India
Dhanteras 2025: ధనత్రయోదశి ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలి? శుభ ముహూర్తం, పూజా విధానం, ఆ రోజు కచ్చితంగా బంగారం, వెండి కొనాలా.. పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyఈ ఏడాది 2025లో ధన త్రయోదశి (Dhantrayodashi) అక్టోబర్ 18 శనివారం జరగనుంది. ఇది ప్రతీ సంవత్సరం దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచించే అత్యంత శుభప్రదమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా దీపావళి 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. లక్ష్మీపూజ, ధన సంపద, ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తుంది.
PM Modi Andhra Pradesh Tour: అక్టోబర్ 16న ప్రధాని మోదీ ఏపీ పర్యటన, రూ. 13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని, శ్రీశైలం పర్యటన పూర్తి వివరాలు ఇవే..
Team Latestlyఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రధాని శ్రీశైలం పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళవారం పరిశీలించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు
Tenali Horror: తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..
Team Latestlyఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan Bus Fire: రాజస్థాన్లో ఘోర బస్సు ప్రమాదం, నేషనల్ హైవేపై వెళ్తుండగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, 15 మంది సజీవ దహనం అయినట్లుగా వార్తలు
Team Latestlyరాజస్థాన్ (Rajasthan)లోని జైసల్మేర్ (Jaisalmer)లో మంగళవారం నాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ సమీపంలో కదుపుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో డ్రైవరు అప్రమత్తమై వెంటనే బస్సును నిలిపివేశారు.
Google AI Hub in Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ సెంటర్, ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ కీలక ప్రకటన, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం ఏపీలో..
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 15 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడిగా ఖరారు చేసింది.
Nagula Chavithi 2025: నాగుల చవితి ఎప్పుడు? స్త్రీలు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు? పూజా సమయం, ఉపవాసం, నైవేద్యం, మంత్రాలు, పూర్తి సమాచారం ఇదిగో..
Team Latestlyనాగుల చవితి (Nagula Chavithi) హిందూ సంప్రదాయంలో పాములను పూజించే పవిత్రమైన పండుగ. చంద్ర మాసంలో చతుర్థి (నాలుగవ రోజు) రోజున జరుపుకునే ఈ పండుగను నాగ పూజా దినంగా పరిగణిస్తారు. ఈ రోజున భక్తులు నాగ దేవతలను ఆరాధించి, కుటుంబ శ్రేయస్సు, సంతానాభివృద్ధి మరియు ఆరోగ్యం కోసం ప్రార్థిస్తారు.
Andhra Pradesh: కడపలో ఘోర విషాదం, గూడ్స్ రైలు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య, మరణ వార్త విని నానమ్మ గుండెపోటుతో మృతి
Team Latestlyఏపీలోని కడప జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం మొత్తం గూడ్స్ రైలు(Goods Train) కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. కడప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నంబర్ ట్రాక్పై ఓ కుటుంబం గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చోగా.. రైలు ఢీకొట్టడంతో అందరూ అక్కడిక్కడే మృతిచెందారు. మృతదేహాలు ట్రాక్పై చెల్లాచెదురుగా పడ్డాయి.
Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, బైకుపై వెళుతూ రైలు పట్టాలు క్రాస్ చేయబోయిన ఓ వ్యక్తి, రైలు దూసుకురావడంతో దాని కింద పడి నుజ్జు నుజ్జు, నోయిడాలో ఘటన
Team Latestlyఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైక్పై వెళ్తున్న వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించి అది బెడిసికొట్టడంతో రైలు కింద పడి మృతి చెందాడు.
Girl Slaps Boy: వైరల్ వీడియో ఇదిగో, అబ్బాయిని లాగి చెంపమీద ఒక దెబ్బ పీకిన అమ్మాయి, బిత్తరపోయిన చూస్తుండిపోయిన అబ్బాయి.. ఆ తర్వాత ఏమైందంటే..
Team Latestlyభారతదేశంలో టీం ఇండియా క్రికెట్ మ్యాచ్లు ఎల్లప్పుడూ ఆసక్తికర సంఘటనలతో వార్తల్లో నిలుస్తుంటాయి., చాలా సార్లు, ప్రసారకుల కెమెరా గ్యాలరీలో చిరస్మరణీయ క్షణాలను రికార్డు అవుతూ ఉంటాయి. తాజాగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇండియా vs వెస్టిండీస్ రెండవ టెస్ట్ డే 4లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని సరదాగా చెంపదెబ్బ కొట్టడం కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Late Period Warning Signs: మీకు ఇంకా పీరియడ్స్ ఎందుకు రాలేదని బెంగగా ఉందా.. ఋతుస్రావం రాకపోవడానికి కారణాలు, పరిష్కారాలు మార్గాలు ఓ సారి తెలుసుకోండి
Team Latestlyఋతుస్రావం అనేది ప్రతి స్త్రీ జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అయితే కొందరు మహిళలకు ఈ సమయంలో తీవ్ర పొత్తికడుపు నొప్పులు, వెన్ను, కాళ్ల నొప్పులు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా, ఋతుచక్రం 21–35 రోజుల వ్యవధిలో జరుగుతుంది. ఇది గర్భాశయ లైనింగ్ హార్మోన్ల సమతుల్యతను ప్రతిబింబిస్తుంది.
Life Skills for Kids: తల్లిదండ్రులు పిల్లలకు నేర్పవలసిన ఆత్మవిశ్వాస మంత్రాలు ఇవే, వారి చెంతన ఈ మంత్రాలు ఉంటే జీవితంలో ఎప్పుడూ వెనుకడగు వేయరు
Team Latestlyచిన్న వయసులోనే పిల్లలకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్భయత్వం వంటి లక్షణాలను నేర్పించడం చాలా ముఖ్యము. ఈ గుణాలను వారిలో పెంపొందించడం ద్వారా, వారు భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. అలాగే వ్యక్తిగత, సామాజిక, విద్యా రంగాల్లో విజయవంతమవుతారు.
Obesity in Children: పిల్లల్లో ఊబకాయంపై షాకింగ్ రిపోర్ట్.. మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తున్న అధిక బరువు, తల్లిదండ్రులు మేలుకోకుంటే అంతే సంగతులు అంటున్న వైద్యులు
Team Latestlyఈ రోజుల్లో పిల్లల్లో ఊబకాయం లేదా అధిక బరువు సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నారులు సహజంగా ఎక్కువ తినడానికి అలవాటు పడుతున్నారు. అయితే జంక్ ఫుడ్, వేగం ఆహారాలు, బేకరీ స్నాక్స్, తీపి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. UNICEF నివేదిక ప్రకారం.. ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు అధిక బరువుతో ఉన్నారు.
Spiritual Benefits of Meditation: మీరు ఒత్తిడిలో ఉన్నారా.. చిరాకుతో బాధపడుతున్నారా.. అయితే ధ్యానం ద్వారా పొందే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక లాభాలు తెలుసుకోండి
Team Latestlyఈ వేగవంతమైన, ఒత్తిడితో నిండిన జీవనశైలి కాలంలో ధ్యానం అనేది తప్పనిసరి సాధనగా మారింది. మనం రోజువారీ సమస్యలతో, పని ఒత్తిడితో, వ్యక్తిగత, సామాజిక బాధలతో తారసపడుతున్నప్పుడు, మన మనసు, శరీరం, ఆత్మకు శాంతి అవసరం అవుతుంది. కాబట్టి ధ్యానం అనేది ఈ అవసరాన్ని తీర్చే అత్యంత శక్తివంతమైన మార్గంగా చెప్పుకోవచ్చు.
Cow Capture Gone Wrong in Vadodara: వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు
Team Latestlyగుజరాత్ వడోదరలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ కార్మికుడు మహేష్ పటేల్ ను ఒక ఆవు సుమారు అర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్ళింది. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Madhya Pradesh Horror: మృతదేహాన్ని కూడా వదలని కామాంధుడు, మార్చురీలోనే మహిళ మృతదేహంపై లైంగిక దాడి, నిందితుడు అరెస్ట్
Team Latestlyమధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్ట్మార్టం కోసం ఉంచిన మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి లైంగికంగా వేధించిన దృశ్యం సీసీటీవీలో రికార్డు అయింది. ఈ ఘటన ఏప్రిల్ 18, 2024న చోటుచేసుకుంది. అయితే, సీసీటీవీ ఫుటేజ్ అక్టోబర్ 7, 2025న సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల మాత్రమే ప్రజలకు తెలిసింది.
Telangana Local Body Elections: తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు తీర్పు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు
Team Latestlyతెలంగాణ హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ, అలాగే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది.
Kanpur Scooty Blast: సిసిటివి వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా షాపులో భారీ పేలుడు, 8 మందికి తీవ్ర గాయాలు
Team Latestlyకాన్పూర్లోని మూల్గంజ్ ప్రాంతంలోని మిశ్రీ బజార్లోని ఒక దుకాణంలో బుధవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది గాయపడ్డారు. సాయంత్రం 6:50 గంటలకు దుకాణం వెలుపల పేర్చిన కార్టన్ల కింద నుండి పేలుడు సంభవించినట్లు సిసిటివి ఫుటేజ్లో కనిపిస్తోంది.
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఆస్పత్రికి వెళ్లేలోపే తిరిగిరాని లోకాలకు..
Team Latestlyఅక్టోబర్ 6, సోమవారం ఉదయం తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్లో ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) గుండెపోటుతో మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. తక్షణ సహాయం అందించినా ఆ అధికారిని తిరిగి బ్రతికించలేకపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన CCTV వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gaza Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక ముందడుగు, మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించిన రెండు దేశాలు, నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ప్రశంసించిన భారత ప్రధాని మోదీ
Team Latestlyగత రెండు ఏళ్ల నుంచి సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు పడింది. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) రెండు దేశాలె మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.