News
Harleen Deol asks PM Modi Skincare: వీడియో ఇదిగో, సర్, మీ స్కిన్ ఎప్పుడూ చాలా గ్లోగా ఉంటుంది, మీ స్కిన్కేర్ రొటీన్ ఏంటి? హర్లీన్ డియోల్ ప్రశ్నతో నవ్వుల్లో మునిగిన ప్రధాని మోదీ
Team Latestlyమహిళల వన్డే వరల్డ్కప్ గెలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిసింది. ఈ సందర్భంగా అమ్మాయిలతో ప్రధాని మోదీ సరదాగా ముచ్చటించారు. ప్రతి మహిళను వ్యక్తిగతంగా పలకరించి, వారి ఆట, అనుభవాల గురించి తెలుసుకున్నారు. కానీ ఈ చర్చలో ఓ సరదా క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది.
Harish Rai Dies: ధైరాయిడ్ క్యాన్సర్తో పోరాడి మృతి చెందిన కేజీఎఫ్ మూవీ నటుడు, చికిత్స చేయించుకోవడానికి రూ.70 లక్షలు ఖర్చు..చూస్తుండగానే క్యాన్సర్ ముదిరి నాలుగో స్టేజీకి..
Team Latestlyకన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేమ్ హరీశ్ రాయ్ (Harish Rai) క్యాన్సర్తో పోరాడి కన్నుమూశారు. కొంతకాలంగా ధైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం తుదిశ్వాస విడిచారు. కన్నడలో అనేక సినిమాలు చేసిన హరీశ్.. కేజీఎఫ్ మూవీలో చాచా అనే ముస్లిం వ్యక్తిగా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.
Male Fertility Risks: కాలుష్యం, వేడితో మగాళ్లు తండ్రి అయ్యే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు, మానవాళిని మరొక నిశ్శబ్ద ముప్పు వెంటాడుతోందని హెచ్చరిస్తున్న వైద్యులు
Team Latestlyప్రపంచం వాతావరణ మార్పులు, కాలుష్యం, వేడిగాలులతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మరొక నిశ్శబ్ద ముప్పు మానవాళిని వెంటాడుతోంది. అదే పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత గణనీయంగా తగ్గుతున్నట్లు తేలింది.
RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Team Latestlyఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.
Bapatla Road Accident: వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి
Team Latestlyఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్కి వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు
Deoria Boat Capsize: వీడియో ఇదిగో, కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల సందర్భంగా విషాదం, సరయూ నదిలో పడవ బోల్తా, పలువురు గల్లంతు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Team Latestlyఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా బర్హాజ్ గంగా ఘాట్ వద్ద బుధవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాల కోసం వచ్చిన భక్తులతో నిండిన ఓ పడవ సరయూ నదిలో బోల్తా పడింది. సమాచారం ప్రకారం, ఆ పడవలో 12 మంది భక్తులు ఉన్నారు.
Diabetic Kidney Disease: మధుమేహ రోగుల్లో కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించే మార్గం, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తల నూతన పరిశోధన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో అధ్యయనం
Team Latestlyమధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కలిగే తీవ్రమైన సమస్యల్లో ఒకటి మూత్రపిండాల వైఫల్యం (Kidney Failure). ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి నివారించే మార్గం ఇప్పుడు శాస్త్రవేత్తల దృష్టికి వచ్చింది. తాజాగా ఐఐటీ బాంబే (IIT Bombay) పరిశోధక బృందం చేసిన పరిశోధనలో డయాబెటిస్ ఉన్న వ్యక్తుల రక్తంలో ఉన్న బయోమార్కర్లు ద్వారా భవిష్యత్తులో వారికి మూత్రపిండ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని తేలింది.
Karnataka Road Accident: దైవ దర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, దైవ యాత్రకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన నలుగురు తెలంగాణ వాసులు మృతి
Team Latestlyకర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిని తోసేసిన సీఐ, బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వస్తే ఇలా చేస్తారా అని మండిపాటు
Team Latestlyచిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ కు తరలించే లోపు మృతి చెందాడు. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
PAN Aadhaar Linking: పాన్ కార్డుదారులకు చివరి హెచ్చరిక.. ఈ తేదీలోగా ఆధార్తో లింక్ చేయండి, లేదంటే బ్యాంకింగ్ సేవలు అన్నీ నిలిచిపోయే ప్రమాదం, ఇతర ఆదాయాలపై వడ్డీ కట్
Team Latestlyదేశవ్యాప్తంగా కోట్లాది మంది పాన్ కార్డుదారులకు ఇది అత్యంత కీలకమైన హెచ్చరికను జారి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ మీ పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే నష్టపోతారని హెచ్చరించింది. వెంటనే అప్రమత్తం అవ్వాలని తెలిపింది.
Road Accident in Nagarkurnool: నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyనాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.
Chhattisgarh Train Accident: ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం, గూడ్స్ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్, ఇద్దరికి గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyఛత్తీస్గఢ్ (Chattishgarh)లోని బిలాస్పూర్ (Bilaspur)లో ఘోర రైలు ప్రమాదం (Train accident) చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు.. జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు
Faridabad Shocker: వీడియో ఇదిగో, లైబ్రరీ నుండి తిరిగి వస్తున్న బాలికపై దుండగుడు కాల్పులు, హర్యానాలో నడిరోడ్డుపై దారుణ ఘటన
Team Latestlyహర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఒక దుండగుడు నడిరోడ్డుపై 17 ఏళ్ల బాలికపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన నగరంలోని ఒక ప్రైవేటు లైబ్రరీ వెలుపల చోటు చేసుకుంది. వీరిద్దరు నిత్యం ఆ లైబ్రరీకి వస్తున్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
Health Alert: ఈ 7 లక్షణాలు కనపడితే జాగ్రత్త, పురుషుల శరీరంలో క్యాన్సర్ ముదురుతున్న సంకేతాలు కావచ్చు, వెంటనే అలర్ట్ కాకుంటే ప్రాణాలకే ప్రమాదం
Team Latestlyమనలో చాలామంది క్యాన్సర్ అనేది కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే వస్తుందని భావిస్తారు. కానీ వైద్య పరిశోధనలు చెప్పే దాని ప్రకారం కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, జీవనశైలి, వయస్సు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ ప్రభావాలు వంటి అంశాలు భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
Digital Arrest Scam Alert: ఆ కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకండి, డిజిటల్ అరెస్ట్ స్కాంలపై ఎన్పీసీఐ హెచ్చరిక, సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి ఫిర్యాదు చేయాలని వెల్లడి
Team Latestlyదేశవ్యాప్తంగా సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజా ప్రకటనతో ప్రజలకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని NPCI స్పష్టం చేసింది.
India’s Hidden Health Crisis: భారత్లో భారీగా పెరుగుతున్న అంటువ్యాధులు, ఐసీఎంఆర్ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి.. అలర్ట్ కాకుండా అంతే సంగతులిక..
Team Latestlyభారతదేశంలో అంటువ్యాధుల వ్యాప్తి క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా నివేదిక స్పష్టం చేసింది. ప్రజారోగ్యానికి కీలకమైన వైరల్ ఇన్ఫెక్షన్లను గుర్తించే లక్ష్యంతో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీస్ (VRDL) నెట్వర్క్ దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాలపై విశ్లేషణ జరిపింది
Tamil Nadu Shocker: తమిళనాడులో దారుణం, కాలేజీ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ముగ్గురు వ్యక్తులు, ఎయిర్పోర్ట్ సమీపంలో లాక్కెళ్లి సామూహిక అత్యాచారం
Team Latestlyతమిళనాడులో దారుణ ఘటన వెలుగుచూసి కలకలం రేపింది. కేరళ సరిహద్దుకు సమీపంలోని కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుతున్న విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఆ యువతి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరింది.
ICC Women’s World Cup 2025: తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకున్న భారత్, దేవుని ప్రణాళిక అంటూ హృదయానికి హత్తుకునే పోస్ట్ పెట్టిన షఫాలీ వర్మ, అభినందనల వెల్లువ
Team Latestlyఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న వన్డే ప్రపంచకప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ దరిచేరింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. షెఫాలీవర్మ, దీప్తిశర్మ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్..స్ఫూర్తిదాయక పోరాటంతో కదంతొక్కింది. లక్ష్యఛేదనలో సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ పోరాటం సఫలం కాలేకపోయింది.
Jaipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు
Team Latestlyరాజస్థాన్లోని జైపూర్లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Chevella Bus Accident: టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే బస్సు ప్రమాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Team Latestlyరంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం పీర్జాగూడ ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బస్సు మీద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.