Information

Indian Railways: రైల్వే స్టేషన్లో ఉమ్మివేసినా, మాస్క్ లేకున్నా రూ.500 ఫైన్, కీలక నిర్ణయం తీసుకున్న భారతీయ రైల్వే, యూపీలో మాస్క్ లేకుండా రెండో సారి పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, రాష్ట్ర వ్యాప్తంగా మే 15 దాకా లాక్‌డౌన్‌

Hazarath Reddy

రోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోయిన, రైళ్లలో, స్టేషన్ లలో ఉమ్మివేసిన రూ.500 జరిమానా (Indian Railways to Fine) విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన కొనసాగుతాయని రైల్వేశాఖ వెల్లడించింది.

Covid in India: తుమ్మినా, దగ్గినా కరోనా, గాలి నుంచి వేగంగా శరీరంలోకి, ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం, బ్రిటన్‌కు పాకిన ఇండియా డబుల్ మ్యూటెంట్ వైరస్, రెండోసారి కరోనా బారిన సీఎం యెడ్డ్యూరప్ప, దేశంలో తాజాగా 2,34,692 మందికి కోవిడ్

Hazarath Reddy

సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రంజిత్‌ సిన్హాకు కరోనా సోకినట్టు గురువారం రాత్రే నిర్ధారణ అయింది. ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 1974 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి రంజిత్‌ సిన్హా 2012లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

AP 10th & Inter Exams Update: ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు, అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్

Hazarath Reddy

పీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) తెలిపారు. సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన ఆరా తీశారు.

CBSE Board Exams 2021 Update: సీబీఎస్‌ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు, 12వ తరగతి ఎగ్జామ్స్‌‌ వాయిదా, విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను రద్దు (Class 10 Exams Cancelled) చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభ, పనితీరు ఆధారంగా వారికి మార్కులు కేటాయిస్తామని వెల్లడించింది. 12వ తరగతి పరీక్షలు మాత్రం వాయిదా (Class 12 Examinations Postponed) వేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Ambedkar Jayanti 2021:హైదరాబాద్ ట్రాఫిక్ రూట్లలో పలు మార్పులు, ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు సంధర్భంగా ట్రాఫిక్ అడ్వైజరీ చార్ట్ విడుదల చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, వాహనాదారులు సహకరించాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 14వ తేదీన ట్రాఫిక్ ఆంక్్షలు విధించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) వారి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో వివరాలను పొందుపరిచారు..

Sushil Chandra: కొత్త ఎస్ఈసీగా సుశీల్‌ చంద్ర బాధ్యతలు స్వీకరణ, 24వ సీఈసీగా విధు‌లు నిర్వహించనున్న సుశీల్‌ చంద్ర , 2022 మే 14 వరకు సీఈసీగా పదవిలో..‌, పదవీ విరమణ చేసిన సునీల్‌ అరోరా

Hazarath Reddy

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా (సీఈసీ) సుశీల్‌ చంద్ర ఇవాళ బాధ్య‌త‌లు (Sushil Chandra takes charge as the 24th SEC) స్వీక‌రించారు. ఆయన 24వ సీఈసీగా విధు‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. సుశీల్ చంద్ర‌ను సీఈసీగా (Chief Election Commissioner) నియ‌మిస్తూ సోమవారం కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

Bank Holidays Alert: నేటి నుంచి బ్యాంకులకు వరుసగా 4 రోజుల సెలవులు, ఏప్రిల్ నెలలో 9 రోజుల పాటు సెలవులను ప్రకటించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెలవుల తేదీలను ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏప్రిల్ 13వతేదీన తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది, గుధి పడ్వా, నంగమాపంబ మొదటి నవరాత్రి, బైశాఖి సందర్భంగా బ్యాంకులకు సెలవు (banking holidays) ప్రకటించారు.

Premature Rains in AP: మండు వేసవిలో ఏపీని ముంచెత్తనున్న అకాల వర్షాలు, ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపిన వాతావరణ శాఖ, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధిక పీడనం

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మండు వేసవిలోనూ అకాల వర్షాలు పడే అవకాశాలు (Andhra Pradesh weather update) కనిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు (Premature Rains in AP) పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.

Advertisement

Covid Pandemic: కరోనా సెకండ్ వేవ్..డేంజర్ జోన్‌లో ఇండియా, బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండవ స్థానంలోకి, దేశంలో 1.35 కోట్లకు చేరుకున్న మొత్తం కేసులు సంఖ్య, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ ఎగుమతిపై నిషేధం

Hazarath Reddy

దేశంలో కరోనా ప్రమాదకర స్థితికి చేరుకుంది. దేశంలో సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. తాజాగా కోవిడ్ కేసుల్లో భారతదేశం బ్రెజిల్‌ను అధిగమించి (India overtakes Brazil ) ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలోకి (world’s second worst-hit country) చేరింది.

Night Curfew in Delhi: వణికిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్, నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం, గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 3548 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

దేశ రాజధానిలో కరోనావైరస్ చేయి దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి ఇవాళ్టి నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ (Night Curfew in Delhi) విధిస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు (Night Curfew in Delhi From 10 PM to 5 Am Till April 30) అమల్లో ఉంటాయని పేర్కొంది.

TS ICET 2021: తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు, ఈనెల 7 నుంచి జూన్‌ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, సెప్టెంబర్‌ 17న ఐసెట్‌ ఫలితాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ ఐసెట్‌ (TS ICET 2021) నోటిఫికేషన్‌ను కంట్రోలర్‌ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణలో ఐసెట్‌ పరీక్షలు (Telangana ICET 2021 notification) నిర్వహించనున్నారు.

Coronavirus Second Wave: దేశాన్ని వణికిస్తున్న సెకండ్ వేవ్, రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా, పేదలను భయపెడుతున్న లాక్‌డౌన్ ఊహగానాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వలస కార్మికులు

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్ సెకండ్‌ వేవ్‌ వణికిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా..కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. కరోనా రోజువారీ కొత్త కేసుల్లో (Coronavirus Second Wave) బ్రెజిల్, అమెరికాను భారత్‌ దాటేసి.. అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ తొలి స్థానానికి ( India Crossed brazil and america) ఎగబాకింది.

Advertisement

Covid in India: దేశంలో మళ్లీ కరోనా మృత్యుఘోష, నిన్న ఒక్కరోజే 714 మంది మృతి, తాజాగా 89,129 మందికి కరోనా పాజిటివ్, కేసులు పెరిగినా లాక్‌డౌన్‌ విధించేది లేదని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వాలు

Hazarath Reddy

దేశంలో గ‌త 24 గంటల్లో 89,129 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 44,202 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 714 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,64,110కు (Covid Deaths) పెరిగింది.

Aadhaar-PAN Linking: పాన్- ఆధార్ అనుసంధానం కోసం మరోసారి గడువు పెంచిన ఆదాయపు పన్ను శాఖ, కోవిడ్19 నేపథ్యంలో జూన్ 30, 2021 వరకు పొడగిస్తూ నోటిఫికేషన్ జారీ

Team Latestly

ఆదాయపు పన్ను (ఐటి) విభాగం ఆధార్ తో పాన్ అనుసంధానం చేసుకునే గడువును జూన్ 30 వరకు పొడగించింది. అంతకుముందు, రెండు గుర్తింపు కార్డుల సమాచారాన్ని లింక్ చేయడానికి గడువు మార్చి 31గా ఉండేది. దేశంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో...

Heatwave Hits Telugu States: బయటకు రాకండి..వస్తే మాడిపోతారు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న ఎండలు, మే నెల రాకముందే మొదలైన వడగాడ్పులు, మూడు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను వేడి గాలులు వణికిస్తున్నాయి. రానున్న మూడు రోజుల పాటు వేడిగాలులు (Heatwave Hits Telugu states) వీస్తాయని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి. ఏపీలో ఈసారి వేసవి తీవ్రంగా ఉండనున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

Indian Railways: రాత్రిపూట రైళ్లలో ఛార్జింగ్ బంద్, ప్రయాణికుల భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకున్న భారతీయ రైల్వే, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్విచ్ ఆఫ్

Hazarath Reddy

ప్రయాణికుల భద్రత దృష్టిలో పెట్టుకొని అగ్నిప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో రాత్రిపూట ప్రయాణికులు చార్జింగ్‌ పాయింట్లను (Indian Railways Bar Charging) ఉపయోగించకుండా చేసేందుకు సిద్ధమైంది.

Advertisement

PAN-Aadhaar Linking: పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్, మార్చి 31లోగా చేయకుంటే పాన్‌ కార్డు చెల్లదు, అలాగే రూ.1000 జరిమానా, లింక్ చేయకుంటే ఎలా చేయాలో తెలుసుకోండి, లింక్ చేసి ఉంటే స్టేటస్ తెలుసుకోండి

Hazarath Reddy

ఈ నెల 31లోగా పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం (PAN-Aadhaar Linking) చేయకపోతే పాన్‌ కార్డు చెల్లదు. అంతే కాకుండా రూ.1000 జరిమానా పడుతుంది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఐటీ చట్టానికి సవరణలు చేసింది. పాన్‌కార్డుకు ఆధార్‌ లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌ నంబర్‌ లింక్‌ (PAN-Aadhaar Linking) చేయకపోతే జరిమానా పడుతుందా.. తిరిగి లింక్‌ చేసుకోవాలంటే జరిమానా కట్టాల్సి ఉంటుందా అన్న విషయాన్ని చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు.

Bank Holidays April 2021: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మొత్తం లిస్టు ఓ సారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఏప్రిల్‌లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏమైనా ఉంటే అలర్ట్ అవ్వండి. ఈ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు (Bank Holidays April 2021) పనిచేయవు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవుదినాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసింది.

Coronavirus Pandemic: దేశంలో కరోనా విశ్వరూపం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకి కరోనా, తాజ్ ఐదు నక్షత్రాల హోటల్ లో 76 మందికి కరోనా, భువనేశ్వర్ ఐఐటీలో 10 మంది విద్యార్థులకు కోవిడ్

Hazarath Reddy

దేశంలో గ‌త 24 గంటల్లో 56,211 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్న‌ 37,028 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 271 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,62,114 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,93,021 మంది కోలుకున్నారు.

India Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం, కొత్తగా 68 వేల కరోనా కేసులు, 291 మంది మృతితో 1,61,843కు చేరుకున్న మరణాల సంఖ్య, 5,21,808 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health and Family Welfare) ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు (Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,843కు పెరిగింది.

Advertisement
Advertisement