తాజా వార్తలు

Andhra Pradesh: ఈ రోజు జరిగే కాన్ఫరెన్స్ చరిత్ర తిరగరాయబోతోంది, జిల్లా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని పిలుపు

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం (Collectors Meeting) అయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం (Kutami Govt.,) అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి భేటీ ఇదే కావడం గమనార్హం.

Telangana Police: శభాష్ ములుగు జిల్లా పోలీస్, చనిపోయాడనుకున్న వ్యక్తికి సీపీఆర్ , కానిస్టేబుళ్లను అభినందించిన ఎస్పీ...వీడియో

Arun Charagonda

ములుగు జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గోడ మీద నుండి పడి స్పృహ కోల్పోయాడు. చనిపోయాడని స్థానికులు వదిలేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు. సమయస్ఫూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ ను అభినందించారు జిల్లా ఎస్పీ.

Maharashtra: వీడియో ఇదిగో.. మహారాష్ట్రలో దారుణం, మ్యాన్‌హోల్‌లో పడి నాలుగేళ్ళ బాలుడి మృతి, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

మహారాష్ట్రలో దారుణం జరిగింది. అహ్మద్ నగర్ జిల్లాలో సంవత్సరాల బాలుడు ప్రమాద వశాత్తూ మ్యాన్ హోల్‌లో పడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు కాగా స్థానికంగా విషాదాన్ని నింపింది.

Karnataka Horror: రామకృష్ణ ఆశ్రమంలో మూడవ తరగతి విద్యార్థిపై దారుణం, పెన్ను దొంగిలించాడంటూ బ్యాట్‌తో కళ్లు వాచిపోయేలా కొట్టిన నిర్వాహకులు

Hazarath Reddy

కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెన్ను దొంగిలించాడని ఆరోపిస్తూ మూడో తరగతి విద్యార్థిపై ఆశ్రమం నిర్వాహకులు అమానుషంగా ప్రవర్తించారు. కనికరం లేకుండా కర్రతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, మూడు రోజులపాటు గదిలో బంధించారు.

Advertisement

Accident Caught on Camera: వీడియో ఇదిగో, గంటకు 100 కి.మీ వేగంతో మైనర్ కారు డ్రైవింగ్, తల్లికూతుళ్లను ఢీకొట్టడంతో ఎగిరి అవతలపడి మృతి

Hazarath Reddy

కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మైనర్ నడుపుతున్న కారు అదుపు తప్పి స్కూటర్‌ను ఢీకొనడంతో తల్లి చనిపోగా, ఆమె 12 ఏళ్ల కుమార్తె తీవ్రంగా గాయపడింది. మహిళ తన కుమార్తెతో కలిసి క్లినిక్ నుండి తిరిగి వస్తుండగా, కారు, గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ, వారిని ఢీకొట్టింది, బాధితులిద్దరినీ సుమారు 30 అడుగుల ఎత్తులో పడేసింది.

Bengaluru Horror: దారుణం, మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళపై అత్యాచారయత్నం, బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్

Hazarath Reddy

ఉదయం 5 గంటల సమయంలో మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. వీడియోలో బంధించబడిన ఈ సంఘటన ఇంటి వెలుపల నిలబడి ఉన్న మహిళను చూపిస్తుంది, ఒక వ్యక్తి తన వెనుక నుండి ఆమె వద్దకు వచ్చాడు.

Delhi: ఢిల్లీలో వ్యభిచార గృహాలపై దాడులు, పోలీసుల రైడ్‌లో గోల్డ్ మెడలిస్ట్ క్రీడాకారిణి, ఇద్దరు మైనర్ బాలికలు, నిందితులపై పోక్సో యాక్ట్

Arun Charagonda

ఢిల్లీలో ఘరానా వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. ఢిల్లీ పోలీసులు కమ్లా మార్కెట్‌లోని జీబీ రోడ్డు ప్రాంతంలోని ఓ వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించగా ఇందులో ఓ కబడ్డీ క్రీడాకారిణి, గోల్డ్ మెడల్ విజేత సహా ఇద్దరు మైనర్ బాలికలను ఆదివారం రక్షించారు. మైనర్ బాలికల వయస్సు 17 సంవత్సరాలు కాగా వీరిని నెలల తరబడిగా బంధించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు

Article 370 Abrogation 5th Anniversary: ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తి, బీజేపీ ఏకాత్మ మహోత్సవ్‌ ర్యాలీ,జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్‌, అమర్‌నాథ్ యాత్రను నిలిపివేత

Hazarath Reddy

జమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూరయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్‌’ ర్యాలీని నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్‌ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రెడీ అయింది

Advertisement

Nine kanwariyas Electrocuted to Death: వీడియో ఇదిగో, కన్వర్ యాత్రలో డీజే వాహనానికి హైటెన్షన్‌ వైర్‌ 9 మంది మృతి

Hazarath Reddy

ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద కన్వర్‌ యాత్రికులు (Kanwariyas) ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్‌ వైర్‌ తగిలడంతో కరెంట్ షాక్ తో తొమ్మిది మంది మరణించారు.

Bihar: కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం, డీజే వాహనానికి హైటెన్షన్‌ వైర్‌ 9 మంది మృతి, మరో ఆరుగురుకి తీవ్ర గాయాలు

Hazarath Reddy

బీహార్‌లోని హాజీపూర్‌లో కన్వర్ యాత్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి హాజీపూర్‌ సమీపంలోని సుల్తాన్‌పూర్‌ వద్ద కన్వర్‌ యాత్రికులు (Kanwariyas) ప్రయాణిస్తున్న డీజే వాహనానికి హైటెన్షన్‌ వైర్‌ తగిలడంతో కరెంట్ షాక్ తో తొమ్మిది మంది మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో ఒక మైనర్ ఉన్నారు.

Wayanad landslide: వయనాడ్ విలయంలో 387కు పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా 180 మంది మిస్సింగ్, చలియార్ నదిలో కొట్టుకువస్తున్న మృతదేహాలు

Hazarath Reddy

కేరళలోని వయనాడ్‌ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 387కు ( Death Toll Touches 387) చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంకా 180 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. వారి జాడ కోసం సహయక బృందాలు వెతుకుతున్నాయి.

Boy Missing In Hyd:తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు మిస్సయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని తీసుకెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Advertisement

CM Revanth Reddy: ప్రపంచంతోనే పోటీ పడుతున్న తెలంగాణ, న్యూ జెర్సీలో భారీ కార్ల ర్యాలీ, పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టూర్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. పది రోజుల పర్యటనలో భాగంగా అమెరికాకు చేరుకున్న సీఎం రేవంత్‌కు ఘన స్వాగతం పలకగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. న్యూజెర్సీలో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కారు ర్యాలీలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana Shocker: మెదక్‌లో దారుణం, వివాహేతర సంబంధం దారుణ హత్య, గొడ్డలితో నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు

Arun Charagonda

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దా పూర్ గ్రామంలో దారుణ హత్య జరిగింది. ముస్లాపూర్‌కు చెందిన చిత్తరి బేతయ్య (40 )ను గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Prasanth Kishore: పదో తరగతి పాస్‌ అయితే బీహార్ సీఎం, సీఎం నితీశ్‌ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్

Arun Charagonda

యువత రాజకీయాల్లో రావాలని పిలుపునిచ్చారు పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఇటీవలే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన ప్రశాంత్, జన్ సురాజ్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

Hyundai Grand I10 Nios Hy Cng Duo: హుంద్యాయ్ నుంచి మార్కెట్లోకి మ‌రో సీఎన్జీ వాహ‌నం, మ‌ద్య‌త‌ర‌గగతి ప్ర‌జ‌ల‌కు అందుబాటు ధ‌ర‌లోకి తెచ్చిన కంపెనీ

VNS

గ్రాండ్ ఐ10 నియోస్ హెచ్‌వై-సీఎన్జీ డ్యూ (Hyundai Grand i10 Nios Hy-CNG Duo) కారు 1.2 లీటర్ల బై-ఫ్యూయల్ (Bi-Fuel) ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 69 హెచ్పీ విద్యుత్, 95.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.

Advertisement

Novak Djokovic Wins Olympic Gold: ఒలింపిక్స్ లో క‌ల సాకారం చేసుకున్న జొకోవిచ్, తొలిసారి గోల్డ్ మెడ‌ల్ సాధించిన జొకోవిచ్

VNS

మాజీ వ‌రల్డ్ నంబ‌ర్ 1 నొవాక్ జ‌కోవిచ్ (Novak Djokovic) త‌న‌ క‌ల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడ‌ల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు ప‌త‌కాన్ని Gold) కొల్ల‌గొట్టాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చ‌రిత్ర సృష్టించిన జ‌కో ఎట్ట‌కేల‌కు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడ‌ల్ ప‌ట్టేశాడు.

Filmfare South Awards: ఫిల్మ్ ఫేర్ లో తెలుగు సినిమాల‌కు అవార్డుల పంట‌, బెస్ట్ మూవీగా బ‌లగం, బెస్ట్ యాక్ట‌ర్ గా నాని, పూర్తి అవార్డుల వివ‌రాలిగో

VNS

తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు (Filmfare Awards South) వరించాయి. ఉత్తమ చిత్రంగా బలగం, దసరాలో (Dasar Movie) నటనకు గాను బెస్ట్‌ హీరోగా నాని (Nani), ఉత్తమ దర్శకుడిగా వేణు యేల్డండి (Venu Yeldandi) నిలిచారు

Double I smart Trailer: డ‌బుల్ ఇస్మార్ట్ లో డబుల్ ఎన‌ర్జీ చూపించిన రామ్, యాక్ష‌న్ తో పాటూ కామెడీలోనూ రామ్ టైమింగే వేరు..

VNS

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ (Double I smart Teaser), పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై (I smart) ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. రామ్​ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు.

Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మ‌రోసారి ర‌క్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్

VNS

బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు.

Advertisement
Advertisement