తెలంగాణ

TS COVID Update: తెలంగాణలో కొత్తగా మరో 148 కోవిడ్ కేసులు నమోదు, 1640కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్

Team Latestly

Covid in India: ముంబైలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, దేశంలో తాజాగా 9,121 మందికి కరోనా నిర్ధారణ, ఏపీలో 30 మందికి పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 9,121 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 81 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,813కు పెరిగింది.

Car Plunges into Canal in Jagtial: జగిత్యాలలో తీవ్ర విషాదం, ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు, కుటుంబంలో ముగ్గురు మృతి, ఒకరు సురక్షితంగా బయటకు, ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఓ కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కాలువలోకి (Car Plunges into Canal in Jagtial) దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. వారిని కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. ఈ ఫ్యామిలీ జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Jagtial)TRS MLA Sanjay Kumar) సమీప బంధువులని తెలుస్తోంది.

India Covid Updates: మహారాష్ట్రను మళ్లీ వణికిస్తున్న కరోనా, తాజాగా 4 వేల కరోనా కేసులు, ఒకే రోజు 40 మంది మృతి, దేశంలో తాజాగా 11,649 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 99 కొత్త కేసులు, ఏపీలో 55 మందికి పాజిటివ్

Hazarath Reddy

దేశంలో దేశంలో గత 24 గంటల్లో 11,649 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 9,489 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,16,589 కు చేరింది.

Advertisement

Covid Updates: కరోనా వ్యాక్సిన్ పనిచేయడం లేదా...తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు డాక్టర్లకు కరోనా, దేశంలో తాజాగా 12,194 కేసులు, ఏపీలో 54 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 146 కరోనా కేసులు, కరోనా పేషెంట్ల డేటా ఇచ్చేందుకు నిరాకరించిన చైనా

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 92 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

MP Asaduddin Owaisi: హైదరాబాద్‌‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నం, లోక్‌సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు రెడీగా ఉండాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని మోదీ సర్కారు యత్నిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Hyderabad MP Asaduddin Owaisi) అన్నారు.

Robbers Attack: తెలుగువారిపై మహారాష్ట్రలో దొంగలు దాడి, షిర్డీ నుంచి వస్తుండగా కత్తులతో అడ్డగించిన దొంగల గుంపు, 8 తులాల బంగారం అపహరణ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

Hazarath Reddy

మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ వికారాబాద్ బండవేలికిచర్లకు చెందిన కుటుంబం పై వాసీలో దొంగలు దాడి (Robbers Attack) చేశారు. విచక్షణ రహితంగా చిన్న పిల్లలు, మహిళలు అని చూడకుండా కత్తులతో దాడికి పాల్పడ్డారు.

Ghatkesar Kidnap Case: రేప్ కట్టుకథతో పోలీసులకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన యువతి, ఘట్ కేసర్ అత్యాచార ఘటన అంతా అబద్ధం, మీడియాకు వివరాలను వెల్లడించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్

Hazarath Reddy

ఘట్ కేసర్ వద్ద నాపై అత్యాచారం చేశారంటూ బీఫార్మసీ విద్యార్థిని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతిపై అత్యాచారం జరగలేదని (Ghatkesar Kidnap Case) అది కేవలం అంతా కట్టకథని పోలీసులు తేల్సి పడేశారు. ఈ విషయాలను రాజకొండి సీపీ మహేష్ భగవత్ (Rachakonda CP mahesh bhagwat) మీడియాకు వెల్లడించారు. బీఫార్మసీ విద్యార్ధినిపై అత్యాచారం జరగలేదని అదంతా కట్టుకథని ఆయన అన్నారు.

Advertisement

VC Sajjanar Warns: వింత శబ్దాలతో భయపెట్టేవారికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్, వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు, మెకానిక్‌లపైనా చర్యలు తప్పవు

Hazarath Reddy

వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ (VC Sajjanar Warns About Silencers) ఇచ్చారు. వెంటనే వీటిని తొలగించాలని ఆదేశించాలు జారీ చేశారు. భయంకరమైన, వింత శబ్దాలు వచ్చే సైలెన్సర్లు అమర్చి తోటి వాహనదారులను ఇబ్బంది పెట్టే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

India Covid Updates: నేటి నుంచి రెండో డోస్, దేశంలో 24 గంటల్లో 12,143 మందికి కరోనా, తెలంగాణలో తాజాగా 151 కరోనా కేసులు నమోదు, ఏపీలో 68 కొత్త కేసులు, ఇండియాలో 1,08,92,746కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 12,143 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,395 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,92,746కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 103 మంది కరోనా కారణంగా (Covid Deaths) మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,550కు పెరిగింది.

TS Common Entrance Tests: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు 2021కి షెడ్యూల్ విడుదల, జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్ష; ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువు పొడగింపు

Team Latestly

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీని పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. 100 రూపాయల ఆలస్య రుసుముతో చెల్లింపుకు చివరి తేదీ ఫిబ్రవరి 23 గడువు.....

Vaccination in TS: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేటితో ముగియనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, కేవలం 34 శాతం మందికి మాత్రమే లబ్దిదారులు, రాష్ట్రంలో కొత్తగా మరో 143 కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

ఫిబ్రవరి 11 వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో 76,749 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అనుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది కేవలం 34 శాతం మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటివరకు 2,70,234 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నారు....

Advertisement

'Hyderabad a Mini India': హైదరాబాద్ ఒక విశ్వనగరం, భిన్న సంస్కృతులు కలిగిన మినీ ఇండియా, కలిసికట్టుగా నగరాభివృద్ధికి పాటుపడండి! కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ పాలకవర్గానికి సీఎం కేసీఆర్ హితబోధ

Team Latestly

హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయి. మంచి భవిష్యత్ ఉన్నది. నిజమైన విశ్వనగరమిది. బయటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్థిరపడిన అనేక మంది ఉన్నారు. నగరంలో సింధ్ కాలనీ ఉంది. గుజరాతి గల్లీ ఉంది. పార్సీగుట్ట ఉంది. బెంగాలీలున్నారు. మలయాళీలున్నారు. మార్వాడీలున్నాయి. ఖాయస్తులున్నారు. ఇలా విభిన్న ప్రాంతాల వారు, విభిన్న మతాల వారు, విభిన్న సంస్కృతుల వారున్నారు. వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారు....

GHMC Mayor: గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల్ విజయ లక్ష్మీ ఎన్నిక, ఫలించిన టీఆర్ఎస్ వ్యూహం, అవలీలగా మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పీఠాలు కైవసం

Team Latestly

డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ దక్కలేదు. మొత్తం 150 డివిజన్లుండే గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్లో టీఆర్ఎస్ 56 డివిజన్లను కైవసం చేసుకోగా, బిజెపి 48 డివిజన్లను, ఎంఐఎం 44 డివిజన్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు డివిజన్లతో చతికిలపడింది. గురువారం మేయర్ కోసం జరిగిన ఎన్నికల్లో.....

TS's COVID Report: తెలంగాణలో నేడు, రేపు కొనసాగనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో 146 కోవిడ్ కేసులు నమోదు, 1825గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేడు కొనసాగి శుక్రవారంతో ముగియనుంది. రేపటితో రాష్ట్రంలో రెండో విడత వ్యాక్సినేషన్ ముగుస్తుంది. బుధవారం నాటికి కేవలం 37 శాతం ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు....

GHMC Mayor Poll: నేడే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక, ఎవరికీ దక్కని మ్యాజిక్ ఫిగర్- రేసులో మూడు పార్టీలు, టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? కొనసాగుతున్న ఉత్కంఠ

Team Latestly

మేయర్ పదవికి టిఆర్ఎస్ బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మిని ఎంపిక చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ వ్యూహంలో భాగంగా MIM పార్టీ ఓటింగ్ కు దూరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఈ చర్య టిఆర్ఎస్ మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పోస్టులను పొందటానికి సహాయపడుతుంది....

Advertisement

CM KCR Speech Highlights: నేను అబద్దాలు చెబితే టీఆర్‌ఎస్‌ను ఓడించండి, లేదంటే ప్రతిపక్షాలను తరిమికొట్టండి, కృష్ణా-గోదావరి నీటితో నల్లగొండ జిల్లా కాళ్లు కడుగుతాను, హాలియా సభలో ప్రతిపక్షాలపై మండిపడిన కేసీఆర్

Hazarath Reddy

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభ (Haliya nagarjuna sagar) నిర్వహించింది. నల్గొండ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ త‌ర్వాత హాలియాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో (Telangana CM KCR Speech Highlights) ప్ర‌సంగించారు.ఈ సభలో ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ (Telangana Chief Minister KCR) మండిపడ్డారు.

CM KCR Nellikal Inauguration: నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంఖుస్థాపన, నాగార్జునసాగర్ హాలియాలో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ, ప్రసంగించనున్న సీఎం

Hazarath Reddy

నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పర్యటించారు. నెల్లికల్లులో 13 ఎత్తిపోతల పథకాలకు, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన (CM KCR Nellikal Inauguration) చేశారు. ఈ పర్యటనలో భాగంగానే డిగ్రీ కళాశాలకు సంబంధించిన 12 శిలాఫలకాల ఆవిష్కరించారు.

CM KCR Nalgonda Tour: దుబ్బాక దెబ్బతో అలర్ట్, నాగార్జునసాగర్‌ని కైవసం చేసుకోవాలనే వ్యూహంలో టీఆర్ఎస్, నేడు సీఎం కేసీఆర్ నల్గొండ పర్యటన, పలు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు శంఖుస్థాపన

Hazarath Reddy

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ న‌ల్ల‌గొండ జిల్లాలో (CM KCR Nalgonda Tour) ప‌ర్య‌టించ‌నున్నారు. ఉద‌యం 11:45 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో న‌ల్ల‌గొండ‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. మ‌ధ్యాహ్నం 12:30 నందికొండ‌కు చేరుకోనున్నారు. అక్క‌డ్నుంచి 12:40 గంట‌ల‌కు రోడ్డుమార్గాన నెల్లిక‌ల్లుకు వెళ్ల‌నున్నారు. 12:45 గంట‌ల‌కు నెల్లిక‌ల్లులో 13 లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఒకే చోట శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

COVID Status in TS: కోవిడ్ టీకా తీసుకున్న కొన్ని రోజులకే కరోనా పాజిటివ్, తెలంగాణలో మందకోడిగా సాగుతున్న రెండో విడత వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా మరో కోవిడ్ కేసులు నమోదు

Team Latestly

మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో 20 రోజుల కిందట మొదటి డోసు టీకా తీసుకున్న 8 మంది వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో ఇద్దరు వైద్యులు, మిగతా ఆరుగురు సహాయక సిబ్బంది ఉన్నారు. వీరిని ఐసోలేషన్లో ఉంచి చికిత్సనందిస్తున్నట్లు అధికారులు తెలిపారు....

Advertisement
Advertisement