తెలంగాణ
Revanth Reddy On Cyber Crimes: పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు.. ఇదొక భావోద్వేగం, కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలను మరిచిపోలేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaకానిస్టేబుల్ కిష్టయ్య లాంటి ఎంతో మంది త్యాగాలను తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగం జీవనోపాధి కోసం చేసే ఉద్యోగం కాదు. ఇదొక భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటిసారి నిర్వహించిన పోలీస్ డ్యూటీమీట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
AP Jawan Martyred: ఛత్తీస్ గఢ్ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం
Rudraఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ అమరుడయ్యారు.
Nagarjuna Sagar: ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు
Rudraఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. ఈ క్రమంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు.
Telangana key Announcement Tomorrow:గ్రూప్-1 పరీక్షపై కీలక ప్రకటన చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొన్నం ఇంట్లో కీలక చర్చలు
VNSమంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు.. ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష(Group 1), జీవో 29 అంశంపై (GO 29) చర్చించినట్టు సమాచారం. గ్రూప్-1 అభ్యర్థులు (Group -1 Candidates) చేస్తున్న విజ్ఞప్తులు, పరీక్షల వాయిదా సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించారు
CM Revanth Reddy: కేంద్రమంత్రి బండి సంజయ్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్, తిరస్కరించిన బండి, గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి దీక్ష
Arun Charagondaకేంద్ర మంత్రి బండి సంజయ్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. జీవో నెంబర్ 29పై చర్చించేందుకు సచివాలయం రావాలని ఆహ్వానించారు. అయితే సీఎం రేవంత్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు బండి సంజయ్. గ్రూప్ -1 అభ్యర్థులతో కలిసి లోయర్ ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తున్నారు సంజయ్.
Tummala Nageshwarrao: ఈ ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల
Arun Charagondaఈ ఖరీఫ్కు రైతు భరోసా లేదు అని తేల్చి చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం...పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది...రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.
Nagarkurnool: తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన
Arun Charagondaతన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. నాగర్ కర్నూల్ - లింగాలలో పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవపడ్డారు యువకులు. పీఎస్కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా పరిస్థితి విషమంగా మారింది.
Secundrabad: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్తత, పోలీసుల లాఠిచార్జీ,ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు...వీడియో ఇదిగో
Arun Charagondaసికింద్రాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సికింద్రాబాద్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. ముత్యాలమ్మ గుడి ఘటనలో ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Singireddy Niranjan Reddy: బండి సంజయ్...కేంద్ర సహాయమంత్రా?..సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా?,రేవంత్ కుర్చి గురించి నీకెందుకు బాధని మండిపడ్డ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Arun Charagondaబండి సంజయ్...కేంద్ర సహాయ మంత్రా ?, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా ? చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి.
Palakurthi: పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి, తన చావుకు సీఐ,ఎస్ఐలే కారణమని సెల్ఫీ వీడియో
Arun Charagondaపోలీస్ స్టేషన్లో న్యాయం జరగడంలేదని పోలీసుల ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి చెందాడు. చనిపోయే ముందు పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ లే.. నా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు.
Palakurthi: పాలకుర్తి పోలీస్ స్టేషన్లో యువకుడు ఆత్మహత్యా యత్నం, కుటుంబ సమస్యలతో పెట్రోల్తో నిప్పంటించుకున్న యువకుడు,కాపాడబోయిన ఎస్సై- కానిస్టేబుల్కు గాయాలు
Arun Charagondaజనగాం జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు చెందిన లాకవత్ శీను(22) పెట్రోల్ పోసుకొని అగాయత్యానికి పాల్పడ్డారు.
Raids On Chutneys: వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్ రెస్టారెంట్ పై కేసు నమోదు
Rudraహైదరాబాద్ లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు.
Hyderabad Horror: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. హైదరాబాద్ లో ఘోరం
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Lady Aghori: కీసరగుట్టలో మహిళా అఘోరి, ఒంటి కాలిపై నిలబడి శివుడికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు
Arun Charagondaమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో శుక్రవారం మహిళా అఘోరి ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ మహిళా అఘోరి కొండపైన వెలిసిన శివలింగాలను స్పృశిస్తూ శివలింగాన్ని తాకి ఆనంద పరవశంలో ఒంటి కాలిపై నిలబడి ఆ దేవదేవుడిని ధ్యానించారు.
Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)
Rudraఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది.
Hyderabad: పులి కాదు పిల్లి...మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత సంచారం ఉత్తదే అని తేల్చిన అటవీ శాఖ అధికారులు...
Arun Charagondaనిన్న మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర చిరుత తిరిగినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది చిరుత కాదు అడవి పిల్లి అని తేల్చేశారు అటవీశాఖ అధికారులు. హైదరాబాద్ - మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు ఉండగా పోలీసులకు సమాచారం అందించారు.
Car Accident: బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. అంతే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. జనగామలో ఘటన (వీడియో)
Rudraఅతను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు.
Car Accident: హైదరాబాద్ ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అతివేగంగా వచ్చి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు.. యువకులకు గాయాలు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ప్రజాభవన్ ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.
Nude Video Call: తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి నగ్నంగా ఉన్న మహిళ నుంచి వీడియో కాల్.. కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు
Rudraఅతనో ఎమ్మెల్యే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు.
Leopard Spotted near Miyapur Metro: వామ్మో హైదరాబాద్ లో చిరుత సంచారం, మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక తిరుగుతోందని వార్తలు, ఫోన్ లో వీడియోలు తీసిన స్థానికులు
VNSఅడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరుత సంచరించింది.