ఆంధ్ర ప్రదేశ్
Food Poisoning: తూర్పు గోదావరి జిల్లాలో పుడ్ పాయిజన్, 12 మంది చిన్నారులకు అస్వస్థత, ఇద్దరి పరిస్థితి విషమం, ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామని తెలిపిన ఎస్సై బి.వెంకట్‌
Hazarath Reddyతూర్పు గోదావరి జిల్లాలో తినుబండారాలు వికటించి (Food Poisoning in Children) 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పులుసు మామిడి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
CM YS Jagan Father-in-law Dies: వైయస్ జగన్ మామ ఈసీ గంగి రెడ్డి మృతి, పులివెందులకు చేరుకున్న ఏపీ సీఎం, వైయస్ భారతి తండ్రి మృతి పట్ల సంతాపం ప్రకటించిన పలువురు ఎమ్మెల్యేలు
Hazarath Reddyపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి (EC gangi reddy) చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి (CM YS Jagan Father-in-law Dies) చెందారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్‌ భారతి తండ్రి (YS Bharati Father). ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు
Corona in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 6555 మందికి పాజిటివ్, 7485 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 56,897గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, 5900కు పెరిగిన కొవిడ్ మరణాలు
Team Latestlyగత సెప్టెంబర్ నెలలోనే దేశవ్యాప్తంగా 25 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఇండియా 26,21,418 పాజిటివ్ కేసులను నమోదు చేసింది....
Water Row: రైతుల కోసం దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం, నీటి వాటాలపై ఎలాంటి రాజీ లేదు, తెలంగాణ ఉద్యమమే నీటితో ముడిపడి ఉంది; అధికారులతో సమావేశంలో టీఎస్ సీఎం కేసీఆర్
Team Latestlyతెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతీ నీటిబొట్టును కూడా వినియోగించుకొని తీరుతామన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ నదీ జలాల అంశంపై....
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 7 లక్షలు దాటిన కొవిడ్ కేసులు, 5869కి పెరిగిన మరణాల సంఖ్య, గడిచిన 24 గంటల్లో 6,751 మందికి పాజిటివ్, 7 వేలకు పైగా డిశ్చార్జ్
Team Latestlyనిన్నటి నుండి ఈరోజు వరకు మరో 7,297 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 6,36,508 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 57,858 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
Water Tussle: 'నదీజలాల విషయంలో ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోంది, అపెక్స్ కౌన్సిల్‌లో దీటైన సమాధానం చెప్పండి'. నీటిపారుదల అధికారులకు టీఎస్ సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం
Team Latestly. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు ధీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలి....
AP Coronavirus: ఏపీలో భారీగా తగ్గుముఖం పట్టిన కేసులు, తాజాగా 6,133 మందికి కరోనా, 7,075 మంది డిశ్చార్జ్, 6,29,211 మంది కోలుకున్నారని తెలిపిన ఆరోగ్య శాఖ
Hazarath Reddyఏపీలో గడిచిన 24 గంటల్లో 71,806 నమూనాలు పరీక్షించగా 6,133 పాజిటివ్‌ కేసులు (Coronavirus In Andhra Pradesh) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,93,484 కు చేరింది. కోవిడ్‌ బాధితుల్లో కొత్తగా 48 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5828 కు (Coronavirus Deaths) చేరింది. ఒక్క రోజులోనే 7,075 మంది కోవిడ్‌ (Coronavirus) నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,29,211. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 58,445.
AP Govt to Announce MSP to Farmers: రైతులకు జగన్ సర్కారు మరో శుభవార్త, అక్టోబర్‌ 1వ తేదీన కనీస గిట్టుబాటు ధర ప్రకటన, ధరలతో కూడిన పోస్టర్‌ను విడుదల చేయనున్న ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసనలు రేకెత్తుతున్న వేళ ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ రైతులకు తీపి కబురును అందించింది.ఇందులో భాగంగా ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర (AP Govt to Announce MSP to Farmers) అనేది అక్టోబర్‌ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆ ధరలతో కూడిన పోస్టర్‌ను (MSP for all crops) అక్టోబర్‌ 5వ తేదీ నాటికి అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
AP Coronavirus Report: గుడ్ న్యూస్..ఏపీలో కరోనా తగ్గిపోతోంది, ఇప్పుడు యాక్టివ్‌ కేసులు 59,435 మాత్రమే, 6,22,136 మంది డిశ్చార్జ్‌, తాజాగా 6,190 మందికి పాజిటివ్‌‌గా నిర్థారణ
Hazarath Reddyఏపీలో గత 24 గంటల్లో 68,429 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,190 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ (AP Coronavirus Report) అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,87351కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 9,836 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు 6,22,136 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.
Compensation for Lands: మా భూములకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఏపీ హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌
Hazarath Reddyగన్నవరం ఎయిర్‌పోర్ట్‌ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సినీ నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్‌ (Aswini Dutt) ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు (Krishnam Raju) పిటిషన్‌ వేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం (Gannavaram Airport Expansion Row) కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం (Compensation For Lands) చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airport Authority of India) ప్రయత్నిస్తోందంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ లో పేర్కొన్నారు.
AP Schools Reopening Postponed: ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీ వాయిదా, నవంబర్‌ 2న స్కూళ్లు తెరుస్తామని తెలిపిన ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీలో అక్టోబర్‌ 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా వాయిదా వేసినట్లు (AP Schools Reopening Postponed) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్‌ 2న స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను ప్రభుత్వం అందజేయనుందని తెలిపారు. ఆ మేరకు అక్టోబర్‌ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. వీలుంటే సీఎం వైఎస్‌ జగన్‌ ఏదైనా స్కూల్‌కు కూడా వెళ్తారని మంత్రి సురేష్‌ తెలిపారు.
CM YS Jagan VC with Collectors: ఏపీలో అక్టోబర్ నెల‌లో రానున్న పథకాలు, స్పందన కార్యక్రమంపై అధికారులతో ఏపీ సీఎం వైయస్ జగన్ వీడియో కాన్పరెన్స్‌, కలెక్టర్లకు పలు సూచనలు
Hazarath Reddyస్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం జగన్‌ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ (CM YS Jagan VC with Collectors) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్‌లు, జేసీలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ఉన్నతస్థాయిలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ సచివాలయాల్లో అమలు జరిగినప్పుడే ప్రజలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతాయని తెలిపారు. పక్కాగా తనిఖీలు చేసి రిపేర్‌ చేసినప్పుడే వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందన్నారు. విలేజ్, వార్డ్‌ సెక్రటేరియట్‌లకు సంబంధించి అందరు కలెక్టర్‌లు, జేసీలు, డిపార్ట్‌మెంట్స్‌ హెడ్స్‌ విధిగా తనిఖీలు చేయాలి.
AP DGP Reacted to Babu Letter: నిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయండి, చంద్రబాబుకు ప్రత్యుత్తరం ఇచ్చిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, చిత్తూరు జడ్డి సోదరుడుపై దాడి ఘటనపై బాబు లేఖ
Hazarath Reddyఏపీలో చిత్తూరు జిల్లాలో జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో వాస్తవాలు తెలుసుకోవాలని చంద్రబాబుకు ఏపీ డీజీపీ సూచించారు. ఈ మేరకు చంద్రబాబుకు డీజీపీ గౌతం సవాంగ్ రిప్లయి (AP DGP Reacted to Babu Letter) ఇచ్చారు. చట్టప్రకారం తాము విధులు నిర్వర్తిస్తామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించాలని ఏపీ డీజీపీ (DGP Gautam Sawang) కోరారు. జడ్జి రామక్రిష్ణ సోదరుడు రామచంద్రపై దాడి ఘటనలో వాస్తవాలను వివరిస్తూ ఈ మేరకు డీజీపీ, బాబుకు లేఖ (AP DGP Reacted to Babu Letter) రాశారు.
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 5,487 మందికి పాజిటివ్, 7 వేలకు పైగా డిశ్చార్జ్
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. అయితే గతంలో కంటే ఇప్పుడు కేసులు చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కూడా ఈ మహమ్మారి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య...
‘Bharat Ratna for SPB’: ప్రధాని గారు..బాలుకి భారత రత్న ఇవ్వండి, మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
Hazarath Reddyగాన గంధర్వుడు తెలుగు బిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ (Bharat Ratna for SPB)ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి (PM Modi) విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) ప్రధానికి లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు (SP Balasubrahmanyam) చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో సెప్టెంబర్ 25న కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Fake News: ఈ వార్త అంతా అబద్దం, 2016లో విశాఖ మన్యంలో వైరల్ అయిన ఫోటో అది, ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన కాదని గ్రామస్థులు వెల్లడి, ఈ వార్తపై సమాచారం లేదని తెలిపిన చింతకర్ర ఎస్సై
Hazarath Reddyసోషల్ మీడియాలో ఏది నిజమో..ఏది అబద్దమో తెలియడం లేదు. అయితే అది మాత్రం వైరల్ అవుతోంది. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీరా దాన్ని ఎంక్వయిరీ చేస్తే అది ఫేక్ అని తేలింది. వైరల్ అవుతున్న వీడియోని పరిశీలిస్తే.. తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లా (asifabad) వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో (Social Media) ఓ ఫేక్‌ వీడియో చక్కర్లు కొడుతూ జిల్లావాసులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.
YSR Jalakala Scheme: అయిదు లక్షల ఎకరాలకు ఉచిత బోర్లు, రూ.2,340 కోట్లు ఖర్చు పెట్టనున్న ఏపీ ప్రభుత్వం, వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని (YSR Jalakala Scheme) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయనుంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల (free borewells to farmers) ద్వారా సాగునీరు అందించనుంది.
Notices to Chandrababu Residence: కృష్ణమ్మ ఉగ్రరూపం, చంద్రబాబు ఇంటితో సహా కరకట్టపై ఉన్న నివాసాలకు నోటీసులు, ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కన్నబాబు సూచన
Hazarath Reddyఏపీలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీరు పోటెత్తడంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు (AP Revenue Officials)నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు (Notices to Chandrababu Residence) జారీ చేశారు.
TDP New Parliament Observers: చంద్రబాబు నయా వ్యూహాం, తెలుగుదేశం పార్టీకి కొత్త టీం, ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు
Hazarath Reddyఏపీలో జరిగిన గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఏపీ సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష హోదా సైతం గల్లంతయ్యే పరిస్థితుల్లో టీడీపీ ఉండటంతో అధినేత చంద్రబాబు (N. Chandrababu Naidu) సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు కొత్తగా టీం విస్తరణ (13 parliament observers) చేశారు. టీడీపీ పార్టీని ప్రక్షాళన చేస్తూ యువకులకి అవకాశాలను కల్పిస్తూ ఏపీలో పార్లమెంట్‌ స్థానాల వారీగా పార్టీ అధ్యక్షులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (TDP chief Chandrababu Naidu) నియమించారు.
YSR Jalakala: పేద రైతు కలను నెరవేర్చబోతున్న వైఎస్సార్ జలకళ, ఉచిత బోరు పథకాన్ని నేడు లాంచ్ చేయనున్న ఏపీ ప్రభుత్వం, అర్హులు, అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyనవరత్నాల్లో భాగంగా రైతులకు ఉచితంగా బోరుబావిలను తవ్విస్తామన్న హామీని నేడు జగన్ నెరవేర్చబోతున్నారు. వైయస్సార్ జలకళ పేరుతో ఈ బోరుబావులను ప్రభుత్వం తవ్వించనుంది. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఈ రోజు తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంను (AP CM YS Jagan to launch YSR Jalakala scheme) ప్రారంభించనున్నారు.అయితే పథకంకు ఎవరు అర్హులు, అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నదానిపై కూడా విధి విధానాలను విడుదల చేయడం జరిగింది.