తెలంగాణ

Khammam Suicide Case: ఆర్థిక సమస్యలతో మాజీ సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ భార్య,భర్తలు మృతి, విషమంగా పిల్లల పరిస్థితి, మరో చోట ఇంటికి వస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు

Hazarath Reddy

ఖమ్మంలో రెండు రోజుల క్రితం కుటుంబంతో కలిసి ఆత్మహత్యా యత్నానికి (Khammam Suicide Case) పాల్పడిన భార్య,భర్తలు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియాతండా గ్రామంలో మాజీ సర్పంచ్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి విధితమే.

COVID in TS: తెలంగాణలో 2 లక్షలకు పైగా హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, రాష్ట్రంలో కొత్తగా 101 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1842గా ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అయితే రికవరీలు ఎక్కువగా ఉండటం మరియు వ్యాక్సినేషన్ కూడా అందుబాటులోకి వచ్చేయడంతో ప్రజలు ఇప్పుడు కరోనాను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2 లక్షలకు పైగా టీకాల వినియోగం జరిగింది.....

Telangana CM Change Row: ఎవరూ మాట్లాడొద్దు..మరో పదేళ్లు నేనే సీఎం, తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీ ఎవరూ లేరు, టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో సీఎం కేసీఆర్, 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Hazarath Reddy

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ సీఎం మార్పు (Telangana CM Change Row) ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని, మరో 10 ఏళ్ల వరకు తనను టచ్ చేయలేరని కేసీఆర్ (CM KCR gave clarity) తేల్చి చెప్పారు.

CM KCR Meeting Update: రూ.3 వేల కోట్లతో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు, ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్, రేపు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం భేటీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో ముగిసిన తెలంగాణ సీఎం భేటీ

Hazarath Reddy

తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నది. రాష్ట్ర కమిటీ సభ్యులతోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

Advertisement

Vaccination Drive in TS: తెలంగాణలో ఇప్పటివరకు 1,88,097 మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి, నేటితో ముగియనున్న తొలి విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1964 ఆక్టివ్ కేసులు

Team Latestly

రాష్ట్రంలో 1,76,728 మంది ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది ఉన్నారు, వీరిలో 64 శాతం మంది టీకా వేయించుకున్నారు. ఇక ఈరోజుతో హెల్త్ కేర్ సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయడం ముగుస్తుంది, రేపట్నించి ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు....

TSRTC Update: ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించిన తెలంగాణ సర్కార్, కమిటీ మార్గదర్శకాలను ఆమోదిస్తూ దస్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్

Team Latestly

నూతన మార్గదర్శకాల ప్రకారం, ఉన్నత అధికారులు, ప్రధానంగా డిపో నిర్వాహకులు మరియు ప్రత్యేక అధికారాలు కలిగినన రీజినల్ మేనజర్లు కార్మికులను విచక్షణారహితంగా విధులను తొలగించడానికి వీలుపడదు. అలాగే, కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి మరియు వారి సేవలను గుర్తించడానికి ఆర్టీసీ డైరెక్టర్ నేతృత్వంలోని ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడుతుంది....

SSC Exams Update: ఎస్‌ఎస్‌సి విద్యార్థులకు మరో ఊరట, పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను 6కు తగ్గించిన విద్యాశాఖ, పరీక్ష సమయంతో పాటు ప్రశ్నల ఎంపికలో కూడా పెంచుతూ నిర్ణయం, వివరాలు ఇలా ఉన్నాయి

Team Latestly

తరగతులు జరిగిన ఆధారంగా అన్ని సబ్జెక్టులకు అవసరమైన కోర్ కాన్సెప్ట్స్ కింద ఇచ్చిన సిలబస్ నుంచి ప్రశ్నలను రూపొందించాలని అధికారులను కోరారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఫిజికల్ సైన్సెస్ పార్ట్-ఎ మరియు బయోలాజికల్ సైన్స్ పార్ట్-బి కోసం విడిగా జవాబు పుస్తకాలను జారీ చేయాలని కూడా కోరారు...

TS Health Bulletin: మరో రెండు రోజుల పాటు ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్, ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత టీకాల పంపిణీ, రాష్ట్రంలో ప్రస్తుతం 1985గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రెండో విడతలో పోలీసులు, రెవెన్యూ, పురపాలక మరియు పంచాయితీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. ఫిబ్రవరి 15 వరకు రెండో విడత వ్యాక్సినేషన్ జరగనుంది....

Advertisement

Vikarabad Mystery Disease: వికారాబాద్‌ను తాకిన మిస్టరీ వ్యాధి, భారీ సంఖ్యలో కోళ్లు, కాకులు మృత్యువాత, శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతు చిక్కని జబ్బుతో (Vikarabad Mystery Disease) వందలాది కోళ్లు చనిపోతున్నాయి. ఈ మిస్టరీ వ్యాధి గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తోంది. కోళ్లతోపాటు కాకులు కూడా చనిపోవటంతో బర్డ్‌ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

TS COVID Status: తెలంగాణలో రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీకి ఏర్పాట్లు, తొలి విడత విజయవంతమైందన్న ఆరోగ్య శాఖ, రాష్ట్రంలో కొత్తగా మరో 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Team Latestly

ఇప్పటివరకు హెల్త్ కేర్ సిబ్బందికి టీకాల పంపిణీ చేశారు. టీకాలు వేసుకోని వారికి అవగాహన కల్పిస్తూ టీకాలు వేయించి తొలిదశ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 నుంచి రెండో విడత వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు....

MLA Challa Dharma Reddy: మళ్లీ వివాదంలో చిక్కుకున్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, ఆ కులం ఆఫీసర్లకు అక్షరం ముక్కరాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు, క్షమాపణలు చెబుతూ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని వెల్లడి

Hazarath Reddy

ఇప్పటికే వివాదంలో నలిగిపోతున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. రాముడి పేరిట బీజేపీ నేతలు దొంగ బుక్కులు తయారుచేసి చందాలు వసూలు చేస్తున్నారని చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారక ముందే మరోసారి ఆయన (MLA Challa Dharma Reddy) వెనుకబడిన కులాలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి

TS's Health Bulletin: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి, కొత్తగా మరో 152 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,022గా ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

Advertisement

Uttam Kumar Reddy on Budget 2021: బడ్జెట్‌లో తెలంగాణకు ఒరిగిందేమి లేదు, ఎన్నికలున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది, ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ తాత్కాలిక చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy on Budget 2021) అన్నారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు.

Union Budget 2021: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చేయి, బడ్జెట్లో కనపడని తెలుగు రాష్ట్రాల మెట్రో ఊసు, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసిన నిర్మలమ్మ బడ్జెట్

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్-2021లో మెట్రో రైలు కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేకుండా పోయింది. హైదరాబాద్‌లో మెట్రో అభివృద్ధికి గానీ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మెట్రో కేటాయింపులకు సంబంధించి కానీ ఎక్కడా (Telugu States Metros) పేర్కొనలేదు. కేవలం కేరళ, బెంగుళూర్, చెన్నై, నాగ్‌పూర్ మెట్రోల అభివృద్ధికి, రెండో దశ కేటాయింపులు జరిగాయి.

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 118 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ఇప్పటికీ 2 వేలకు పైగా కోవిడ్ ఆక్టివ్ కేసులు, కొనసాగుతున్న వ్యాక్సినేషన్, టీకాలతో ఎలాంటి ప్రమాదం లేదని పునరుద్ఘాటన

Team Latestly

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మాత్రం ఇంకా ఆగడం లేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు 17,686 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 118 మందికి పాజిటివ్ అని తేలింది.....

Telangana Schools Reopen: తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం, ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి ప్రత్యక్ష బోధన, తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను స్కూళ్లకు అనుమతి

Hazarath Reddy

తెలంగాణలో దాదాపు పది నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ సడలింపులతో నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన (Telangana Schools Reopen) ప్రారంభం కానుంది.

Advertisement

BJP Activists Attack on TRS MLA House: హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత, టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరిన బీజేపీ నేతలు, వివాదాస్పదమైన ఎమ్మెల్యే అయోధ్య రామాలయం వ్యాఖ్యలు

Hazarath Reddy

అయోధ్య రాముడి పవిత్రతను బీజేపీ అపవిత్రం చేస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. బీజేపీ నేతలు రావు పద్మారెడ్డి, శ్రీధర్‌తో పాటు 56 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు

Telangana Covid Vaccination: తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత మరొకరు మృతి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ఆరోగ్యం క్షీణించిందని బంధువులు ఆరోపణ, ప్రభుత్వం తరఫున ఇంకా రాని అధికారిక ప్రకటన

Hazarath Reddy

కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో (Telangana Covid Vaccination) కొన్ని విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సిన్ వల్ల చనిపోయారని ఆరోపణలు రాగా, తాజాగా మరో అంగన్‌వాడీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Covid Updates in India: జూన్‌లో మరో వ్యాక్సిన్, కోవోవ్యాక్స్‌ టీకాను తీసుకువస్తామని తెలిపిన సీరం, దేశంలో తాజాగా 13,052 మందికి కరోనా నిర్ధారణ, తెలంగాణలో కొత్తగా 163 కోవిడ్ కేసులు

Hazarath Reddy

దేశంలో గత 24 గంటల్లో 13,052 మందికి కరోనా నిర్ధారణ (Covid Updates in India) అయింది. అదే స‌మ‌యంలో 13,965 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 127 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,274 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా (Coronavirus) నుంచి ఇప్పటివరకు 1,04,23,125 మంది కోలుకున్నారు.

TS Weather Forecast: తెలంగాణలో తిరిగొచ్చిన శీతాకాలం, సాధారణం కంటే పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలో మళ్ళీ పెరిగిన చలి తీవ్రత, కారణాన్ని వివరించిన వాతావరణ శాఖ

Team Latestly

రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలలో కనీస ఉష్ణోగ్రతలు 3.1 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ జిల్లా, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ ఆ ప్రదేశాలలో సింగిల్ డిజిట్స్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.....

Advertisement
Advertisement