ఆంధ్ర ప్రదేశ్

Case Booked Against Nara Lokesh: నారా లోకేష్‌పై కేసు నమోదు, అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపినందుకు ఐపీసీ 279,184, 54ఎ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఆకివీడు పోలీసులు

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో నారా లోకేష్‌పై కేసు (Case Booked Against Nara Lokesh) నమోదైంది. రోడ్లపై అవగాహన లేకుండానే లోకేష్ వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని, కొందరి ప్రాణాలకు హాని కలించేలా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు.

YSR Rythu Bharosa: అకౌంట్లో రూ. 2 వేలు పడినట్లుగా మెసేజ్ చూసుకోండి, రెండవ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన ఏపీ సర్కారు, 50,47,383కి చేరుకున్న లబ్ది దారుల సంఖ్య

Hazarath Reddy

వైఎస్సార్‌ రైతు భరోసా రెండవ విడత పెట్టుబడి సాయాన్నిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan)‌​ ప్రారంభించారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేశారు.

YSR Rythu Bharosa: మరికొద్ది గంటల్లో రైతుల అకౌంట్లలోకి రూ. 2 వేలు, రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పరిపాలనలో దనతైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం మరో విడత వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌ను (YSR Farmer Assurance - PM Kisan) అందించేందుకు సిద్ధమైంది.

National Highway from TS to AP: హైదరాబాద్ నుంచి తిరుపతికి తగ్గనున్న దూరం, కల్వకుర్తి నుండి కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

Hazarath Reddy

తెలుగు రాష్ట్ర ప్రజలకు కేంద్రం శుభవార్తను చెప్పింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని తిరుపతికి వచ్చే వారికి త్వరలో దూరం తగ్గిపోనుంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ (National Highway from TS to AP) ఇచ్చింది. కొత్తగా తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కరివేన వరకు (from Kalvakurthi in Telangana to Karivena in Andhra Pradesh) 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి తెలిపింది.

Advertisement

Liquor Transportation Row: ఏపీలో మద్యం నిషేధం వైపు అడుగులు, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని నిషేధిస్తూ కొత్త జీవో తెచ్చిన ఏపీ ఎక్సైజ్‌ శాఖ, అక్రమ రవాణాను అరికట్టే దిశగా నిర్ణయం

Hazarath Reddy

ఏపీ రాష్ట్రంలో మద్యం ప్రియులకు మరో షాక్‌ తగిలింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటాన్ని (Liquor Transportation in AP) నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. పర్మిట్లు, లైసెన్స్‌ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ ఎక్సైజ్‌ శాఖ (Prohibition and Excise Department) సోమవారం కొత్త జీవో (New GO) విడుదల చేసింది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్‌ తెచ్చుకునేందుకు కూడా ఇక నుంచి అనుమతి లేదు.

AP's COVID19 Update: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు, గడిచిన 24 గంటల్లో 19 వందల మందికి పాజిటివ్, రెట్టింపు సంఖలో రికవరీ, రాష్ట్రంలో 28 వేల దిగువకు పడిపోయిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

పలు జిల్లాల్లో నిన్న మొన్నటివరకు వందకు తక్కువ కాకుండా వచ్చే కేసులు ఇప్పుడు ఇరవై కంటే తక్కువకు రావటం ఉత్సాహాన్నిచ్చే విషయం. దాదాపు అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి...

Jagananna YSR Badugu Vikasam: ఏపీ సర్కారు మరో కొత్త స్కీం, ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం, క్యాంపు కార్యాలయంలో లాంచ్ చేసిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం’’ ( Jagananna YSR Badugu Vikasam) పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ( AP CM YS Jagan Mohan Reddy), తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు

Devaragutta Dasara Festival: యుద్ధాన్ని తలపించే కర్రల సమరంపై సస్పెన్స్, దేవరగట్టులో 144 సెక్షన్ అమలు, అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలు

Hazarath Reddy

దసరా పండగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో అందరి కన్ను కర్నూలు జిల్లా దేవరకొండ వైపే ఉంటుంది. జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం (Devaragutta Dasara Festival) రణరంగాన్నే తలపిస్తుంది. ఈ ఉత్సవంలో కర్రలతో ఒకరినొకరు బాదుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమవుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో (Devaragattu Bunny Utsav) భాగంగా నిర్వహించే కర్రల సమరంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

AP Coronavirus Update: శుభవార్త..ఏపీలో పెరుగుతున్న డిశ్చార్జ్ కేసుల సంఖ్య, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా, తాజాగా 2,997 మందికి కోవిడ్, కరోనాపై పాటను విడుదల చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌

Hazarath Reddy

ఏపీలో కొన్ని రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య (AP Coronavirus Update) క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 3వేల కంటే దిగువకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,997 కేసులు (COVID-19 cases) నమోదయ్యాయి. ఇదే సమయంలో 21 మంది ప్రాణాలు (Covid deaths) కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 466 కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు.

Metro Rail Operations Row: విశాఖలో అడుగు పడింది, మెట్రో రీజనల్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, మెట్రో రైల్ ప్రాంతీయ కార్యకలాపాలు విశాఖ నుంచే ప్రారంభం అవుతాయని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ

Hazarath Reddy

ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ కార్యకలాపాలు (Metro Rail Operations) విశాఖ నుంచి ప్రారంభం అయ్యాయి. విశాఖ నగరంలోని ఎల్‌ఐసీ భవన్‌ మూడో అంతస్తులో రీజనల్‌ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌ ఆదివారం ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

AP Coronavirus Report: ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు, తాజాగా 3,342 మందికి కోవిడ్‌, ఇప్పటివరకు 75,02,933 శాంపిల్స్ సేకరించినట్లు అధికారుల వెల్లడి

Hazarath Reddy

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 75,02,933 సాంపిల్స్‌ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 74,919 మందికి కరోనా సాంపిల్స్‌ పరీక్షించగా.. 3,342 మందికి (AP Coronavirus Report) కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,04,026కు (Covid Cases in AP) చేరుకుంది.

AP-TS Bus Services Row: తెలంగాణకు నో సర్వీస్, సరిహద్దుల వరకే ఏపీ బస్సులు, నాలుగోసారి విఫలమైన రెండు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు, మళ్లీ త్వరలో భేటీ అయ్యే అవకాశం

Hazarath Reddy

అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణా, ఏపీఎస్‌ ఆర్టీసీల మధ్య చర్చలు (AP-TS Bus Services Row) కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల నాలుగో విడత చర్చలు కూడా విఫలం (Interstate Bus Service Standoff) అయ్యాయి.

Advertisement

AP Coronavirus: ఏపీలో 31 వేలకు చేరిన యాక్టివ్ కేసులు, 8 లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ, 6,544కు చేరిన మృతుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,238 కరోనా సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,00,684గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Rayalaseema Lift Irrigation Scheme: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపండి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన కృష్ణా బోర్డు, తక్షణమే డీపీఆర్‌లను అందించాలని స్పష్టం చేసిన కెఆర్ఎంబీ

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation Scheme) పనుల విషయంలో ముందుకెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. కేంద్రం జల సంఘం, కృష్ణా బోర్డు (Krishna River Management Board (KRMB) పరిశీలనకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)లను అందించాలని కోరామని, అయితే ఆ డీపీఆర్‌లను ఇంత వరకు ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తుచేసింది.

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ, నవంబర్ లో ఎన్నికలను నిర్వహించలేమని తెలిపిన ఐటీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం సమావేశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు (AP Local Body Elections) సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగా ముందుకు వెళుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ హైకోర్ట్ వేసిన ప్రశ్నలు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలొ ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి (Mekapati Goutham Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Guidelines for Schools & Colleges: తల్లిదండ్రులు అనుమతిస్తేనే స్కూళ్లకు పిల్లలు, నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్, నేటి నుంచి ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్

Hazarath Reddy

కరోనావైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ( Anil Kumar Singhal) చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ సింఘాల్.. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు (Guidelines For Schools & Colleges) తీసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

New Traffic Fines in AP: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేలు ఫైన్, ఏపీలో సవరించిన వాహన జరిమానా వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి

Hazarath Reddy

ఏపీలో మోటార్‌ వాహనాల నిబంధనలను ఉల్లంఘించినవారికి విధించే జరిమానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) భారీగా పెంచింది. మోటార్‌ సైకిళ్లు, సెవెన్‌ సీటర్‌ కార్ల వరకు ఒక కేటగిరీగా, భారీ వాహనాలు మరో కేటగిరీగా వాహన జరిమానాలు (Traffic Violation Fines) సవరిస్తూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు ఉత్తర్వులు (violation of traffic regulations) జారీ చేశారు.

AP Coronavirus Update: ఏపీలో కేసులు భారీగా తగ్గుముఖం, తాజాగా 3620 మందికి కరోనా, 16 మంది మృతితో 6,524కు చేరుకున్న మరణాల సంఖ్య, యాక్టివ్‌గా 32,257 కోవిడ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో 76,726 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,620 కోవిడ్‌ పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్థారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,96,919కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 3,723 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,58,138గా ఉంది. కరోనాతో కొత్తగా 16 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,524కు (Covid Deaths) చేరింది. ఏపీలో ప్రస్తుతం 32,257 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 10.85శాతం ఉండగా.. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,37,599 కరోనా పరీక్షలు చేపడుతున్నారు.

AP SEC Petiton Row: రెండు చోట్ల ఇళ్లు ఎందుకు? ప్రజాధనాన్ని వృథా చేయడమే కదా? నిమ్మగడ్డ పిటిషన్ సంధర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ఎన్నికలకు సరిగా సహకరించడం లేదంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పిటిషన్ (AP SEC Petiton Row) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.. ఈ పిటిషన్ విచారణ సంధర్భంగా ధర్మాసనం (AP High Court) కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు హైదరాబాద్‌లో అధికార నివాసం ఎందుకని ఆయన విధులు నిర్వర్తించాల్సింది ఎక్కడ నుంచని ధర్మాసనం ప్రశ్నించింది.

AP's COVID19 Report: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 3,746 మందికి పాజిటివ్, మరో 4,739 మంది రికవరీ, రాష్ట్రంలో 32,376గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఈరోజు వరకు మరో 4,739 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 7,51,520 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 32,376 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ....

Advertisement
Advertisement