Sports

IPL 2020: యూఎఈలో ఐపీఎల్ 2020! అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో బీసీసీఐ నిర్ణయం, భారత ప్రభుత్వం అనుమతిస్తేనే అడుగు ముందుకు

Team Latestly

ఐపీఎల్ 2020 టోర్నమెంట్ నిర్వహించడం తమ ప్రథమ ప్రాధాన్యత అని ఇప్పటికే బిసిసిఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిసిసిఐ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ 2020 నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నారు. భారతదేశంలో నిర్వహణ సాధ్యం కాకపోతే విదేశాల్లోనైనా నిర్వహించాలని ఆయన దృఢ నిశ్చయం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో కొవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న యూఎఈ

Ganguly In Home Quarantine: సౌరవ్‌ గంగూలీ సోదరునికి కరోనా, హోం ఐసోలేషన్‌కి వెళ్లిన దాదా, బెల్లెవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగూలీ సోదరుడు స్నేహాశీష్‌

Hazarath Reddy

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ స్వీయ నిర్బంధంలోకి (Ganguly In Home Quarantine) వెళ్లాడు. బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సంయుక్త కార్యదర్శి, గంగూలీకి సోదరుడైన స్నేహాశీష్‌ గంగూలీ (Snehasish Ganguly) బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలడంతో దాదా కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితం కానున్నాడు. బెంగాల్‌ మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన స్నేహాశీష్‌ కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు క్యాబ్‌ అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియా తెలిపారు.

Asia Cup 2020 postponed: ఆసియా కప్‌ 2021కి వాయిదా, వచ్చే ఏడాది శ్రీలంకలో నిర్వహించే అవకాశం

Hazarath Reddy

కరోనా కారణంగా ఈ ఏడాది సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ను వచ్చే ఏడాది 2021కు వాయిదా వేస్తున్నట్లు (Asia Cup 2020 postponed) ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ACC) ప్రకటించింది. ఆసియా ఖండంలో కోవిడ్‌–19 (COVID-19) తీవ్రత పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది. ‘అన్ని రకాల పరిస్థితులను అంచనా వేసిన తర్వాత సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను వాయిదా వేయడమే మంచిదని ఏసీసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు భావించింది.

1983 World Cup Memories: అంచనాలు లేకుండానే విశ్వవిజేత, భారత్ తొలి ప్రపంచకప్ సాధించి నేటితో 37 ఏళ్లు, ఈ తీపి గుర్తులపై స్పెషల్ స్టోరీ

Hazarath Reddy

హాకీతో దూసుకుపోతున్న భారత్ ప్రజానీకాన్ని క్రికెట్ బాట పట్టించిన రోజు నేడు. ప్రపంచ యవనికపై ప్రపంచ కప్ ను (1983 Cricket World Cup) అందుకుని నేటికి 37 ఏళ్లు. ఎటువంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత్ మహామహులను మట్టి కరిపించి విశ్వ విజేతగా (1983 World Cup) మారిన రోజు నేడు. ఆర వీర భయంకరులను ఓడించి క్రికెట్‌కు పుట్టినిల్లయిన లార్డ్స్‌లో సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత జట్టు అందించిన మధురస్మృతులు నాలుగు దశాబ్దాలు దాటినా ఇంకా అభిమానుల గుండెల్లో అలాగే ఉన్నాయి.

Advertisement

IPL 2020: విదేశాల్లో ఐపీఎల్ 2020, కరోనా నేపథ్యంలో ఆలోచన చేస్తోన్నబీసీసీఐ, త్వరలో స్పష్టత వచ్చే అవకాశం

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)-2020 నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అనేక దేశాలు లాక్‌డౌన్‌ (Lockdown) సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్‌ (Cricket) కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇంగ్లండ్‌, శ్రీలంక వంటి దేశాలు ఇప్పటికే శిక్షణ శిబిరాలు ప్రారంభించాయి. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ (IPL 2020) ను విదేశాల్లో నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

Shoaib Akhtar on Brett Lee: బ్రెట్ లీకి బ్యాటింగ్ అంటే చచ్చేంత భయం, తను చాలా నిజాయితీగా ఉండేవారు. బ్రెట్‌లీ వీడియోని షేర్ చేసి అనుభవాలు పంచుకున్న షోయ‌బ్ అక్త‌ర్

Hazarath Reddy

క్రికెట్ మీద అవగాహన ఉన్నవారికి బ్రెట్ లీ, షోయ‌బ్ అక్త‌ర్ (Shoaib Akhtar and Brett Lee)పేర్లను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారి వారి జనరేషన్లలో ఇద్దరూ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్లను హడలెత్తించారు. గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు విసిరే ప్ర‌త్యేక‌త వీరికి మాత్ర‌మే ఉండేది. అయితే బ్యాటింగ్ విషయం వచ్చేసరికి ఇద్దరికీ వణుకుపుట్టేది. ఈ విషయాలను పాక్ మాజీ పేసర్ షోయ‌బ్ అక్త‌ర్ చెప్పుకొచ్చారు.

IPL 2020: కరోనావైరస్ ఔట్ స్వింగర్.. ఐపీఎల్ 2020 క్లీన్ బౌల్డ్. టోర్నమెంట్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Team Latestly

ఐపీఎల్-2020 టోర్నమెంట్ గనక రద్దయితే బీసీసీఐ సుమారు రూ.3800 కోట్లు నష్టపోనుందని అంచనా. ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ షెడ్యూల్ చేయబడి ఉంది. ఒకవేళ ఆ టోర్నమెంట్ ను గనక వాయిదా వేస్తే ఆ సమయంలో .....

IPL 2020 Update: కరోనావైరస్ ప్రభావం.. ఐపీఎల్ వాయిదా! మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ

Vikas Manda

అందరూ అనుమానిస్తున్నట్లుగానే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ సీజన్ 2020 వాయిదా పడింది. COVID-19 మహమ్మారి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది......

Advertisement

ICC Women's T20 World Cup 2020 Final: తడబడిన ఇండియా, మరోసారి చాంఫియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా, మొత్తం 5 సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు

Hazarath Reddy

ఇండియా తడబడింది. చాంపియన్‌ ఆట తీరుతో ఆస్ట్రేలియా మరోసారి మెరిసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 విజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 85 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహిళా క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అభిమానులు హాజరైన ప్రపంచకప్‌-2020 తుది సమరంలో ఆస్ట్రేలియా జట్టు ఐదోసారి ఛాంపియన్‌గా అవతరించింది.

ICC Women's T20 World Cup: ప్రపంచ కప్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో, ఫైనల్‌కి చేరిన భారత మహిళా జట్టు, వర్షం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ రద్దు, నేడు తేలిపోనున్న భారత్ ఫైనల్ ప్రత్యర్థి

Hazarath Reddy

భారత్ మరో ప్రపంచకప్ సాధించేందుకు అడుగుదూరంలో నిలిచింది. మహిళల టి20 ప్రపంచ కప్‌ ( ICC Women's T20 World Cup) చరిత్రలో భారత జట్టు (India Team) తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ మెగా టోర్నీల్లో ఇప్పటివరకూ మూడు సందర్భాల్లో సెమీస్‌ వరకే పరిమితమైన భారత మహిళలు (India Women's National Cricket Team) ఈసారి మాత్రం తుది పోరుకు అర్హత సాధించారు.

David warner: సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, బాల్ ట్యాంపరింగ్‌లో 9 నెలలు పాటు నిషేధం ఎదుర్కున్న ఆస్ట్రేలియా దిగ్గజం, వార్నర్ నాయక్వంలో 2016లో ఐపీఎల్ ట్రోఫి కైవసం చేసుకున్న హైదరాబాద్

Hazarath Reddy

మండు వేసవిలో, మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 (IPL 20200 సీజన్ ముంగిట సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ (Sunrisers Hyderabad) అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతలను మరోసారి డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు (David warner) అప్పగిస్తున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో గత రెండు సీజన్లలో కెప్టెన్సీ వహించిన కేన్ విలియమ్సన్ స్థానంలో వార్నర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు.

Dog Plays Cricket: కుక్క వికెట్ కీపింగ్ అదుర్స్. ధోని పెంపుడు కుక్కలానే ఉందంటున్న నెటిజన్లు, వైరల్ అవుతోన్న ప్రముఖ నటి సిమి గరేవాల్ ట్విట్టర్ షేర్ వీడియో

Hazarath Reddy

మనుషులు క్రికెట్ (Cricket) ఆడటం చూశాం కాని జంతువులు క్రికెట్ ఆడటం ఎక్కడైనా చూశారా..అయితే ఈ వీడియో చూస్తే నిజమేనని ఒప్పుకుంటారు.ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఓ డాగ్ వికెట్ల వెనక నిలబడి కీపింగ్ చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నటి..టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్ (Simi Garewal) ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు.

Advertisement

Laureus Sports Awards 2020: రెండు దశాబ్దాలైనా ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ, లారస్ స్పోర్టింగ్ మూమెంట్ విజేతగా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్

Vikas Manda

అంతకుముందు 5 సార్లు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, తన కెరియర్ లో ఎన్ని మైలురాళ్లను అధిగమించినా, ప్రపంచకప్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరకు 22 ఏళ్ల తర్వాత తన చిట్టచివరి ప్రపంచ కప్ మ్యాచ్ 2011 లో సచిన్ స్వప్నం నెరవేరింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది....

IPL 2020 Full Schedule: ఎనిమిది జట్లు, 56 మ్యాచ్‌లు, 50 రోజులు, మండు వేసవిలో దుమ్మురేపనున్న ఐపీఎల్ 13వ సీజన్, మార్చి 29న తొలి మ్యాచ్, మే 24న ఫైనల్, పూర్తి వివరాలు కోసం స్టోరీని క్లిక్ చేయండి

Hazarath Reddy

మండు వేసవిలో క్రికెట్ సమరం మొదలు కాబోతోంది. మెగా ఐపీఎల్ 2020 13వ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య మార్చి 29న వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. మొత్తం 8 జట్లు 50 రోజుల పాటు క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాయి.

'Kitna Sukh Gaya Hai Tu': కొడుకు సన్నగా అయ్యాడని కన్నీళ్లు కార్చిన తల్లి, రికార్డుల కన్నా కొడుకు క్షేమమే ముఖ్యమని చాటిచెప్పే తల్లి కథ, యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైపాల్ జీవితపు డైరీలో ఓ పేజీ

Hazarath Reddy

యశస్వి ఇంటికి రాగానే తన బిడ్డను చూసి ‘ఇంత సన్నగైపోయావేందిరా’ (కిత్నా సుఖ్‌ గయా హై తూ!) (Kitna Sukh Gaya Hai Tu) అని ఒళ్లు తడిమి చూసుకుని కన్నీళ్లు కార్చింది. సాధారణంగా టీనేజ్‌ కుర్రాళ్లకు ఇలాంటి ఎమోషన్స్‌ నచ్చవు. తల్లిని కూడా దగ్గరకు రానివ్వరు. దీంతో ఈ కుర్రాడు కూడా ‘‘నువ్వూర్కోమ్మా’’ అన్నాడు. ‘‘అంత మాట అనేశావేంట్రా అబ్బాయ్‌! తల్లి ఎలా ఊరుకుంటుంది’’ అని చుట్టుపక్కల వాళ్లు అన్నారు.

Gowda Faster Than Bolt: ఉసేన్ బోల్ట్ కంటే వేగం మన ఈ మట్టిలో మాణిక్యం, సాంప్రదాయ కంబాల పోటీదారు 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే పూర్తి చేసి రికార్డ్

Vikas Manda

ఈ శ్రీనివాస గౌడ విషయానికి వస్తే, 5వ తరగతిలోనే చదువు ఆపేసిన ఇతడు ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత ఐదారేళ్లుగా కంబాల పోటీల్లో పాల్గొంటూ వస్తున్నాడని, ఓ ఇద్దరి యజమానుల వద్ద పనిచేస్తూ వారికి సంబంధించిన మూడు ఎద్దుల జోడిలకు శ్రీనివాస్ జాకీగా వ్యవహరిస్తున్నాడు.....

Advertisement

India vs New Zealand 3rd ODI: 31 ఏళ్ళ తర్వాత ఇండియాకు ఘోర పరాభవం, కసి తీర్చుకున్న కివీస్, కోహ్లీసేన క్లీన్ స్వీప్‌కు ఘాటుగా రిప్లై, మూడో వన్డేలో న్యూజీలాండ్ విజయంతో వన్డే సీరిస్‌లో టీమిండియా వైట్ వాష్

Hazarath Reddy

మౌంట్ మాంగనుయ్ లో టీమిండియాతో జరిగిన చివరిదైన మూడో వన్డేలో (India vs New Zealand 3rd ODI) ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఓ వన్డే సిరీస్ లో భారత్ (India) ఇంత ఘోరంగా ఓడిపోవడం 31 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. టీం ఇండియా నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్ సునాయాసయంగా చేధించింది. దీనితో టి20 సీరీస్ లో ఎదురైన ఘోర పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది.

U-19 World Cup Final: కప్ గెలిచారు,గేమ్ స్పిరిట్ కోల్పోయారు, తొలిసారి విశ్వ విజేతలైన బంగ్లా బేబీలు, డిఫెండింగ్ చాంఫియయన్ భారత్‌ను వెంటాడిన వర్షం

Hazarath Reddy

ఆటగాళ్ల మధ్య స్పిరిట్ కొరవడింది. ప్లేయర్ల మధ్య కవ్వింపు చర్యలు సాధారణమే అయినప్పటికీ బంగ్లాదేశ్ యువ ప్లేయర్లు ఆస్ట్రేలియా ప్లేయర్లకు పోటినిచ్చేలా తమ కవ్వింపు చేష్టలను ప్రదర్శించారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ పేసర్ హసన్ ఈ విషయంలో మరీ దూకుడు ప్రదర్శించినట్లుగా వీడియోల్లో తెలుస్తోంది.

U-19 World Cup Final: ఎవరు గెలిచినా రికార్డుల మోతే, భారత్ గెలిస్తే 5వ ప్రపంచకప్ మన చేతుల్లో, తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన బంగ్లా, చరిత్ర తిరగ రాసేందుకు అడుగుదూరంలో..

Hazarath Reddy

అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ( U-19 World Cup Final) చేరిన యువ భారత జట్టు (India) ఆదివారం బ్లంగాదేశ్‌తో (Bangladesh) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. 16 యువ జట్లు పాల్గొన్న అండర్‌–19 ప్రపంచ కప్‌ (ICC U19 Cricket World Cup 2020) తుది సమరం మరో కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది.

IND vs NZ 2nd ODI: రెండో వన్డేలో కోహ్లీ సేనకు తప్పని పరాభవం, సీరిస్ కైవసం చేసుకున్న కివీస్, టీ20కి ప్రతీకారం తీర్చుకున్న న్యూజీలాండ్, నామమాత్రంగా మారిన మూడో వన్డే

Hazarath Reddy

ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs NZ 2nd ODI) న్యూజిలాండ్ 22పరుగుల తేడాతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్ (India) కివీస్‌కు (New Zealand) వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్ మూడో వన్డేను నామమాత్రంగా మార్చివేసింది. పరువు కాపాడుకోవడానికి కోహ్లీసేన క్లీన్ స్వీప్ కోసం కివీస్ లు మంగళవారం ఉదయం 7గంటల 30నిమిషాలకు ఓవల్ స్టేడియం వేదికగా మూడో వన్డేలో తలపడనున్నాయి.

Advertisement
Advertisement