఆగస్టు 16కి వాయిదా వేసింది కాస్.

Visakhapatnam: గిన్నెలు కడగలేదని కూతురుపై తల్లి దాడి, బాలికకు తీవ్ర గాయాలు, ఆస్పత్రిలో చేరిక

Arun Charagonda

విశాఖపట్నంలో అమానుషం చోటు చేసుకుంది. గిన్నెలు కడగ లేదనే నెపంతో ఓ తల్లి దారుణానికి తెగబడింది. విశాఖపట్నం సింహాద్రి నగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 13 సంవత్సరాల బాలికపై తన తల్లి తీవ్రంగా దాడి చేయగా ఆసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతోంది బాలిక.

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య యత్నం, ట్యాంక్ బండ్ శివ సాయంతో యువతి సేఫ్‌..వీడియో

Arun Charagonda

హైదరాబాద్ - ట్యాంక్ బండ్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది మహిళ. ఇది గమనించిన స్థానికులు, పోలీసులు.. ట్యాంక్ బండ్ శివ సహాయంతో ఆమెను బయటకుతీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Arshad Nadeem: అర్ష‌ద్ న‌దీమ్‌పై కాసుల వర్షం, ఒలింపిక్ స్వ‌ర్ణం గెలవడంతో బహుమతిగా కోట్ల రూపాయల నగదుతో పాటు కార్లు

Vikas M

ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జెండాను స‌గ‌ర్వంగా ఎగుర‌వేసిన అర్ష‌ద్ న‌దీమ్ (Arshad Nadeem) స్వ‌దేశంలో హీరో అయ్యాడు. స్వ‌ర్ణంతో చ‌రిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయ‌ర్‌పై కాసుల వ‌ర్షం కురుస్తోంది.

TikTok Layoffs 2024: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన టిక్‌టాక్, ఎక్కడ ప్రభావితం అయ్యారంటే..

Vikas M

గ్లోబల్ రీస్ట్రక్చరింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రయత్నాల మధ్య టిక్‌టాక్ తొలగింపులు ఇప్పుడు ఆఫ్రికన్ శ్రామిక శక్తిని ప్రభావితం చేశాయి. ఈ సంవత్సరం, TikTok న్యాయ పోరాటాలు, వ్యాపార పునర్వ్యవస్థీకరణ మధ్య వందల మంది వ్యక్తులను తొలగించింది.

Salt And Sugar Contain Microplastics:షాకింగ్..మీరు వాడుతున్న ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్, సంచలన నివేదిక, ఒక్కసారి ఆలోచించండి?

Arun Charagonda

వంటింట్లో ఉండే వస్తువుల్లో ముఖ్యమైనవి ఒకటి ఉప్పు, మరొకటి చక్కెర. ఈ రెండు ప్రతీ మనిషి జీవితంలో భాగం కావాల్సిందే. ఉప్పు లేనిదే వంట లేదు, టీ, కాఫీ, జ్యూస్ ఏది కావాలన్న చక్కెర కావాల్సిందే. అయితే ఇప్పుడు మనం వాడే ఈ రెండింట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని సంచలన నివేదిక బయటపడింది.

Itel A50, Itel A50C: ఐటెల్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్లు, ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఇవిగో..

Vikas M

యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లలో 8-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, ఐటెల్ ఏ50 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఐటెల్ ఏ50సీ ఫోన్ 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి. నోటిఫికేషన్లు, ఇతర సమాచారం కోసం ఐ-ఫోన్లలో మాదిరిగా డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంటుంది.

Advertisement

Google Down: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డౌన్, జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

Vikas M

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికా సమయం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలకు అంతరాయం ఏర్పడింది.

India's Population: 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనున్న భారత జనాభా, విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికలో షాకింగ్ విషయాలు

Vikas M

భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది.

Your Tongue Can Now Predict Strokes: నాలుక రంగు ఆధారంగా మీకు ఏమి వ్యాధి ఉందో వెంటనే తెలుసుకోవచ్చు, రోగ నిర్ధారణలో విప్లవాత్మక ఆవిష్కరణ

Vikas M

ఒక వ్యక్తి యొక్క నాలుక రంగును విశ్లేషించడం ద్వారా, వివిధ రకాల వ్యాధులను 98 శాతం కచ్చితత్వంతో గుర్తించగల నూతన అల్గోరిథమ్‌ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ అల్గోరిథమ్‌ను మిడిల్ టెక్నికల్ యూనివర్సిటీ (MTU) మరియు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (UniSA) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

Kolkata Doctor Case: సీబీఐకి బెంగాల్ డాక్టర్ అత్యాచార కేసు, సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్ కతా హైకోర్టు

Arun Charagonda

బెంగాల్ వైద్య విద్యార్థి హత్యాచార కేసును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు కలకత్తా పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు, దస్త్రాలన్నింటిని రేపు 10 గంటల లోపు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది

Advertisement
Advertisement