ఆంధ్ర ప్రదేశ్

Rajya Sabha Polls 2022: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ, టీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు, ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు నామినేషన్‌ దాఖలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు (Rajya Sabha Polls 2022) వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.అలాగే తెలంగాణ నుంచి రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి (TRS Candidates) నామినేషన్‌ దాఖలు చేశారు.

CM Jagan Davos Tour: ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న కంపెనీలు, గ్రీన్‌ ఎనర్జీ రంగంలో మరో రూ.65 వేల కోట్ల పెట్టుబడులు, కొనసాగుతున్న సీఎం దావోస్ పర్యటన

Hazarath Reddy

ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన (CM Jagan Davos Tour) కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్‌ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

Konaseema Violence: నిప్పు పెట్టిందెవరు.. కోనసీమకు అదనపు బలగాలు, కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులు రద్దు, అమలాపురంలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

Hazarath Reddy

కోనసీమ జిల్లాకు జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన (Konaseema Violence) సంగతి విదితమే. జిల్లాకు చెందిన దళిత మంత్రి పినిపె విశ్వరూప్, బీసీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇళ్లను తగులబెట్టారు.

Minister Pinipe Viswarup: నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం, విపక్షాలు చేస్తున్న కుట్రలివి, కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలని తెలిపిన మంత్రి విశ్వరూప్

Hazarath Reddy

మంత్రి విశ్వరూప్‌ స్పందిస్తూ.. 'నా ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం. జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ డిమాండ్‌ చేశాయి. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన నిరసనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టిస్తున్నారు.

Advertisement

Andhra Pradesh: ఏ ఘటన జరిగినా ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్ తెలిపారు, మీడియాతో సజ్జల రామకృష్ణారెడ్డి

Hazarath Reddy

ఎమ్మెల్సీ అనంతబాబు(అనంత్‌ ఉదయ్‌ భాస్కర్‌) కేసు విషయంలో ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్‌ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Andhra Pradesh: అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, మంత్రి విశ్వరూప్‌ ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు, జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్లదాడి

Hazarath Reddy

కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన ఆందోళనలు (protests against ap govt's decision) హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించారు.

MP Margani Bharat: ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన రఘురామకృష్ణరాజు లాంటి వారిని ఉపేక్షించకూడదు, ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపీ భరత్

Hazarath Reddy

వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామపై మరొక ఎంపీ మార్గాని భరత్ (MP Margani Bharat) ఫైర్ అయ్యారు. ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన రఘురామకృష్ణరాజు లాంటి వారిని ఉపేక్షించరాదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రఘురామపై అనర్హత వేటు వేయాలని రెండేళ్లుగా కోరుతున్నామన్నారు.

Minister Ambati Rambabu: చంద్రబాబును ఆయన కొడుకును ప్రజలు తరిమేశారు, నర్సారావుపేటలో మే 28న సామాజిక న్యాయభేరి బహిరంగ సభ, రెండేళ్ల తర్వాతే ఎన్నికలని తెలిపిన మంత్రి అంబటి రాంబాబు

Hazarath Reddy

గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ఆయన పార్టీని ప్రజలు బాదుడే బాదుడని అనేశారని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) అన్నారు. తర్వాత వచ్చిన మున్సిపల్‌ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోనూ చంద్రబాబు, ఆయన కొడుకుని ప్రజలు తరిమేశారన్నారు.

Advertisement

MLC Anantha Babu Arrest: రాజమండ్రి జైలుకు ఎమ్మెల్సీ అనంతబాబు, 14 రోజుల రిమాండ్‌ విధించిన కాకినాడ కోర్టు, డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు వివరాలను వెల్లడించిన కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

Hazarath Reddy

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్‌ (MLC Anantha Babu Arrest) చేశారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో అనంతబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా కోర్టు కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

CM Jagan Davos Tour: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది, ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌

Hazarath Reddy

దావోస్‌ వేదికగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది అంటూ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

CM YS Jagan Davos Tour: సంక్షేమం నుంచి అభివృద్ధి వైపు ఏపీ అడుగులు, దావోస్‌లో పలు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం, ఇంధన రంగంలో 60 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రీన్‌ ఎనర్జీ

Hazarath Reddy

దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన (CM YS Jagan Davos Tour) సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు.

CM Jagan Davos Tour: ఐటీ హబ్‌గా విశాఖపట్నం, ఇదే జగన్ సంకల్పమని తెలిపిన టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ, విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న దస్సాల్ట్‌

Hazarath Reddy

సీపీ గుర్నానీ మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ఇక్కడ నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాలని టెక్‌ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. దీనికి గాను ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్‌ మహీంద్రా చైర్మన్‌ వెల్లడించారు

Advertisement

Bride Srujana Death Case: వీడిన నవ వధువు సృజన మృతి కేసు మిస్టరీ, ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన పోలీసులు

Hazarath Reddy

విశాఖలోని మధురవాడలో నవ వధువు సృజన మృతిపై (Bride Srujana Death Case) ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు.

MLC Anantha Babu: పోలీసులు ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్‌ హత్య కేసు విచారణ జరుగుతోందని తెలిపిన ఏఎస్పీ శ్రీనివాస్‌

Hazarath Reddy

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి (MLC Anantha Babu Arrest) తీసుకున్నారు. డ్రైవర్‌ హత్య కేసు విచారణ జరుగుతోందని ఏఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. అనంతబాబు పోలీస్‌ కస్టడీలో ఉన్నారని తెలిపారు.

CM Jagan Davos Tour: ఏపీలో వైద్యరంగం అత్యుత్తమంగా ఉంది, దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో ఏపీ సీఎం జగన్, ప్రజల ఆరోగ్య పరిరక్షణ మా ధ్యేయం అని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

సీఎం జగన్ దావోస్ పర్యటన (CM Jagan Davos Tour) కొనసాగుతోంది. నేడు దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) రెండో రోజు (సోమవారం) ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై మాట్లాడారు.

YS Jagan Davos Tour: దావోస్‌లో బిజీబిజీగా ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తొలిరోజు పలు కీలక భేటీల్లో పాల్గొన్న జగన్, పలువురు ఆర్ధికవేత్తలతో భేటీ

Naresh. VNS

దావోస్‌లో (Davos) జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో (World Economic forum) పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలువురు ప్రముఖులతో వరుస సమావేశాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాలుష్యం లేని ఇంధనాలపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సీఎం వివరించారు

Advertisement

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం, ఘటనపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌బాబు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన కాకినాడ ఎఎస్పీ శ్రీనివాస్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (MLC Anantha babu) కారులో మృతదేహం కలకలం రేపుతున్నది. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు కారులో యువకుడి మృతదేహం బయటపడింది. అతడిని ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రమణ్యంగా ( ex-driver found dead in Kakinada) గుర్తించారు

Harirama Jogaiah Letter To Pawan: వైసీపీ ట్రాప్‌లో పడొద్దు, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటూ జనసేనకు సలహా, పొత్తు పెట్టుకుంటేనే ఇద్దరికీ లాభమంటూ పవన్ కల్యాణ్‌కు లేఖ రాసిన సీనియర్ నేత హరిరామ జోగయ్య

Naresh. VNS

పవన్‌కి కీలకమైన సలహా ఇచ్చారు రామజోగయ్య. పవన్ కల్యాణ్‌ని.. వైసీపీ కవ్విస్తోందని.. ఒంటరిగా పోటీ చేయమని చెప్పడం వెనుక ఫక్తు రాజకీయమే ఉందని అభిప్రాయపడ్డారు. విపక్షాలన్నీ.. విడివిడిగా పోటీ చేస్తే.. మళ్లీ వైసీపీదే అధికారమని చెప్పారు. అందువల్ల.. వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చకుండా.. పవన్ జాగ్రత్త పడాలని.. ఇందుకోసం.. టీడీపీతో పాటు బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.

Volunteer Murder Case: మహిళా వాలంటీర్‌ను చంపేశాడు, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు, మలుపులు తిరుగుతున్న వాలంటీర్ శారద హత్య కేసు

Hazarath Reddy

ఏపీలో బాపట్ల జిల్లా చావలి గ్రామానికి చెందిన వాలంటీర్ శారద హత్య కేసులో (Volunteer Murder Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెను హత్య చేసిన పద్మారావు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు సమీపంలోని నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో పద్మారావు (Accused Padmarao commits suicide) ఆత్మహత్య చేసుకున్నాడు.

CM YS Jagan Review: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష, బెండపూడి జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన ఏపీ ముఖ్యమంత్రి, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి అబ్బురపరిచిన విద్యార్థులు

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై గురువారం (CM YS Jagan Review)చేపట్టారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత‍్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement
Advertisement