News

Delhi High Court: వృద్ధ అత్తమామలను కోడలు పట్టించుకోకపోవడం క్రూరత్వమే..భార్య క్రూరత్వం కారణంగా భర్తకు విడాకులు మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు, కేసు ఏంటంటే..

Team Latestly

ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఒక తీర్పు వైవాహిక సంబంధాలపై కీలక చర్చకు దారితీసింది. వృద్ధ అత్తమామల పట్ల భార్య చూపిన కఠినత్వం, నిర్లక్ష్యం కూడా వైవాహిక చట్టం ప్రకారం "క్రూరత్వం" కిందకు వస్తుందని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం, భర్త అత్తమామల పట్ల భార్య ప్రవర్తన కారణంగా మానసిక వేదనకు గురైతే, ఆయన విడాకులకు అర్హుడు అవుతారు.

Compensation for Innocent Prisoners: తప్పుడు కేసుల్లో శిక్ష అనుభవించిన నిర్దోషులకు నష్టపరిహారం, కీలక అంశంపై దృష్టి సారించిన సుప్రీంకోర్టు, అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ సహాయం కోరిన అత్యున్నత ధర్మాసనం

Team Latestly

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరో కీలక అంశంపై దృష్టి సారించింది. తప్పుడు ఆరోపణలతో నిర్దోషులు జైలు శిక్ష అనుభవించినప్పుడు వారికి నష్టపరిహారం ఇవ్వాలా? అనే ప్రశ్నపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా ఆలోచిస్తోంది

Cyclone Montha Update: తీరం దాటిన మొంథా తుఫాను, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుపాను ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. వాతావరణశాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురం వద్ద తుపాను తీరం దాటింది.

Narrow Escape in Hyderabad: గుండెలు ఝలదరించే వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ జారిపడిన ప్రయాణికుడు, వెంటనే ముందుకు దూకి కాపాడిన తోటి ప్రయాణికులు

Team Latestly

హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడిన ఒక వ్యక్తి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అక్టోబర్ 26న జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది, వరంగల్‌కు చెందిన 31 ఏళ్ల మణిదీప్‌గా గుర్తించబడిన ఈ ప్రయాణికుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు కింద పడిపోతున్నట్లు చూపబడింది.

Advertisement

Air India Bus Fire in Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం, ఎయిర్ ఇండియా విమానం సమీపంలోని బ‌స్సుకు అంటుకున్న నిప్పు, వీడియో ఇదిగో..

Team Latestly

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ ఇండియా విమానం సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఓ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో కాసేపు ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చెలరేగింది.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, 8వ వేతన కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, కొత్త వేతన చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్‌ దేశాయ్ నియామకం

Team Latestly

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద శుభవార్తను ప్రకటించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన కమిషన్‌ (8th Pay Commission) ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ మంగళవారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Kenya Plane Crash: కెన్యాలో ఘోర విమాన ప్రమాదం, కొండ ప్రాంతంలో కుప్పకూలిన టూరిస్టుల‌తో వెళ్తున్న ఫ్టైట్, 12 మంది మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

Team Latestly

కెన్యా తీర ప్రాంతం క్వాలే (Kwale)లో మంగళవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. మాసాయి మారా జాతీయ రిజ‌ర్వ్ ఫారెస్టుకు టూరిస్టుల‌తో వెళ్తున్న విమానం కూల‌డంతో 12 మంది మృతి చెందిన‌ట్లు అధికారులు తెలిపారు. కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Turkey Earthquake: టర్కీని వణికించిన భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు, ఇండ్లలో నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, భూకంపం ధాటికి పలు భవనాలు నేలమట్టం, వీడియో ఇదిగో..

Team Latestly

టర్కీలోని పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం (Turkey Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదయింది. రాత్రి 10.48 గంటల సమయంలో 5.99 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి (Sindirgi) పట్టణాన్ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు. ఇస్తాంబుల్, ఇజ్మీర్‌, బుర్సా, మానిసా వంటి నగరాల్లో భూకంప ప్రభావానికి వణికిపోయాయి.

Advertisement

Cyclone Montha Live: తీరం వైపు శరవేగంగా దూసుకువస్తోన్న మొంథా తుఫాను, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన, ఈ రాత్రి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

Team Latestly

గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతున్న ఈ తుపాన్ ప్రస్తుతం కాకినాడకు 190 కిలోమీటర్లు,మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు,విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్‌లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

Team Latestly

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.

Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన

Team Latestly

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

Cyclone Montha News Update: మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం, సముద్రం అల్లకల్లోలం..

Team Latestly

నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం జారీ చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం, ఈ తుఫాను అక్టోబర్ 28 ఉదయానికి ‘తీవ్ర వాయుగుండం’గా (Severe Cyclonic Storm) మారే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

SC on Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ మోసాలు.. అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, కేసులను సీబీఐకి బదిలీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడి

Team Latestly

నకిలీ కోర్టు ఆదేశాలు, పోలీసు, న్యాయ అధికారుల పేర్లను వాడి ప్రజలను మోసం చేసే డిజిటల్ అరెస్ట్ స్కామ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై కోర్టు స్వయంగా (సుమోటోగా) దృష్టి సారించి,అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.

Cyclone Montha: 17కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తోన్న మొంథా తుఫాను, ఎగసిపడుతున్న అలలు, రేపు తీరం దాటే అవకాశం, అత్యవసర సాయంపై ఏపీ చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..

Team Latestly

మొంథా తుపాను తీరం వైపు దూసుకువస్తోంది. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన

Team Latestly

కర్నూల్‌ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్‌ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్‌ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.

Maruti Suzuki Jimny: లక్ష యూనిట్లు దాటిన జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ ఎగుమతులు, విడుదలైన కొద్ది రోజుల్లోనే 50 వేలకు పైగా ఆర్డర్లు, హర్షం వ్యక్తం చేస్తున్న మారుతి సుజుకి సీఈవో హిసాషి టేకుచి

Team Latestly

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మరో గొప్ప మైలురాయిని సాధించింది. దేశీయంగా తయారై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ, ఎగుమతులలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్‌లో భారత తయారీ రంగానికి గర్వకారణంగా నిలుస్తున్న ఘనతగా పేర్కొంది.

Advertisement

Accident Caught on Camera: వీడియో ఇదిగో, కాంపౌండ్‌లో ఆడుకుంటుండగా ఏడేళ్ల బాలుడి మీద నుంచి వెళ్లిన కారు, బాలుడికి కనీసం సహాయం కూడా చేయలేదని తల్లి ఆవేదన

Team Latestly

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మలాడ్‌లోని ఇంటర్‌ఫేస్ హైట్స్ సొసైటీ లోపల జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది, అక్టోబర్ 19న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఏడేళ్ల బాలుడు కారు ఢీకొని నలిగిపోతున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం

Team Latestly

కర్నూలు కావేరి ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Kurnool Bus Fire Accident: నిద్రలోనే తిరిగిరాని లోకాలకు.. కర్నూల్ బస్సు అగ్ని ప్రమాదంలో ఎన్నో విషాద కథలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి, 20 మంది సజీవదహనం, మరో 21 మందికి గాయాలు

Team Latestly

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్‌9490లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది

Bihar Assembly Elections 2025: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, మహాఘట్బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌, నవంబర్‌ 6, 11 తేదీల్లో ఎన్నికలు, నవంబర్‌ 14న ఫలితాలు

Team Latestly

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్‌ తరఫున సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ (RJD) ప్రధాన నాయకుడు తేజస్వి యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత అశోక్‌ గెహ్లాట్ మీడియాతో వెల్లడించారు. అశోక్‌ గెహ్లాట్‌ ను బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటీ (AICC) సీనియర్‌ ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

Advertisement
Advertisement