ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Formation Day 2025: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ ఏపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

Advertisement

ఆంధ్ర ప్రదేశ్செய்திகள்

IMD Alert: వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు, అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్

Team Latestly

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే వారంలో దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వివరణాత్మక హెచ్చరిక జారీ చేసింది.

Andhra Pradesh: ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్ళమని చెప్పినందుకు బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగిన మహిళ, పోలీస్ స్టేషన్‌లో నా బొమ్మ చూపించు అంటూ ఫైర్

Team Latestly

జగ్గయ్యపేట నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. బస్ ఫుట్‌బోర్డ్ నుండి లోపలికి వెళ్లమని డ్రైవర్ సూచించిన తరువాత డ్రైవర్, మరో ప్రయాణికునితో తీవ్రంగా గొడవకు దిగింది. ఈ సంఘటన బస్‌లో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల ముందు చోటుచేసుకుంది.

PM Modi Srisailam Visit: వీడియో ఇదిగో, శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, నేడు రూ. 13,429 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీశైలం మల్లిఖార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు ప్రధానికి లాంఛనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి మోదీ పూజలు చేశారు.

PM Modi Andhra Pradesh Tour: అక్టోబర్ 16న ప్రధాని మోదీ ఏపీ పర్యటన, రూ. 13 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న ప్రధాని, శ్రీశైలం పర్యటన పూర్తి వివరాలు ఇవే..

Team Latestly

ఈ నెల 16వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. ప్రధాని శ్రీశైలం పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ బందోబస్తు ఏర్పాట్లను ఏపీ డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా మంగళవారం పరిశీలించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలం, కర్నూలులో పర్యటించనున్నారు

Advertisement

Tenali Horror: తెనాలిలో పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య, స్కూటీపై మాస్క్‌ వేసుకొని కొబ్బరికాయల కత్తితో నరికి చంపిన దుండగుడు, షాకింగ్ వీడియో ఇదిగో..

Team Latestly

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు, తెనాలి చెంచుపేటలో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

Google AI Hub in Visakhapatnam: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ సెంటర్, ఐదేళ్లలో రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ కీలక ప్రకటన, అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ కేంద్రం ఏపీలో..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతోంది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 15 బిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 1.33 లక్షల కోట్లు పెట్టుబడిగా ఖరారు చేసింది.

Andhra Pradesh: కడపలో ఘోర విషాదం, గూడ్స్ రైలు కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య, మరణ వార్త విని నానమ్మ గుండెపోటుతో మృతి

Team Latestly

ఏపీలోని కడప జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం మొత్తం గూడ్స్‌ రైలు(Goods Train) కింద పడి బలవన్మరణానికి పాల్పడింది. కడప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్‌ సమీపంలోని మూడో నంబర్‌ ట్రాక్‌పై ఓ కుటుంబం గూడ్స్‌ రైలుకు ఎదురుగా నిల్చోగా.. రైలు ఢీకొట్టడంతో అందరూ అక్కడిక్కడే మృతిచెందారు. మృతదేహాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడ్డాయి.

Andhra Pradesh Grameena Banks Merger: ఏపీ గ్రామీణ బ్యాంకుల విలీనం, ఐదు రోజుల పాటు నిలిచిపోనున్న సేవలు, ఏయే బ్యాంకులు మెర్జ్ అవుతున్నాయంటే..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు అన్ని కీలక బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రకటించింది.

Advertisement

Andhra Pradesh Fire Accident: ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో ఆరుగురు సజీవ దహనం, మరికొందరికి గాయాలు, ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Team Latestly

తూర్పు గోదావరి జిల్లాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.రాయవరంలో ఉన్న గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు.

IMD Alert: తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మారిపోయిన వాతావరణం, మరో మూడు రోజుల పాటు ఎండలతో కూడిన వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, హైదరాబాద్ వాసులకు హైఅలర్ట్

Team Latestly

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణం అస్తవ్యస్తంగా మారిపోయింది. పగలంతా ఎండ కాసి, సాయంత్రం ఆకస్మిక వర్షాలు కురిసే పరిస్థితి నెలకొంది. ఈ తారుమారైన వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాల తీవ్రత మరింత పెరగవచ్చని సూచించింది.

Devaragattu Bunny Festival: నెత్తురోడిన దేవరగట్టు బన్నీ ఉత్సవం, కర్రలతో తీవ్రంగా కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు, వీడియోలు ఇవిగో..

Team Latestly

కర్నూలు(Kurnool) జిల్లాహొళగుంద మండలం దేవరగట్టు(devaragattu) మాళ మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవంలో తీవ్ర అపశృతి చోటుచేసుకుంది. బన్నీ ఉత్సవాల ప్రారంభంలోనే రెండు వర్గాలు కర్రలతో తలపడటంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దేవరగట్టులో గురువారం అర్ధరాత్రి స్వామి, అమ్మవారి వివాహం అనంతరం ఊరేగింపు జరిగింది.

Andhra Pradesh: మద్యం కేసులో మిధున్ రెడ్డికి భారీ ఊరట భారీ ఊరట, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు, జైలు నుంచి విడుదల

Team Latestly

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. కోర్టు షరతుల ప్రకారం.. మిధున్ రెడ్డి వారానికి రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందుకు హాజరు కావాలి.

Advertisement

Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, వేడి పాలగిన్నెలో పడిన చిన్నారి మృతి, అనంతపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన

Team Latestly

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారి లక్షిత స్కూల్ వంటగదిలో వేడి పాల గిన్నెలో పడి తీవ్ర గాయపడి మరణించింది. ఈ ఘటన గురుకుల సీసీటీవీ ఫుటేజీ బయటపడిన తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Rain Alert: ఏపీకి బిగ్ అలర్ట్..వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో, ఆరంజె అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Tragedy Averted in Vijayawada: వీడియో ఇదిగో, విజయవాడలో కళాశాల బస్సు నడుపుతున్న డ్రైవర్‌కి గుండెపోటు, సీపీఆర్ సాయంతో ప్రాణాలు కాపాడిన పోలీసులు

Team Latestly

విజయవాడలో రామవరప్పాడు రింగ్‌ రోడ్ వద్ద ఓ ప్రైవేట్ కళాశాల బస్సు డ్రైవర్‌ అకస్మాత్తుగా గుండెపోటుకు గురవగా, వెంటనే స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు అతడికి సీపీఆర్‌ చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dussehra Holidays in Telugu States: ఏపీలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు

Team Latestly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 దసరా సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 19, శుక్రవారం నాడు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, బస్సులో సీటు కోసం జుట్టులు పట్టుకుని తన్నుకున్న మహిళలు, పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో ఘటన

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకం అమలు అయినప్పటి నుంచి బస్సుల్లో సీటు విషయంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి.తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సులో, సీటు కోసం ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Team Latestly

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి కె. శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది నేడు భారత్ తీరాలను దాటి ప్రయాణించే అవకాశం ఉంది.

Andhra Pradesh Shocker: షాకింగ వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి నాగుపామును మెడకు చుట్టుకుని హల్ చల్, రెండు సార్లు కరవడంతో ఆస్పత్రికి పరుగో పరుగు

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో జరిగిన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి తన మెడకు విషపు నాగుపాము చుట్టుకుని వీధుల్లో తిరుగుతూ గందరగోళం సృష్టించాడు. గొల్లపల్లి కొండగా గుర్తించబడిన అతను తన కోడి బోనులో పామును కనుగొన్నట్లు తెలిసింది. అక్కడ అది తనను ఒకసారి కరిచింది.

Hyderabad: షాకింగ్ వీడియో, కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక, ఒక్కసారిగా షాక్ కు గురైన కస్టమర్, తర్వాత ఏమైందంటే..

Team Latestly

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీ ప్లేట్‌లో చనిపోయిన బొద్దింక కనిపించింది. ఈ సంఘటన తీవ్ర భయభ్రాంతిని కలిగించింది. కస్టమర్ సంఘటనను వీడియోగా రికార్డ్ చేశాడు, అది త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Advertisement
Advertisement