Lifestyle

Rottela Panduga 2020 Cancelled: రొట్టెల పండుగ రద్దు, 20 మందితో గంధ మహోత్సవం, నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ, కరోనావైరస్ నేపథ్యంలో రద్దు చేస్తున్నామని తెలిపిన కలెక్టర్ చక్రధర్ బాబు

Hazarath Reddy

ఏటా ఏపీలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగే రొట్టెల పండుగ ఈ సారి రద్దైంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రొట్టెల పండుగను రద్దు (Rottela Panduga 2020 Cancelled) చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక రొట్టెల పండుగలో కీలక ఘట్టమైన గంధ మహోత్సవంను కూడా 20 మందితో జరపాలని తెలిపారు. కాగా మొహర్రం సందర్భంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు సాక్షిగా ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ (Rottela Panduga) జరిగేది. ఇక్కడ రొట్టె పడితే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.

Coronavirus (COVID-19): బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్

Hazarath Reddy

కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఇది (coronavirus disease (COVID-19) మరింతగా భయపెడుతోంది. దీనిపై శాస్ర్తవేత్తలు రోజుకొక కొత్త ఆసక్తిర విషయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా మరొక వార్త బయటకు వచ్చింది. కోవిడ్‌–19 (Coronavirus (COVID-19) బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు (Obesity) 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

BP Drugs Cuts Covid Death Risk: కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్‌ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు

Hazarath Reddy

కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు అయితే రాలేదు. కాని ఎవరికి వారే పలు రకాల సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడిన ‘హై బ్లడ్‌ ప్రెషర్‌’ రోగులకు బ్లడ్‌ ప్రెషర్‌ నివారణ మందులను (Blood pressure drugs) ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని (BP Drugs Cuts Covid Death Risk) లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది.

Ganesh Chaturthi 2020: వినాయక చవితి..ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ప్రత్యేకతలేంటీ? శివుడు వినాయకునికి చెప్పిన మంత్రం ఏమిటి? వినాయక మహత్యం గురించి ఆసక్తిర కథనం మీకోసం

Hazarath Reddy

వినాయక చవితి భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుడు కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా (Ganesh Chaturthi 2020) జరుపుకుంటారు. ఈ చరిత్ర గురించి ఓ సారి తెలుసుకుందాం.. కైలాసములో పార్వతీ దేవి శివుని (Lord Shiva) రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని (Ganesha) రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదముగావించి లోపలికి వెళ్లాడు.

Advertisement

Ganesh Chaturthi 2020: వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, బహిరంగ వేడుకలు నిషిద్ధం, ఇంట్లోనే జరుపుకోవాలని సర్కారు వినతి

Hazarath Reddy

ఏపీలో వినాయక చవితి వేడుకలపై వైయస్ జగన్ సర్కారు ( YS Jagan Govt) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి పరిస్ధితులపై సాధారణ పరిపాలనశాఖ, పోలీస్‌, వైద్యశాఖతో లోతుగా సమీక్ష నిర్వహించిన తర్వాత బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వరాదని నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం (Govt issues guidelines) ఈ ఏడాది రోడ్లపై వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఆంక్షలు ఉల్లంఘించి పందిళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Cancer Cases in India: దేశంలో నిశ్శబ్దంగా క్యాన్సర్ విజృంభణ, 2025 నాటికి క్యాన్సర్ కేసులు 15.7 ల‌క్ష‌ల‌కు పెరిగే అవ‌కాశం, ఐసీఎంఆర్‌ పరిశోధనలో వెల్లడి, పొగాకు వాడకమే కారణం

Hazarath Reddy

దేశంలో కరోనా మాటును పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. కరోనా కేసులతో పాటు ఇతర వైరల్ వ్యాధులు దేశ ప్రజలకు నిదర లేకుండా చేస్తోంటో, తాజాగా క్యాన్సర్ (Cancer Cases in India) గురించి ఆందోళనకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగ‌ళూరుకు చెందిన నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రీసెర్చ్‌, భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా సంచలన నివేదిక‌ను విడుద‌ల చేశాయి.

Happy Independence Day 2020 Greetings: భారత స్వాతంత్ర్య దినోత్సవం, అందరికీ 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు, WhatsApp Status, Quotes, Facebook Captions మీకోసం..

Hazarath Reddy

ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్ఛగా ఊపిరి తీసుకోగలుగుతున్నాం. దేశాన్ని రాబందుల కబంధ హస్తాల నుండి రక్షించుకోవడానికి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కుల మత బేధాలు లేకుండా ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్నదమ్ముళ్ల లాగా కలిసి జీవిస్తున్నాం. ఈ రోజు భారతీయలకు నిజంగా గొప్ప పండుగ. భారత స్వాతంత్ర్య దినోత్సవం (Happy Independence Day 2020) రోజున అందరూ జాతీయ జెండా వందనం చేసి బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు (74th Independence Day 2020 Greetings) చెప్పుకుంటారు.

Indian Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం, మీకు తెలియని ఆసక్తికర విషయాలు, జాతీయ జెండా గురించి కొన్ని నిజాలు మీకోసం..

Hazarath Reddy

1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ బానిస‌త్వం నుంచి విముక్తి పొందింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగస్టు 15ను భారత స్వాతంత్ర్య దినోత్సవంగా (Indian Independence Day), జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి eswn పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ( jawaharlal nehru) తొలిసారి ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. 74వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Mdi జెండాను ఎగరవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Advertisement

Krishna Janmashtami 2020: కృష్ణాష్టమి పండుగ గొప్పతనం ఏమిటి ? కృష్ణ జన్మాష్టమి రోజున ఏం చేయాలి ? శ్రీ కృష్ణ లీలలు గురించి ఎవరికైనా తెలుసా ? గోకులాష్టమి పండుగపై పూర్తి సమాచారం మీకోసం

Hazarath Reddy

సృష్టి స్థితి కారుడైన శ్రీకృష్ణుడి జన్మ దినాన్ని ''కృష్ణాష్టమి''గా వేడుక చేసుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమినే... గోకులాష్టమి (Gokulashtami 2020) అని కూడా అంటారు. భారతదేశం మొత్తం ఈ ప్రత్యేక పండుగను జరుపుకుంటుంది. హిందూ కేలండర్ ప్రకారం భాద్రపద మాసంలో కృష్ణ పక్షంలో అష్టమి రోజున ఈ పండుగ (Krishna Janmashtami) జరుపుకుంటారు. గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం... కృష్ణాష్టమిని (Krishna Janmashtami 2020) ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ భగవానుణ్ని చెప్పుకుంటారు. దృక్‌పంచాంగం ప్రకారం... ఈ సంవత్సరం శ్రీకృష్ణుడి 5247వ జన్మదినాన్ని (Happy Krishna Janmashtami) జరుపుకుంటున్నాం. అంటే 5వేల ఏళ్ల కిందట శ్రీకృష్ణుడు జన్మించినట్లు ఈ పంచాంగం చెబుతోంది.

COVID-19 Symptoms: కరోనా మిస్టరీ..లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే కారణమా? కోవిడ్ వైరస్ మోతాదులో తేడానా ? అంతా మిస్టరీయే..

Hazarath Reddy

కరోనావైరస్..ఈ ఏడాది ఈ పదం ఒక కల్లోలాన్నే రేపింది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు కకావికలమయ్యాయి. వ్యాక్సిన్ కోసం అన్ని దేశాలు చకోర పక్షులా ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ వైరస్ లక్షణాలు రాను రాను కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. చాలామందిలో ఈ వైరస్ లక్షణాలు (COVID-19 Symptoms) లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. మరికొంత మందిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయట. దాదాపు 40 శాతం కరోనావైరస్ రోగులకు (coronavirus infections) కోవిడ్ లక్షణాలు కనిపించడం లేదని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అంటు వ్యాధి వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ పేర్కొంది.

COVID19 Kit: తెలంగాణలో ఇంటి వద్దకే కరోనా కిట్, హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరఫున ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ

Team Latestly

ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సమీప ప్రభుత్వ వైద్యశాల నుంచి ఐసొలేషన్‌ కిట్‌ ను నేరుగా సిబ్బంది ఇంటికెళ్లి అందజేస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నా కూడా బాధితులందరికీ కిట్లను ఇస్తారు...

Unknown Pneumonia Alert: మరో కొత్త వైరస్ బాంబును పేల్చిన చైనా, అంతుచిక్కని వైరస్‌తో న్యుమోనియా సోకి కజకిస్థాన్‌లో వందలాది మంది మృత్యువాత, జాగ్రత్తగా ఉండాలని చైనీయులకు డ్రాగన్ కంట్రీ హెచ్చరిక

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ (unknown pneumonia) విలమతాండవం చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనా సరిహద్దు దేశం కజకిస్థాన్‌లో (Kazakhstan) అంతుపట్టని వ్యాధితో వందలాది మంది మృత్యువాత పడుతున్నందున జాగ్రత్తగా ఉండాలని చైనా ప్రజలను హెచ్చరించింది. గుర్తుతెలియని వైరస్‌ సోకి న్యుమోనియాతో (pneumonia) గత నెలలో దాదాపు 600 మంది మరణించినట్లు వెల్లడించింది. కోవిడ్‌-19 కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ దేశంలో నివసిస్తున్న చైనీయులను (China warns citizens) హెచ్చరించింది.

Advertisement

Happy Father's Day 2020: పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం

Hazarath Reddy

అంతర్జాతీయ పితృ దినోత్సవము (Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని (Happy Father's Day 2020) పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం (Happy Mother's Day) ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది.

Happy Summer 2020: ఇకపై పగలు ఎక్కువ, రాత్రులు తక్కువ, హ్యాపీ సమ్మర్ సీజన్ 2020 వచ్చేసింది, జూన్ 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్న సమ్మర్ సీజన్

Hazarath Reddy

నాలుగు సమశీతోష్ణ సీజన్లలో వేసవి అనేది చాలా హాటెస్ట్ సీజన్ గా (Happy Summer 2020) చెప్పవచ్చు. ఇది (Summer Season) వసంత రుతువు తరువాత అలాగే శరదృతువు ముందు వస్తుంది. ఈ వేసవికాలంలో సూర్యోదయం, సూర్యాస్తమయంలో పలు మార్పులు సంభవిస్తాయి. రోజులు చాలా ఎక్కువ అనిపిస్తాయి. రాత్రులు తక్కువగానూ పగలు ఎక్కువగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్ది పగలు తగ్గిపోయి రాత్రి ఎక్కువ అవుతుంది. కాగా వేసవి ప్రారంభ తేదీ (Happy Summer 2020 Dates) వాతావరణం, సంప్రదాయం మరియు సంస్కృతి ప్రకారం మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు, ఇది దక్షిణ అర్ధగోళంలో శీతాకాలంతో విరుద్ధంగా ఉంటుంది. ఈ సీజ్ జూన్ 21న ప్రారంభమై సెప్టెంబర్ 22 వరకు ఉంటుంది.

How to Clean Sofa: మీరు కూర్చునే సోఫాలో ఎన్నో హానికారక క్రిములకు నిలయం కావొచ్చు! సోఫాల శుభ్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి, సోఫాలను ఈ విధంగా శుభ్రపరుచుకోండి

Team Latestly

రోజంతా ఎక్కువ సేపు గడిపేది, వర్క్ ఫ్రోమ్ హోమ్ చేస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేది, ఇంట్లో చిన్న పిల్లలుంటే ఆడుకునేది ఈ సోఫాలపైనే. ఈ లాక్డౌన్ విధించినప్పట్నించీ చాలా ఇళ్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో సినిమాలను చూస్తూ సోఫాలకే...

Tips to Live With COVID-19: వైరస్‌తో కలిసి ఎలా జీవించాలో పంచ సూత్రాలను విడుదల చేసిన భారత ప్రభుత్వం, ఈ చిట్కాలు పాటిస్తే వైరస్ సోకే ముప్పు నుంచి బయటపడొచ్చు

Team Latestly

జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి దాదాపు వచ్చేయడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ముప్పును తప్పించుకొని ఎలా బ్రతకడం నేర్చుకోవాలో చెబుతూ భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె. విజయ్ రాఘవన్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వం ఐదు చిట్కాలను విడుదల చేసింది....

Advertisement

Dental Procedures: డెంటల్ క్లినిక్స్‌పై కరోనా ప్రభావం, అత్యవసరమైతే తప్ప సాధారణ దంత చికిత్సలకు అనుమతి లేదు, లాక్‌డౌన్ 4లో దంత వైద్యానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

Team Latestly

కరోనావైరస్ వ్యాప్తి ప్రధానంగా నోరు, ముక్కు, కళ్లతో ముడిపడి ఉంటుంది కాబట్టి దంత పరీక్షలు నిర్వహించడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ తదుపరి మార్గదర్శకాలు జారీ చేసేవరకు అన్ని రకాల దంత చికిత్సలను వాయిదా వేయాలని....

Badrinath Temple: మే 15న తెరుచుకోనున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు, పూజారితో సహా 27 మంది మాత్ర‌మే హాజరు, కోవిడ్ 19 పరీక్షలు పూర్తి చేసుకున్న ఆలయ పూజారి

Hazarath Reddy

ఉత్త‌రాఖండ్‌లోని ప‌విత్ర పుణ్య‌క్షేత్రం అయిన బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు మే 15న (Badrinath Temple to Open Portals on May 15) తెరుచుకోనున్నాయి. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 4.30 గంట‌ల‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ఆల‌య ప్ర‌ధాన పూజారితో స‌హా 27 మంది మాత్ర‌మే హాజ‌రుకానున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అనుమ‌తి లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus Outbreak) విస్త‌రణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు ఉత్త‌రాఖండ్ (Uttarakhand) అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Kailash Mansarovar: మానస సరోవరానికి కొత్త మార్గం, ఇకపై వారం రోజుల్లో యాత్ర ముగించుకోవచ్చు, వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కొత్త మార్గాన్ని ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Hazarath Reddy

కైలాస పర్వతంలో కొలువైన మానస సరోవరానికి (Kailash Mansarovar Yatra) అతి త్వరగా చేరుకోవాలనే భక్తుల కల నేరవేరింది. కైలాస మానసరోవర యాత్రలో నవ శకం ప్రారంభమైంది. టిబెట్‌లోని కైలాస మాన‌స‌స‌రోవ‌రానికి చేరుకునేందుకు (Kailash Mansarovar Yatra Travel) ఇవాళ కొత్త మార్గాన్ని ప్రారంభించారు. టిబెట్‌, ఉత్త‌రాఖండ్ స‌రిహ‌ద్ద మార్గంలో లిపులేక్ నుంచి ఈ రూటును వేశారు. కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో కైలాస మానసరోవర యాత్రా సమయం భారీగా తగ్గనుంది.

Vizag Gas Leak: వైజాగ్‌లో లీకైన గ్యాస్ చరిత్ర ఇదే, దీని పేరు స్టెరిన్ గ్యాస్, 48 గంటల పాటు దీని ప్రభావం, ఈ గ్యాస్ పీల్చితే ఆరోగ్యంపై ప్రభావం ఎంత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ..?

Hazarath Reddy

విశాఖఫట్నం గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌. వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ (LG Polymers Industry in Visakhapatnam) నుంచి పీవీసీ(పాలీవినైల్ క్లోరైడ్) గ్యాస్‌ (Styrene Gas Leak in Vizag) లీకైనట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు గ్రేటర్‌ విశాఖపట్టణం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన గుమ్మల ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement