సమాచారం
COVID-19 in Dharavi: దేశానికి దిగులు పుట్టిస్తున్న ధారావి, ఏడు మంది కరోనా కాటుకు బలి, 55కు చేరిన కోవిడ్ -19 కేసుల సంఖ్య, ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు
Hazarath Reddyఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారావి (Dharavi COVID-19) దేశానికి దిగులు పుట్టిస్తోంది. ముంబైలో విస్తరించి ఉన్న ఈ మురికివాడలో కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దాదాపు 15 లక్షల మంది నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి కరోనా సోకగా (6 New Cases), ఇద్దరు మరణించారని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌ (Brihanmumbai Municipal Corporation (BMC)) పేర్కొంది. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు ధారావిలో మొత్తం 55 మందికి కరోనా సోకగా, ఏడుగురు మృతిచెందారు.
Coronavirus Lockdown: దేశవ్యాప్తంగా రైళ్లు, విమానాలు అన్నీ బంద్, అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇండియన్ రైల్వే,సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
Hazarath Reddyదేశంలో మే 3 వరకు లాక్‌డౌన్ (India Lockdown) పొడిగిస్తున్నట్లుగా ప్రధాని మోదీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఎక్కడి సర్వీసులు అక్కడే నిలిచిపోనున్నాయి. మరో 19 రోజుల పాటు రైళ్లు, విమానాలు అన్నీ బంద్ కానున్నాయి. ఈ మేరకు ఇండియన్ రైల్వే (Indian Railways),సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ (Ministry of Civil Aviation) సంయుక్తంగా ప్రకటించాయి. మే 3 తర్వాత నడుస్తాయా లేదా అనేదానిపై ఇంక్లా క్లారిటీ లేదు. పరిస్థితులను బట్టి వెల్లడిస్తామని తెలిపాయి.
Aarogya Setu App: ప్రధాని మోదీ చెప్పిన యాప్ ఇదే, ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే, ఎలా వాడాలో తెలుసుకోండి
Hazarath Reddyఆరోగ్య సేతు యాప్‌ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.
PM Narendra Modi Saptapadi: ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు, దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు
Hazarath Reddyదేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ (Lockdown extension in India) పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్ర‌క‌టించారు. ప్రజలు అందరూ కూడా మే 3 వరకు ఇళ్ళల్లోనే ఉండాలని సూచించారు. కరోనాపై భారత్ యుద్ధం కొనసాగుతుందని చెప్పారు మోడీ. కరోనా హాట్ స్పాట్ ల మీద ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. కరోనా వైరస్ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఏడు సూచనలు (PM Modi Saptapadi) చేసారు. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌లంద‌రై త‌ప్ప‌క పాటించాల్సిన ఏడు నియ‌మాల‌ను ప్ర‌ధాని వెల్ల‌డించారు.
PM Narendra Modi: లాక్‌డౌన్‌పై స్పష్టత, మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగం, కరోనా నేఫథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా విభజిస్తారని ఊహాగానాలు
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి (PM Modi to Address the Nation) ప్రసంగిస్తారు. ఏప్రిల్ 14 న 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ (Lockdown) చివరి రోజు కావడంతో ప్రధాని (PM Modi) దీనిని పొడిగించాలా వద్దా అనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ రోజు ప్రసంగంలో, దేశంలో కరోనావైరస్ (Coronavirus) సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రధాన మార్గం గురించి ప్రధాని మాట్లాడాలని భావిస్తున్నారు.
Supreme Court: ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలి, విదేశాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ఇది సమయం కాదు, పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు వెల్లడి
Hazarath Reddyకరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ (Nationwide lockdown) మధ్య విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలించాలని కోరుతున్న పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ కేసులో పలు పిటిషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డే (Chief Justice of India SA Bobde) నేతృత్వంలోని ధర్మాసనం, విదేశాలలో చిక్కుకున్న ప్రజలందరినీ తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి ఇది సమయం కాదని అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Ganga,Yamuna Rivers: లాక్‌డౌన్ దెబ్బ, గంగా,యమున నదుల్లోకి స్వచ్ఛమైన నీరు, ప్రజల అవసరాలకు సరిపోయేలా నీటి నాణ్యత, శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
Hazarath Reddyకరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కారణంగా అందరూ ఇంటికే పరిమితవ్వడంతో ప్రకృతి మరియు వన్యప్రాణులు అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే మన నదులు (Rivers) కూడా పరి శుభ్రంగా మారుతున్నాయి. నివేదికల ప్రకారం, గంగా,యమునా నది (Ganga,Yamuna Rivers) నీటి నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని మరియు తాగడానికి కూడా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Voluntary Pay Cut: కరోనాపై పోరుకు ఈసీ అండ, ఏడాదిపాటు తమ జీతాల నుంచి స్వ‌చ్ఛంధంగా 30 శాతం కోత, ముందుకొచ్చిన ముగ్గురు ఎన్నికల కమిషనర్లు
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (Coronavirus) మహమ్మారిపై పోరులో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission of India) కూడా తన వంతు సహాయం అందించింది. ఇందులో భాగంగా ఏడాదిపాటు త‌మ మూల వేత‌నం నుంచి 30 శాతం చొప్పున‌ స్వ‌చ్ఛంధంగా కోత (voluntary pay cut) విధించుకుంటున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు ప్ర‌క‌టించారు.
PM Modi To Adress Nation: లాక్‌డౌన్‌ పొడిగింపుపై వీడనున్న సస్పెన్స్, జాతినుద్దేశించి రేపు ప్రసగించనున్న ప్రధాని మోదీ, ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగించిన కొన్ని రాష్ట్రాలు
Hazarath Reddyభారత ప్రధాని నరేంద్ర మోదీ (India PM Narendra Modi) రేపు ఉదయం 10గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తిపై విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) గడువు మంగళవారంతో ముగియనుండటంతో దాని కొనసాగింపుపై (Lockdown Suspense) ప్రధాని స్పష్టతనివ్వనున్నారు. కాగా దేశంలో కోవిడ్ 19 కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.
Dr YSR Telemedicine: కరోనాపై పోరుకు డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌, 14410 టోల్‌ ఫ్రీ నెంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఎస్‌ఎంఎస్‌ ద్వారా చికిత్స వివరాలు అందుతాయి
Hazarath Reddyఏపీలో కరోనా వైరస్‌ నియంత్రణ (Coronavirus in AP) చర్యల్లో భాగంగా డాక్టర్‌ వైఎస్సార్‌ టెలిమెడిసిన్‌ (Dr YSR Telemedicine) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan mohan Reddy) ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబరు 14410కు ఫోన్ చేసి డాక్టర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెడిసిన్‌ (Telemedicine) విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం వైయస్ జగన్‌ ఆదేశించారు.
COVID-19 : కరోనా నియంత్రణపై రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు, సముద్రంలో దొరికే నాచుతో కోవిడ్-19కి చెక్, రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడి
Hazarath Reddyప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (coronavirus) మహమ్మారికి మందు రావడానికి ఆరు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన సంగతి విదితమే.ఈ వైరస్ నియంత్రణకు ఎటువంటి వ్యాక్సిన్ లేకపోవడంతో ఇది ప్రపంచ దేశాలను (Global Coronavirus) అల్లకల్లోలం చేస్తోంది. కోవిడ్-19 (COVID-19) దెబ్బకు దేశాలకు దేశాలే లాక్‌డౌన్ (Lockdown) లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ నివారణ ఔషధ తయారీలో నిమగ్నమై ఉన్నారు.
COVID-19 in AP: కర్నూలును కలవరపెడుతున్న కరోనా, ఆ జిల్లాలో 84కి చేరిన కరోనా కేసులు, ఏపీలో 432కు చేరిన కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరుకుంది. నిన్నరాత్రి 09 గంటల నుంచి ఇవాళ ఉదయం 09 గంటల వరకూ కొత్తగా 12 కేసులు (positive coronavirus cases) నమోదైనట్లు మీడియా బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Coronavirus in Dharavi: ముంబై మురికివాడలో కరోనా ఘోష, ధారావిలో 47కు చేరిన కోవిడ్-19 కేసులు, ఐదుకి చేరిన మృతుల సంఖ్య, మహారాష్ట్రలో 1985కి చేరిన కరోనా కేసులు
Hazarath Reddyఆసియాలోనే అతి పెద్ద మురికివాడ (Asia's largest slum) అయిన ధారావి (Dharavi) ఇప్పుడు దేశ వ్యాప్తంగా వణుకుపుట్టిస్తోంది. అక్కడ రోజు రొజుకు కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా నాలుగు కేసులు నమోదు కావడంతో ఇప్పుడు అక్కడ కోవిడ్ 19 (COVID-19 Cases) కేసుల సంఖ్య 47 కి పెరిగింది. ఘోరమైన కరోనావైరస్ (Coronavirus Pandemic) కారణంగా ఈ రోజు ఒక వ్యక్తి కూడా మరణించాడు. తద్వారా ఈ ప్రాంతంలో మరణించిన వారి సంఖ్య ఐదుకి చేరుకుంది.
AP Entrance Exams Postponed: ఏపీలో ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా, కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపిన ఏపీ ఉన్నత విద్యామండలి
Hazarath Reddyఏపీలో కరోనావైరస్ (coronavirus in AP) విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కారణంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా (AP Entrance Exams Postponed) వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
All Exams Postponed in TS: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, కొత్త తేదీలు త్వరలో ప్రకటిస్తామన్న ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌
Hazarath Reddyక‌రోనా (COVID-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తుండ‌టం, దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌టం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎంసెట్ స‌హా రాష్ట్రంలో మే నెల‌లో జ‌రగాల్సిన అన్ని ర‌కాల ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా (CETs Exams Postponed) వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
COVID-19 in AP: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం, ప్రతి ఒక్కరికీ ఉచితంగా మూడు మాస్కులు, 5.3 కోట్ల మందికి 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు
Hazarath Reddyకరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు (Free Masks) పంపిణీ చేయనుంది. ప్రతి వ్యక్తికీ మూడు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని సీఎం జగన్‌ (AP CM YS jagan) ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష (CM Jagan Review Metting) నిర్వహించారు.
COVID-19 in India: కరోనా కట్టడిపై కేంద్రం కీలక నిర్ణయం, మూడు జోన్లుగా దేశ విభజన, ఆర్థికవ్యవస్థను పరిపుష్టి చేసే దిశగా కేంద్రం అడుగులు, వెల్లడిస్తున్న అధికార వర్గాలు
Hazarath Reddyకరోనావైరస్ దేశ వ్యాప్తంగా (COVID-19 in India) తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీని కట్టడికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ (India Lockdown) విధించింది. కాగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని మూడు జోన్లుగా (3 zones) విభజించాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు శనివారం తెలిపాయి.
Punjab Horror: లాక్‌డౌన్, కత్తులతో పోలీసులపై దాడి, పంజాబ్‌లో ఏఎస్ఐ చేయి నరికివేసిన నిహంగ్ వర్గీయులు, ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyకరోనా లాక్‌డౌన్‌ను (Coronavirus Lockdown) పక్కాగా అమలు చేస్తున్న క్రమంలో పంజాబ్‌లో పోలీసులపై దాడి (Policemen attacked by 'Nihangs') జరిగింది. లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంత మంది దాష్టీకానికి తెగబడ్డారు. ఒక్కసారిగా కత్తులతో దాడి (Punjab horror) చేశారు. ఓ పోలీసు అధికారి చేయి నరికేశారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Telangana Lockdown: తెలంగాణలో విద్యార్థులకు పరీక్షలు ఉండవు, 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు, 10వ తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం
Hazarath Reddy1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు పరీక్షలు పాస్ లేకుండానే పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ విధంగానే నిర్ణయం తీసుకున్నాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 10వ తరగతి పరీక్షల విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Telangana Lockdown Extension: ఎక్కడి వారు అక్కడే, తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న కేసీఆర్, 503కి చేరిన కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyతెలంగాణ (Telangana) సరిహద్దు రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ ఈ నెల 30వ తేదీ వరకు పొడగించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana CM KCR) ప్రకటించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలతో రాకపోకలు ఉన్నాయి. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ (Telangana Lockdown) కఠినంగా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని చెప్పారు.