ఆంధ్ర ప్రదేశ్
AP Coronavirus Report: ఒకే కుటుంబంలో ఏడుమందికి కరోనా, గుంటూరు జిల్లాలో గంటకు నాలుగు కరోనా కేసులు, ఏపీలో తాజాగా 443 కోవిడ్-19 కేసులు నమోదు, రాష్ట్రంలో 9,372కి చేరిన కేసులు సంఖ్య
Hazarath Reddyఏపీలో సోమవారం కొత్తగా 443 కరోనావైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,704నమూనాలు పరీక్షించగా 443 కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 New cases) నమోదయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మందికి, విదేశాల నుంచి వచ్చిన 7 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.
AP CM YS Jagan Review: ఏపీలో అన్ని గ్రామాలకు 104 వాహనం వెళ్లాలి, పేషెంట్లకు అక్కడే మందులు ఇవ్వాలి, అధికారులకు ఆదేశాలు జారీచేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Hazarath Reddyకరోనా నియంత్రణ చర్యలపై (COVID-19) సోమవారం ఏపీ సీఎం వైయస్ జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష (AP CM YS Jagan Review) జరిపారు. ఈ సమీక్షలో 104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. . 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌ చేయాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలిచ్చారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు.
High Rain Alert: రానున్న మూడు రోజులు ఏపీలో వర్షాలు, కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఆదివారం తడిసి ముద్దయిన విజయవాడ
Hazarath Reddyఏపీలో (Andhra Pradesh) రానున్న మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు (Special rain alert) కురవనున్నాయి. ఉత్తర ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమ, మంగళ బుధవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు (High Rain Alert) కురుస్తాయని విశాఖ కేంద్రం అధికారులు (Vizag IMD) వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 25న కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అయితే కోస్తా, రాయలసీమపై నైరుతి ప్రభావం సాధారణంగా ఉంది.
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 477 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,929కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 106కు పెరిగిన కరోనా మరణాలు
Team Latestlyరాష్ట్రంలో కొత్తగా మరో 5 కరోనా మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు, కర్నూల్ నుంచి ఒకరు మరియు చిత్తూరులో ఒకరు చొప్పున ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. తాజా మరణాలతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 106 కు పెరిగింది....
AP SSC Exams 2020: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు! విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్లు వెల్లడి
Team Latestlyఏపి ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. కాగా, ఇప్పటికే తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే....
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 491 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 8,452కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 100 దాటిన కరోనా మరణాలు
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బాదితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 294 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,452 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి...
Rajya Sabha Election Results 2020: టీడీపీకి భంగపాటు, ఏపీలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ, దేశంలో 11 స్థానాలకు ఫలితాలు వెల్లడి
Hazarath Reddyఏపీలో రాజ్యసభ ఎన్నికలు (AP Rajya Sabha Election Results 2020) ఏకపక్షంగా సాగాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ (YSRCP) తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి.
Vaccine Manufacturing Unit: పులివెందుల ఏపీ కార్ల్‌లో వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌, 2021 నుంచి వ్యాక్సిన్ల తయారీ, ఐజీవైతో కీలక ఒప్పందం చేసుకున్న ఏపీ సర్కారు
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు మరో ముందడుగు వేసింది. ఏపీలో ప్రపంచస్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని (Vaccine Manufacturing Unit) నెలకొల్పే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడుగులు వేసింది. పులివెందుల ఏపీ కార్ల్‌లో (APCARL In Pulivendula) వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS jagan) సమక్షంలో ఐజీవైతో (Immunologix India Pvt Ltd (IGY)అవగాహన ఒప్పందం కుదురింది. ఈ మేరకు ఏపీ కార్ల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు (APCARL CEO Dr M Srinivasarao), ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
AP Coronavirus Report: ఒక్కరి ద్వారా 226 మందికి కరోనా అంటుకుంది, మళ్లీ ఒంగోలులో 14 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్, ఏపీలో కొత్తగా 376 కేసులు నమోదు, 6230కి చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 376 కొత్త కేసులు (Andhra Pradesh Coronavirus) నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 17,609 శాంపిల్స్‌ని పరీక్షించగా 376 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 82 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో మరో నలుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసులు 6230కి (coronavirus cases in AP) చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 96గా నమోదైంది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3065కి (AP Coronavirus) చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 3069 మంది చికిత్స పొందుతున్నారు.
Illegal Registration Case: జేసీ ఫ్యామిలీకి షాక్, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన అనంతపురం కోర్టు, మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ
Hazarath Reddyజేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యుమెంట్ల అక్రమాల కేసులో (Illegal Registration Case) అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ల బెయిల్‌ పిటిషన్‌ను గురువారం అనంతపురం కోర్టు (Anantapur Court) తిరస్కరించింది. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లను (JC Prabhakar Reddy, Asmith Reddy) రెండు రోజులు పోలీస్‌ కస్టడీకి అనుమతించింది. ఈ ఇద్దరిపై మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లు (PT warrants) జారీ అయ్యాయి. 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డిని పోలీసులు విచారించారు.
AP Coronavirus: మరో రికార్డు దిశగా ఏపీ, ఆరు లక్షల మార్కుకు చేరువలో కరోనా టెస్టులు, ఏపీలో తాజాగా 299 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 299 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ కేసులను కలుపుకుని రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 5854 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 13,923 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 299 మందికి పాజిటివ్‌గా (Coronavirus Outbreak) నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా ( COVID-19) నుంచి కోలుకుని 77 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 92కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,983 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 2,779 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.
YSR Nethanna Nestham: వారి అకౌంట్లోకి నేరుగా రూ.24,000, వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, ఈ నెల 20న అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సర్కారు అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చుకుంటూ వెళుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం (YSR Nethanna Nestham) ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ఏపీ ప్రభుత్వం (AP Govt) స్పష్టం చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల (Grama Volunteers) ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది.
Vedadri Road Accident: వేదాద్రి మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం రూ.5లక్షల పరిహారం, తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyకృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Vedadri Road Accident) చనిపోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Divya's Murder Case Facts: దివ్యను లక్షకు అమ్మేశారు, శరీరం కుళ్లిపోయేలా వాతలు పెట్టి చంపేశారు, విశాఖ దివ్య హత్యకేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
Hazarath Reddyఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విశాఖపట్నం దివ్య హత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు (Divya's Murder Case Facts) బయటకు వస్తున్నాయి. పోలీసులు (Visakhapatnam police) హత్య కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతవారం అరెస్ట్ చేసిన‌ నిందితులలో దివ్య పిన్ని కాంతవేణితో పాటు మరికొందరిని పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు‌ కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో (Police Investigation) షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
AP Assembly: ఏపీలో ఎన్‌ఆర్‌సీ అమలు ఉండదు, ఏపీ బడ్జెట్‌ 2020-21తో పాటు 15 బిల్లులకు శాసనసభ ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా, అమరవీరులకు ఏపీ అసెంబ్లీ నివాళి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ 2020-21 కు (AP 2020-21 budget bill) శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. దాంతోపాటు ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు మాసాల బడ్జెట్ కోసం రూ. 70 వేల కోట్లకు ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28వ తేదీన జారీ చేసింది. మూడు మాసాల గడువు దాటిపోతోంది. దీంతో అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. 2020-21 బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
AP Coronavirus Report: శ్రీకాకుళంలో తొలి కరోనా మరణం, ఏపీలో తాజాగా 275 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు, 5,555కు చేరిన మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిల్స్ పరీక్షించగా 275 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,555కు చేరినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కరోనా మహమ్మారి‌ కారణంగా గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో(Andhra Pradesh) 90 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకొని 2,906 మంది డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం 2,559 యాక్టివ్‌ కేసులున్నాయి.
Vedadri Road Accident: కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, తొమ్మిది మంది మృతి. 24 మందికి తీవ్రగాయాలు, మృతుల్లో ఇద్దరు చిన్నారులు
Hazarath Reddyకృష్ణా జిల్లా (krishna district) జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Vedadri Road Accident) జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం గోపవరం నుంచి 25 మందితో ట్రాక్టర్‌లో దైవదర్శ నానికి వేదాద్రి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం ( Krishna Road Accident) జరిగింది.
AP Legislative Council: మళ్లీ బిల్లును శాసనమండలిలో అడ్డుకుంటారా, ఈ రోజు శాసనమండలి ముందుకు వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు, కల్నల్‌ సంతోష్‌ మృతికి ఏపీ మండలి సంతాపం
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సమావేశాలు (AP Legislative council) రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలి చైర్మెన్‌ అధ్యక్షతన బుధవారం రోజు 12 నిమిషాలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది.ముందుగా తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ (Galwan Valley) ప్రాంతంలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు శాసనమండలి సంతాపం తెలిపింది. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ (BJP MLC Madhav) ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
All Bills Passed in AP Assembly: ఏపీ అసెంబ్లీలో అన్ని బిల్లులు మూజువాణి ఓటుతో పాస్, 3 రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం, సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లుకు ఆమోదం
Hazarath Reddyమొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Ap Assembly) ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటుగా అన్ని రకాల బిల్లుల ఆమోదంతో (All Bills Passed in AP Assembly) ముగిసాయి. ఏపీ శాసనసభ చరిత్రాత్మక బిల్లులను అమోదించింది. ఇందులో పరిపాలన వికేంద్రీకరణ – ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’, ‘సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు’లు (AP Capital Region Development Authority (CRDA) Act 2014) ఉన్నాయి. ఈ బిల్లులను శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దీంతో రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు(Three capitals) ద్వారా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ బిల్లు ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది.
Chintakayala Ayyanna Patrudu: టీడీపీకి మళ్లీ షాక్, బట్టలు ఊడదీస్తానని వార్నింగ్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyటీడీపీ నేతలకు (TDP Leaders) వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఘటనలు మరువక ముందే తెలుగుదేశం( Telugu desam Party) పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ (Vizag Munsipal Commissionar) తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై (Chintakayala Ayyanna Patrudu) నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. కమిషనర్‌ ఫిర్యాదు మేరకు నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు వెల్లడించారు.