ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh: వీడియో ఇదిగో, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని లెక్చ‌ర‌ర్‌ని చిత‌క‌బాదిన త‌ల్లిదండ్రులు, ప్రకాశం జిల్లా నాగలుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ ఇంటర్ కాలేజీలో ఘటన

Advertisement

ఆంధ్ర ప్రదేశ్செய்திகள்

RTC Bus Accident in Roddavalasa: ఏపీలో మరో బస్సు ప్రమాదం వీడియో ఇదిగో, మన్యం జిల్లాలో మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Team Latestly

ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు మీద వెళుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలోని ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ఘాట్ రోడ్డులో బస్సులో మంటలు చెలరేగాయి.

Bapatla Road Accident: వీడియో ఇదిగో, బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ మీద అతివేగంతో వెళ్తూ లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం (Bapatla Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని క్లాక్‌ టవర్‌ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్‌.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్‌ రిజ్వాన్‌ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్‌ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిని తోసేసిన సీఐ, బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమాన్యాన్ని ప్రశ్నించేందుకు వస్తే ఇలా చేస్తారా అని మండిపాటు

Team Latestly

చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ కు తరలించే లోపు మృతి చెందాడు. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

Kasibugga Stampede: కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాట, తొమ్మదిమంది మృతి, మరికొందరికి గాయాలు,  ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు

Team Latestly

శ్రీకాకుళంలో(Srikakulam) జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Advertisement

Andhra Pradesh Formation Day 2025: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ ఏపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

Team Latestly

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం.. నవంబర్ 1 వ తేదీ అంటే ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంగా (Andhra Pradesh Formation Day) జరుపుకుంటున్నాం. 1953 వ నవంబర్ 1న పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు.

Cyclone Montha Update: తీరం దాటిన మొంథా తుఫాను, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుపాను ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. వాతావరణశాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురం వద్ద తుపాను తీరం దాటింది.

Cyclone Montha Live: తీరం వైపు శరవేగంగా దూసుకువస్తోన్న మొంథా తుఫాను, కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన, ఈ రాత్రి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

Team Latestly

గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతున్న ఈ తుపాన్ ప్రస్తుతం కాకినాడకు 190 కిలోమీటర్లు,మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు,విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

Cyclone Montha News Update: మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం, మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం తీరం దాటే అవకాశం, సముద్రం అల్లకల్లోలం..

Team Latestly

నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను తీవ్ర రూపం దాల్చుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం జారీ చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం, ఈ తుఫాను అక్టోబర్ 28 ఉదయానికి ‘తీవ్ర వాయుగుండం’గా (Severe Cyclonic Storm) మారే అవకాశం ఉందని తెలిపింది.

Advertisement

Cyclone Montha: 17కి.మీ వేగంతో తీరం వైపు దూసుకువస్తోన్న మొంథా తుఫాను, ఎగసిపడుతున్న అలలు, రేపు తీరం దాటే అవకాశం, అత్యవసర సాయంపై ఏపీ చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..

Team Latestly

మొంథా తుపాను తీరం వైపు దూసుకువస్తోంది. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో కాకినాడ సముద్ర తీరంలో మీటరు ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. మరోవైపు వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Kurnool Bus Fire Accident: నిద్రలోనే తిరిగిరాని లోకాలకు.. కర్నూల్ బస్సు అగ్ని ప్రమాదంలో ఎన్నో విషాద కథలు, ఒకే కుటుంబంలో నలుగురు మృతి, 20 మంది సజీవదహనం, మరో 21 మందికి గాయాలు

Team Latestly

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్‌9490లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది

YS Jagan on Google Data Center: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌పై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు, వైసీపీ వేసిన విత్తనాన్ని కూటమి ప్రభుత్వం చోరీ చేసిందని మండిపాటు,క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. రాష్ట్రం పరిస్థితి వీక్‌ అంటూ సెటైర్

Team Latestly

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఈ రోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రాబోతోన్న గూగుల్‌ డేటా సెంటర్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ప్రచారంలో వచ్చిన వివిధ రకాల వార్తలను ఆయన ఖండిస్తూ.. ఈ డాటా సెంటర్ నిర్మాణం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేసిన బీజానికి కొనసాగింపు మాత్రమే అని చెప్పారు.

Tuni Sexual Assault Case: మలుపులు తిరుగుతున్న తుని కేసు, నిందితుడు నారాయణరావు ఆత్మహత్య, మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న బంధువులు, అసలేం జరిగింది ?

Team Latestly

కాకినాడ తునిలో బాలికపై అత్యాచారయత్నం కేసు నిందితుడు, టీడీపీ నేత తాటిక నారాయణరావు(62) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్‌ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో.. తుని కోమటిచెరువులో దూకేశాడు. గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో.. పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కానిస్టేబుల్, చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఘటన

Team Latestly

ఏపీలో పెట్రోల్ డబ్బులు అడిగినందుకు పెట్రోల్ బంక్ సిబ్బందిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పెట్రోల్ బంకులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్ చేశాడు. బుధవారం తెల్లవారుజామున బైకుకు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు చెల్లించకుండా,డబ్బులు అడిగిన బంక్ సిబ్బందిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డాడు.

Andhra Pradesh Shocker: కాకినాడలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన కౌన్సిలర్ నారాణయరావు, దేహశుద్ది చేసిన స్థానికులు, వీడియో ఇదిగో..

Team Latestly

కాకినాడ జిల్లా తునిలో ఓ మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం కలకలం రేపింది. దళిత నాయకుడు, కొండవారిపేట కౌన్సిలర్ నారాణయరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు.

Tirumala Rain Alert: తిరుమలలో దంచి కొడుతున్న వర్షం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, వీడియో ఇదిగో..

Team Latestly

తిరుమలలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా తిరుమలకు విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడుగా నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది.

IMD Alert: వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు, అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

Team Latestly

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే వారంలో దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వివరణాత్మక హెచ్చరిక జారీ చేసింది.

Advertisement

Andhra Pradesh: ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్ళమని చెప్పినందుకు బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగిన మహిళ, పోలీస్ స్టేషన్‌లో నా బొమ్మ చూపించు అంటూ ఫైర్

Team Latestly

జగ్గయ్యపేట నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. బస్ ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్లమని డ్రైవర్ సూచించిన తరువాత డ్రైవర్, మరో ప్రయాణికునితో తీవ్రంగా గొడవకు దిగింది. ఈ సంఘటన బస్‌లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల ముందు చోటుచేసుకుంది.

PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.

PM Modi Andhra Pradesh Tour: అక్టోబర్ 16న ప్రధాని మోదీ ఏపీ పర్యటన, రూ. 13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని, శ్రీశైలం పర్యటన పూర్తి వివరాలు ఇవే..

Team Latestly

ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రధాని శ్రీశైలం పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మంగళవారం పరిశీలించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు

Tenali Horror: తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్‌ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..

Team Latestly

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement