ఆంధ్ర ప్రదేశ్
Mana Palana - Mee Suchana Day 2: రైతులు, కూలీల్లో చిరునవ్వును చూడటమమే లక్ష్యం, రైతులకు మరిన్ని పథకాలు అందిస్తామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyమన పాలన–మీ సూచన పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేధోమథన సదస్సు రెండో రోజుకు (Mana Palana Mee Suchana Day 2) చేరుకుంది. ఈ రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై (Agriculture) సమీక్ష జరిగింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ‘రైతు కూలీల్లో చిరునవ్వు చూడటమే మనలక్ష్యం. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా. రైతుల కష్టాలను తొలగించేలా మేనిఫెస్టో రూపొందించామని ఏపీ సీఎం ( CM YS Jagan) తెలిపారు.
TTD Immovable Properties: 2016 టీటీడీ బోర్టు నిర్ణయాన్ని నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం, స్వామీజీలు,ధార్మిక సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచన
Hazarath Reddyగత ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై టీటీడీ బోర్డు (TTD Board) తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం GO No.888ని విడుదల చేసింది. 2016లో టీటీడీకి చెందిన 50 ఆస్తులు (TTD Immovable Properties) విక్రయించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Govt) నిర్ణయం తీసుకుంది. అయితే, నాటి బోర్డు నిర్ణయాన్ని తాజా బోర్డుకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో ( YV Subba reddy) మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నిర్ణయాలు ఏవైనా స్వామీజీలు, ధార్మిక సంస్థలతో చర్చించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు.
AP Coronavirus: ఏపీలో మొత్తం 1903 మంది డిశ్చార్జ్, తాజాగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు, 2719కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదవగా, ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య (Covid 19 in AP) 2719కి చేరింది. ఈ ప్రాణాంతక వైరస్‌తో ఇప్పటివరకు మొత్తం 57 మంది మరణించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 759 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1903 మంది బాధితులు కోలుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రోజు కరోనాతో చనిపోయాడు. గత 24 గంటల్లో 55 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
Domestic Flight Operations in AP: ప్రయాణికులతో రద్దీగా మారిన గన్నవరం,విశాఖపట్నం విమానాశ్రయాలు, ప్రయాణికులు రెండు గంటల ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి
Hazarath Reddyదాదాపు రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి దేశీయ విమాన సర్వీసులు (Domestic Flight Operations in AP) పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. బెంగళూరు వెళ్లేందుకు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో బారులు తీరారు. కరోనా నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. మరోవైపు గన్నవరం ఎయిర్‌పోర్టులో భద్రత విభాగాన్ని సబ్ కలెక్టర్ ధ్యాన చందర్ పరిశీలించారు.
Srikakulam Bus Accident: శ్రీకాకుళం జిల్లాలో బస్సు బోల్తా, 33 మందికి తీవ్ర గాయాలు, క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు
Hazarath Reddyకరోనావైరస్ (coronavirus) ప్రజలను అనేక కష్టాలకు గురిచేస్తోంది. పొట్ట చేత పట్టుకుని స్వంత ఊర్లను, రాష్ట్రాలనూ వదిలి పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న కూలీలను (Migrants) ముప్పతిప్పలు పెడుతోంది. తాజాగా ప్రైవేటు బస్సు బోల్తా పడి 33 మంది గాయపడిన సంఘటన (Srikakulam Bus Accident) శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలు కర్ణాటకలో క్వారంటైన్‌ ముగించుకుని తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న బస్సు శ్రీకాకుళం జిల్లా మందన మండలం బాలిగాం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 33 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Mana Palana- Mee Suchana: మన పాలన – మీ సూచనలో ఏపీ సీఎం వైయస్ జగన్, మే 30వ తేదీ వరకూ జరగనున్న కార్యక్రమం, ఈ ఏడాది పథకాల క్యాలండర్ ఇదే
Hazarath Reddyవైసీపీ ప్రభుత్వం (YSRCP Govt)అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ (Mana Palana- Mee Suchana) పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం నేటి నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో ('Mana Palana- Mee Suchana' program) మేథోమధన సదస్సు ప్రారంభించారు.
N. Chandrababu Naidu: 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన నారా చంద్రబాబునాయుడు, లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ ప్రతిపక్షనేత
Hazarath Reddyఏపీ ప్రతిపక్ష నేత ఎన్‌.చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), ఆయన కుమారుడు లోకేష్‌ ఎట్టకేలకు అమరావతికి (Amaravati) చేరుకున్నారు. సుమారు 65 రోజుల తర్వాత వీరిద్దరూ ఎపిలో కాలుపెట్టారు. అంతకుముందు వీరిద్దరూ హైదరాబాద్‌ వెళ్లగా కరోనా వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్‌ (Lockdown) ప్రకటించారు. దీంతో వీరు అక్కడే చిక్కుకొని పోయారు. లాక్‌డౌన్‌ నాలుగో దశలో (Lockdwon 4) వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుని పోయిన ప్రజలు సొంతూళ్లు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో చంద్రబాబు, లోకేష్‌ కూడా హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్నారు.
AP COVID-19: రికవరీ రేటులో ఏపీ టాప్, మొత్తంగా 1848 మంది కోలుకుని డిశ్చార్జి, 767 యాక్టివ్ కేసులు, ఏపీలో 2671కి చేరిన కోవిడ్ 19 కేసులు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల (AP Coronavirus) సంఖ్య 2671కి చేరింది. ఈ వైరస్‌ ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది మరణించారు. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడినవారిలో 1848 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 767 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 14 కేసులకు కోయంబేడు లింకులు ఉన్నాయి.
COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో 2627 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 66 పాజిటివ్ కేసులు నమోదు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరి ద్వారా 29 మందికి సోకిన కరోనా వైరస్
Team Latestlyచాలా మంది కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలకు వెళ్లకుండా రోగాన్ని దాచిపెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గొల్లల మామిడాడకు చెందిన హోటల్‌ క్యాషియర్‌ కూడా ఇలాగే ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు...
TS CET-2020 Exams: జూలై 6, 2020 నుంచి జూలై 9 వరకు ఎంసెట్, జూలై 13న ఐసెట్, తెలంగాణలో ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలు మరియు ఇతర వివరాలు ఇలా ఉన్నాయి
Team Latestlyలాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSPSC) శనివారం ప్రకటించింది. తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి....
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో 2561కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో రాష్ట్రంలో 47 పాజిటివ్ కేసులు నమోదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మరియు జిల్లాల వారీగా ఉన్న కేసులపై అస్పష్టత
Team Latestlyతర ప్రాంతాల నుంచి ఏపికి వచ్చిన వారిలో ఇప్పటివరకు 150 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడినట్లు తెలిపిన అధికారులు. వీరి సంఖ్యను ఏపి జాబితాలో కాకుండా అధికారులు విడిగా చూపుతూ వచ్చారు. అలాగే జిల్లాల వారీగా కేసుల వివరాలను తెలిపే పట్టికను కూడా ఇటీవల కాలంగా అధికారులు వెల్లడించడం లేదు...
Lights! Camera! Action! : జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్, విధివిధానాలు రూపొందించాలని ఆధికారులకు ఆదేశాలు, సినిమా హాళ్లను తిరిగి తెరవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
Team Latestlyషూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు....
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్సన్ ఎత్తివేసిన ఏపీ హైకోర్టు, వెంటనే ఆయన్ని విధుల్లోకి తీసుకోండి, సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించండి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ
Hazarath Reddyఏపీ ప్రభుత్వానికి (AP Govt) ఇవాళ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావుపై (AB Venkateswara Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను హైకోర్టు (AP high court) ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటుగా వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
Doctor Sudhakar case: డాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ, కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు, 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyడాక్టర్ సుధాకర్ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డాక్టర్ సుధాకర్‌ (Doctor Sudhakar case) వ్యవహారంపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని ఆదేశించింది.. విశాఖ పోలీసులుపై (VIzag Cops) కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీబీఐని ఏపీ హైకోర్టు (Andhra Pradesh Highcourt) ఆదేశించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. సుధాకర్ కేసులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారణ జరపగా విశాఖ జడ్జి ఆయన స్టేట్‌మెంట్‌ను సమర్పించారు.
AP Restart Program: ఏపీలో రీస్టార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఎంఎస్‌ఎంఈలకు రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయం, ఏపీలో 2514కు చేరుకున్న కరోనా కేసులు
Hazarath Reddyసూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(MSME)ల బలోపేతం కోసం రీస్టార్ట్‌ (AP Restart Program)పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS jagan) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
Thick Smoke from HPCL: వైజాగ్ వాసులను పరుగులు పెట్టించిన హెచ్‌పీసీఎల్‌ పొగ, ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్న వైజాగ్ వాసులు
Hazarath Reddyవైజాగ్ ఎల్జీ పాలిమర్స్ (LG Polymers plant) ఘటన మరువకు ముందే మరొక ఘటన వైజాగ్ (Visakhapatnam) వాసులను ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే అది అంత పెద్ద ప్రమాదం కాకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. వైజాల్ లో ఉన్న హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) (Hindusthan Petroleum Corp Ltd (HPCL) రిఫైనరీ వద్ద గోధుమ వర్ణంలో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమేస్తున్న దృశ్యం చూసి మల్కాపురం, వెంకటాపురం తదితర చుట్టుపక్కల ప్రాంతాలవారు బెంబేలెత్తిపోయారు.
AP Government Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, మే నెలకు పూర్తి జీతాలు, అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు (AP Government Employees) జగన్ సర్కారు తీపి కబురును అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు ఇవ్వాల్సిన జీతాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Tollywood News: లైట్స్- కెమెరా- యాక్షన్ ఎప్పుడు? 'సినిమా కష్టాలను' తెలంగాణ మంత్రికి వివరించిన టాలీవుడ్ పెద్దలు, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక భేటీ, తలసాని ఇచ్చిన హామి ఇదే!
Team Latestlyతెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా ఇప్పటికే....
AP Corona Report: ఏపీలో మొత్తం 1680 మంది డిశ్చార్జ్, తాజాగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌, గ్రామాల్లో కోవిడ్ 19 నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపిన కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ
Hazarath Reddyఏపీలో కొత్తగా 45 మందికి కోవిడ్ 19 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2452కు (AP Corona Report) చేరింది. గడిచిన 24 గంటల్లో 8,092 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 45 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్థారణయింది. కాగా కొత్తగా 41 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.
AP Lockdown 4: ఏపీలో దుకాణాలు తెరుచుకోండి, ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల గురించి ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో మే 31 వరకు లాక్ డౌన్ (AP Lockdown 4) పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం పలు సడలింపులను ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్‌డౌన్‌లో (Lockdown 4) కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ (AP Municipal Department) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.