వార్తలు
Rammohan Naidu: నాగార్జున సాగర్ వద్ద త్వరలోనే విమానాశ్రయం, మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తామన్న రామ్మోహన్ నాయుడు
VNSనాగార్జున సాగర్తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల (Airports )ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు(Minister Rammohan Naidu) వెల్లడించారు. వీటితో పాటు శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
CM Revanth Reddy America Tour: సత్పలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్,భారీగా పెట్టుబడులు, హైదరాబాద్లో అమెజాన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ సత్ఫలితాన్నిస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ టీం వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి పెట్టుబడులను పెట్టాల్సిందిగా కోరుతుండగా వారి నుండి మంచి స్పందన వస్తోంది. తాజాగా అమెజాన్ హైదరాబాద్లో తన డేటా సెంటర్ ను విస్తరించేందుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ప్రకటించింది.
Telangana Rain Alert: తెలంగాణకు రెండు రోజుల పాటూ భారీ వర్ష సూచన, హైదరాబాద్ తో పాటూ పలు జిల్లాల్లో అలర్ట్
VNSతెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు (Telangana Rain Alert) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపపనాల (Mansoon) కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం
YS Jagan Tweet: పంట బీమా ఎప్పుడు చెల్లిస్తారు! సీఎం చంద్రబాబు అలసత్వంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్
VNSఏపీ రైతుల పట్ల చంద్రబాబు (CM Chandra Babu) నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.
Hidden Camera at Coffee Outlets Toilet: బెంగళూరు కాఫీ షాపు టాయిలెట్ డస్ట్ బిన్ లో ఫోన్, రెండు గంటలకు కెమెరా ఆన్ లోనే ఉన్నట్లు గుర్తించిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
VNSబెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేస్తున్న ఓ ఉద్యోగి అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. లేడీస్ వాష్రూమ్లోని (Ladies Washroom) డస్ట్బిన్లో సెల్ఫోన్ను (Hidden Camera) ఉంచాడు. ఆ మొబైల్ను ఫ్లైట్ మోడ్లో ఉంచి, కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డు చేశాడు. దీన్ని గమనించిన ఓ మహిళ.. కాఫీ షాపు యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
Panic On Howrah-Amritsar Mail: రైలులో ఫైర్ యాక్సిడెంట్ వదంతులు, తొక్కిసలాట.. రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు,ఆరుగురి పరిస్థితి విషమం!
Arun Charagondaఉత్తర ప్రదేశ్లో హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగింది. ప్రాణాలు కాపాడుకునేందుకు 18 మంది ప్రయాణికులు రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని, ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
KTR On Amara Raja Battery: తెలంగాణ నుండి తరలిపోతున్న పరిశ్రమలు, కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు నష్టమని కామెంట్
Arun Charagondaతెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు గల్లా జయదేవ్కు చెందిన అమర రాజా కంపెనీ ముందుకొచ్చింది. అయితే తాజాగా అమరరాజా సంస్థ రాష్ట్రాన్ని వీడతామంటూ ప్రకటించటంపై స్పందించడం కేటీఆర్ ఇది చాలా బాధాకరమన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దు అని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్కు నష్టం రాకుండా రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
Telangana Shocker: రిపేర్కు ఇచ్చిన ఫోన్ ఇవ్వలేదని బ్లెడ్తో కోసుకున్న వ్యక్తి, ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన, ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaరిపేర్ కు ఇచ్చిన ఫోన్ తిరిగి ఇవ్వడం లేదని ఓ వ్యక్తి బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రమేష్ మేస్త్రి పని నిమిత్తం జగిత్యాలకు వచ్చాడు...ఇటీవల తన ఫోన్ పాడవడంతో షాప్ లో రిపేర్ కి ఇచ్చాడు. అయితే సెల్ పాయింట్ యాజమాని ఫోన్ తిరిగి ఇవ్వడం లేదని బ్లెడ్ తో చేయి కోసుకున్నాడు.స్థానికులు గమనించి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.
Punjab Floods: వీడియో ఇదిగో..పంజాబ్ వరదల్లో 10 మంది గల్లంతు, ఒకరిని కాపాడిన రెస్య్కూ టీమ్, కొట్టుకుపోయిన ఇన్నోవా కారు
Arun Charagondaభారీ వర్షాలు పంజాబ్ను ముంచెత్తాయి. ఒక్కసారిగా వరదలు రావడంతో ఇన్నోవా కారు వరదల్లో చిక్కుకుపోయింది. ఒకరిని రెస్య్కూ టీమ్ కాపాడగా కారులోని 10 మంది గల్లంతయ్యారు. రెస్య్కూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరదల్లో ఇన్నోవా కారు చిక్కుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Duvvada Srinivas - Madhuri: బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గోడవలు రచ్చకెక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తన భార్య వాణి, కూతుళ్లపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ. అనంతరం వాణితో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు.
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్..మిగితా రాజకీయ నాయకులకు కనువిప్పే, ఎందుకో తెలుసా?
Arun Charagondaరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
Astrology: ఆగస్టు 31న రాహు ,బుధుడి కలయిక దీనివల్ల ఈ మూడు రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహం రాముతో కలయిక వల్ల కొన్ని శుభశకునాలు వస్తాయి. దీని ద్వారా ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Astrology: ఆగస్టు 19న కుజుడు మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..దీని కారణంగా ఈ ఐదు రాశుల వారికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు బలమైన గ్రహం. ఈ గ్రహం కదలిక వల్ల కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈసారి ఆగస్టు 19వ తేదీన కుజుడు మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఐదు రాశుల వారికి సుమారు 15 రోజుల పాటు కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: జీవితకాలంఆరోగ్యంగా ఉండడానికి ఈ ఐదు సూత్రాలు పాటించండి..
sajayaప్రస్తుతం ప్రతి ఐదు మందిలో ఇద్దరు కచ్చితంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కూడా ఎక్కువ అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. బిజీ లైఫ్ కారణంగా వారి మానసిక ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుంది. మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన జీవితకాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు
Health Tips: తరచుగా జ్వరం వస్తుందా..అయితే ఈ లక్షణాలు ఉంటే అది మలేరియా కావచ్చు
sajayaమలేరియా అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది దోమల ద్వారా మానవులకు సంక్రమిస్తుంది. మలేరియా లక్షణాలు కారణాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేసుకోపోతే అది ప్రాణాంతకంగా మారుతుంది.
Health Tips: భోజనం తర్వాత పది నిమిషాలు నడకతో మీ షుగర్ కంట్రోల్ అవుతుంది.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య మధుమేహం. ఒకప్పుడు మధుమేహం కేవలం 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య కానీ ప్రస్తుత సమయంలో ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి 20 మందిలో ఇద్దరినీ ఇబ్బంది పెట్టే సమస్య.
Sitarama Project: వీడియో.. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్, స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్, 15న ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది. పుసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేశారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, తుమ్మలతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 15న సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Health Tips; మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ డి లోపం ఉన్నట్లే.
sajayaమన శరీరానికి విటమిన్ డి ఒక ముఖ్యమైన పోషకం. ఇది మనకు ఎముకల గట్టిదనానికి దంతాలను ,కాల్షియం గ్రహించడంలో ఈ విటమిన్ డి సహాయపడుతుంది. అదేవిధంగా మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా ఈ విటమిన్ సహాయపడుతుంది.
Shamshabad Airport: షూలో రూ. కోటి బంగారం, దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుడి షూలో బయటపడ్డ బంగారం, పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
Arun Charagondaశంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. దుబాయ్ నుండి హైదరాబాద్కి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. షూలో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Andhra Pradesh Rains: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు, ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.