ఆంధ్ర ప్రదేశ్

Heavy Rains Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, అలర్ట్ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా నమోదైన వర్షపాతం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల‌పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains Alert) ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్ర‌స్తుతం ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీట‌ర్ల నుంచి నుంచి 7.6 కి.మి. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. సముద్ర తీరంలో ఏర్పడిన గాలుల కలయిక (షియర్‌ జోన్‌) ప్రభావంతో ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.

AP Cabinet Key Decisions: మహిళలకు నాలుగు విడతల్లో రూ.75 వేలు, ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 6163.59 కోట్లు కేటాయింపు, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ (Andhra Pradesh cabinet meeting) కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ (New Districts Formation Committee) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇక దేశ చరిత్రలోనే తొలిసారి 9,712 వైద్యుల పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది.

AP Coronavirus Report: ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 2,432 కరోనా కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 35,451కి చేరుకున్న మొత్తం కోవిడ్-19 కేసులు, కరోనాతో అనంతపురం సీఐ మృతి, తిరుపతిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో కేసులు తొలిసారిగా 2 వేల మార్కును (2,000 COVID-19 cases in a single day) దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 2,432 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య (AP Coronavirus Report) 35,451కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్టు స్థాయిలో 12,17,963 శాంపిల్స్‌ను పరీక్షించారు.

New Districts Formation Committee: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం, మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయం

Hazarath Reddy

ఏపీ మంత్రి మండలి సమావేశం (Andhra Pradesh cabinet Meeting) ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ ఏర్పాటుపై (New Districts Formation Committee) మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు (new districts) అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది.

Advertisement

AP CM YS Jagan Review: ఏపీ సీఎం మరో సంచలన నిర్ణయం, కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేల ఆర్థిక సాయం, ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ (Chief Minister YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనావైరస్ ఏపీలో కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కరోనావైరస్ (Coronavirus) సోకిన కుటుంబాలకు అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు 15 వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కోవిడ్‌ కారణంగా మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

APSRTC: లాక్‌డౌన్ కాలంలో రిజర్వేషన్ చేసుకున్న వారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త, రీఫండ్ చేసుకునేందుకు మ‌రోమారు అవ‌కాశం, ఈనెల 29 వరకు గడువు

Hazarath Reddy

లాక్‌డౌన్ కాలంలో (Lockdown) రిజర్వేషన్ చేసుకొని గ‌డువులోగా టికెట్ ర‌ద్దు చేసుకోలేని వారికి ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) శుభ‌వార్త చెప్పింది. వారు రీఫండ్ చేసుకునేందుకు మ‌రోమారు అవ‌కాశం ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందుకోసం ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ కాన్సిలేషన్ పాలసీని (APSRTC Ticket Cancellation) సవరించింది. టికెట్ల‌కు న‌గ‌దు తిరిగి ఇచ్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. ఇందులో భాగంగా మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మ‌ధ్య రిజ‌ర్వేష‌న్ చేసుకున్న వారికి సైతం అవ‌కాశం క‌ల్పిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది.

AP Coronavirus Update: ఏపీలో తాజాగా 1,916 కరోనా కేసులు, నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌, విశాఖలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కరోనా

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 1,916 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ (COVID-19) సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

APSRTC: కర్ణాటకకు ఏపీ బస్సులు నిలిపివేత, బెంగుళూరులో పూర్తి లాక్‌డౌన్ అమలు, జూలై 15 నుండి 23 వరకు అన్ని బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం

Hazarath Reddy

కర్ణాటకలో కోవిడ్ -19 కేసులు( COVID-19) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో పూర్తి లాక్డౌన్ (Bengaluru lockdown) విధించారు. ఈ నేపథ్యంలో బెంగుళూరుకు బస్సు సేవలను జూలై 15 నుండి 23 వరకు నిలిపివేయాలని (APSRTC to stops all 168 services to Karnataka) ఎపి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) నిర్ణయించింది. కాగా జూన్ 17 నుండి ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటకకు 168 బస్సులను నడుపుతోంది. కోవిడ్ -19 కేసులు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో కూడా బస్సు సేవలను రద్దు చేయడానికి కూడా ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. బెంగళూరులో తిరిగి లాక్డౌన్ విధించడం గురించి ఆర్టీసీ అధికారులు తమ కర్ణాటక నుండి అధికారిక సమాచారం అందుకున్న తరువాత బుధవారం నుండి కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

AP Weather Report: ఏపీలో విస్తారంగా వర్షాలు, మరో రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురిసే అవకాశం, కళకళలాడుతున్న ప్రాజెక్టులు

Hazarath Reddy

ఏపీలో నైరుతి రుతు పవనాలు (Southwest Monsoon in AP) విస్తరించాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.నేడు రేపు కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (AP Weather Report) కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం (Visakhapatnam Meteorological Center) వెల్లడించింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే చేరుకొని, దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Vizag Pharma City Tragedy: విశాఖను వెంటాడుతున్న వరుస అగ్నిప్రమాదాలు, తాజాగా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం, కార్మికుడు మృతి, ప్రమాదఘటనపై హోంమంత్రి ఆరా

Hazarath Reddy

విశాఖపట్నంను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గత ఘటనలు మరచిపోకముందే వైజాగ్ పరవాడ ఫార్మా సిటీలో (Parawada Pharma City) సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో (Ramky CETP Solvent’s building) సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో (Vizag Pharma City Tragedy) ఒక కార్మికుడు చనిపోయారు. మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా తెలిపారు.

Mudragada Padmanabham: ఆయన తర్వాత ఉద్యమాన్ని నడిపించేదెవరు? కాపు ఉద్యమానికి ముద్రగడ గుడ్‌బై, చాలా నష్టపోయానంటూ లేఖ ద్వారా వివరణ ఇచ్చిన కాపు ఉద్యమనేత

Hazarath Reddy

ఏపీలో కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాపు ఉద్యమం (Kapu Movement) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని వివరించారు.

AP Coronavirus Report: ఒక్కరోజే కరోనాతో 37 మంది మృతి, గత 24 గంటల్లో 1935 కోవిడ్-19 కేసులు, రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌

Hazarath Reddy

ఏపీలో కొత్తగా1,919 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 13 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ (AP Corona Updates) అయ్యింది. దీంతో ఈ రోజు మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1030 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Advertisement

Jagananna Thodu Scheme: జగనన్న తోడు, సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం, దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే

Hazarath Reddy

వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి వారికి సరైన వ్యాపారం లేదు. ఉన్న సరుకు అమ్ముడుపోక నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారు తిరిగి వ్యాపారం చేసుకునేందుకు జగనన్న తోడు పథకం (Jagananna Thodu Scheme) ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం (YS Jagan Govt) అండగా నిలుస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన, వీఎంసీ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం (UCD) సౌజన్యంతో ష్యూరిటీ లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది.

Heavy Rains in AP: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న షియర్‌ జోన్‌ ప్రభావం, అలర్ట్ జారీ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1933 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 19 మంది మృతి, రాష్ట్రంలో 30 వేలకు చేరువైన మొత్తం కొవిడ్19 బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 19 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 328 కు పెరిగింది....

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో 1813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 17 మంది మృతి, రాష్ట్రంలో 27 వేలు దాటిన మొత్తం కొవిడ్19 బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 17 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 309 కు పెరిగింది....

Advertisement

Pending Central Funds Update: 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,597.27 కోట్లను విడుదల చేయండి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కోరిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్

Hazarath Reddy

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ రావాల్సిన నిధుల కోసం (Pending Central Funds) పలువురు కేంద్రమంత్రులనకు కలిసారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌లతో శుక్రవారం ఇక్కడ సమావేశమయ్యారు.

Polavaram Project Update: పోలవరంపై కేంద్రమంత్రితో ఏపీ ఆర్థిక మంత్రి భేటీ, పోలవరం నిధులు విడుదల చేయాలని జల శక్తి శాఖ మంత్రి షెకావత్‌ని కోరిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో (Gajendra Singh Shekhawat) ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు(Polavaram Project) సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు (Polavaram Project Funds) త్వరితగతిన విడుదల చేయాలని కోరాను.

AP Coronavirus: ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా, తాజాగా 1608 కోవిడ్-19 కేసులు నమోదు, సచివాలయానికి మరోసారి కరోనా సెగ, కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

Hazarath Reddy

ఏపీలో శుక్ర‌వారం కొత్త‌గా 1608 క‌రోనా కేసులు (AP Coronavirus) న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 సాంపిల్స్‌ను ప‌రిక్షించగా అందులో 1576 కేసులు (new COVID-19 cases) ఏపీలో న‌మోద‌వ్వ‌గా, మిగ‌తా 32 క‌రోనా కేసులు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్యారోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి కొత్త‌గా 981 మంది డిశ్చార్జి కాగా .. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194గా ఉంది.

COVID-19 Rapid Test Kits: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, 15 నిమిషాల్లోనే కరోనా ఫలితాన్ని ఇచ్చే రాపిడ్ కిట్లు అందుబాటులోకి, అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు కోవిడ్‌–19 టెస్ట్‌ (COVID-19 Test) ఫలితం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఇకపై కేవలం 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకుని చికిత్స అందించే విధంగారాష్ట్ర ప్రభుత్వం (AP Govt) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్‌–19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను (COVID-19 Rapid Test Kits) అందుబాటులోకి తీసుకొచ్చింది.

Advertisement
Advertisement