ఆంధ్ర ప్రదేశ్

COVID-19 in India: భారత్‌లో 40 వేలకు చేరువైన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2644 పాజిటివ్ కేసులు నమోదు, 1300 దాటిన కరోనా మరణాలు

Team Latestly

మహరాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు వరకు 5,054 కు చేరగా 262 కరోనా మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో 4122, మధ్యప్రదేశ్ 2846, రాజస్థాన్ 2770, తమిళనాడు 2757, ఉత్తర ప్రదేశ్ 2487 మరియు పశ్చిమ బెంగాల్ లో 922 కేసులు.....

Coronavirus in AP: ఆంధ్రప్రదేశ్‌లో 1500 దాటిన కోవిడ్-19 బాధితులు, గత 24 గంటల్లో 5943 సాంపిల్స్‌ని పరీక్షిస్తే 62 మంది పాజిటివ్‌గా నిర్ధారించబడినట్లు వెల్లడించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ

Team Latestly

గత 24 గంటల్లో జిల్లాల నుంచి అందిన రిపోర్ట్స్ మేరకు అత్యధికంగా కర్నూల్ జిల్లా నుంచి 25 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కృష్ణా జిల్లా నుంచి 12, నెల్లూరు నుంచి 6, అనంతపూర్ 4.......

Telugu States Coronavirus: ఏపీలో కొత్తగా 60 కేసులు, తెలంగాణలో తాజాగా 6 కేసులు, మూడవ దశ లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన కేంద్రం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States COVID-19) రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంతగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంలేదు. ఏపీలో శుక్రవారం ఉదయానికి తాజాగా 60 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Coronavirus) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

'Thanks to Gujarat CM': గుజరాత్ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం జగన్, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశాభావం

Hazarath Reddy

లాక్‌డౌన్ కారణంగా‌ గుజరాత్‌లో ( Gujarat) చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను (Telugu fishermens) ఏపీకి తరలించడంలో సహకరించినందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానికి(Gujarat CM Vijay Rupani), అక్కడి అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ( AP CM YS Jagan Mohan Reddy) ట్వీట్‌ చేశారు. అలాగే వారు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఇదే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

YSR Pension Kanuka: వైఎస్సార్ పెన్షన్‌ కానుక, 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, బయోమెట్రిక్‌ బదులుగా జియో ట్యాగింగ్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ పెన్షన్‌ కానుక (YSR Pension Kanuka) పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421.20 కోట్లు కేటాయించింది. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్‌‌ను (social security pensions) అందిస్తున్నారు. బయోమెట్రిక్‌ బదులుగా పెన్షనర్ల ఫోటోలను జియో ట్యాగింగ్‌ (geotagging) చేస్తున్నారు. ప్రత్యేక యాప్‌ ద్వారా వాలంటీర్లు వైఎస్సార్ పెన్షన్‌ కానుకను పంపిణీ చేస్తున్నారు.

Thunderbolt Warning: ఏపీలో మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం, రాగల 24గంటల్లో అల్పపీడనం, హెచ్చరించిన వాతావరణ శాఖ కమిషనర్

Hazarath Reddy

దక్షిణ అండమాన్‌ పరిసరాల్లో రాగల 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి, తదుపరి 48గంటల్లో అది మరింత బలపడి, వాయుగుండంగా మారే సూచనలున్నాయని పేర్కొంది. రానున్న 49గంటల్లో ఏపీలో (Andhra Pradesh) 30-40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో 41-43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు.

Red Zones in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లో 11 జిల్లాలు, లాక్‌డౌన్‌ ఆంక్షలపై సడలింపుల నేపథ్యంలో జాబితాను విడుదల చేసిన కేంద్రం, దేశ వ్యాప్తంగా తగ్గిన హాట్‌స్పాట్‌ జిల్లాలు

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలపై సడలింపులు (Lockdown Relaxation) ఉంటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Center) మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. రాష్టాల వారిగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో తెలంగాణలోని ఆరు జిల్లాలు, అలాగే ఏపీలో 5 జిల్లాలను రెడ్‌ జోన్లుగా (Telugu States Red Zones) గుర్తించింది.

Weather Alert: దక్షిణ అండమాన్‌లో అల్పపీడనం, రాగల 48 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం, వెల్లడించిన భారత వాతావరణ విభాగం

Hazarath Reddy

ఉత్తర సుమత్రా, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.6 కి.మీ. ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో దక్షిణ అండమాన్‌ సముద్రంలో (south Andaman Sea) అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల కోస్తాతీరంలో ఉరుములు, మెరుపులతో మోస్తరుగా వర్షాలు పడతాయని వెల్లడించారు. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడడానికి అవకాశం ఉంది.

Advertisement

AP Coronavirus Bulletin: 5 రోజుల్లో 142 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి, ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు, 1403కి చేరుకున్న మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 71 కరోనా కేసులు (AP Coronavirus Bulletin) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1403కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా కేఎస్‌ జవహర్‌రెడ్డి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 6497 శాంపిల్స్‌ను పరీక్షించగా 71 మంది కరోనా నిర్ధారణ (AP Coronavirus) అయిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 321 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మృతిచెందారని తెలిపారు.

Polavaram Project Update: 2020లోనే ఆరు ప్రాజెక్టులు ప్రారంభం, పోలవరం సమీక్ష సంధర్భంగా ఏపీ సీఎంకు తెలిపిన అధికారులు, పనులు వేగవంతం చేయాలన్న వైయస్ జగన్

Hazarath Reddy

పరిపాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గట్టిగానే అడుగులు వేస్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనులపై (Polavaram Project Works) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Lockdown Update: మే 4 నుంచి లాక్‌డౌన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అమలు, మరిన్ని సడలింపులు లభించే చాన్స్, సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు, విద్యార్థులకు ఇప్పటికే అనుమతి

Team Latestly

మరోవైపు దేశంలో కోవిడ్-19 విజృంభన కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 32 వేలకు చేరువైంది. ఈ దశలో మే 4 నుంచి కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్లు సమాచారం.....

AP Lockdown Relaxation Guidelines: ఏపీలో లాక్‌డౌన్ సడలింపు‌, సరికొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, పలు రంగాలకు మినహాయింపులు

Hazarath Reddy

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగించాలా వద్దా అనే విషయంపై కేంద్రం నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్‌డౌన్ సడలింపునకు (AP Lockdown Relaxation) సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం‌ (AP Govt) అదనపు గైడ్‌లైన్స్‌‌ను (fresh guidelines to lockdown relaxation) విడుదల చేసింది.

Advertisement

AP Coronavirus: బ్ర‌హ్మంగారి ఆరాధ‌న ఉత్స‌వాలు ర‌ద్దు, ఏపీలో తాజాగా 73 కరోనా కేసులు, మొత్తంగా 1014 యాక్టివ్‌ కేసులు, రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు (AP positive cases) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుంది.

New Academic Year: ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి. ఆగిపోయిన వాటిని నిర్వహించడంతో పాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (UGC)కు పలు సిపార్సులు చేసింది.

3rd Phase Free Ration Distribution: 3వ విడత ఉచిత రేషన్ ప్రారంభం, బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది, కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో (Lockdown) పేద ప్రజలు ఇబ్బంది పడకుండా వారిని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) మరోసారి ముందుకొచ్చింది. ఇప్పటికే రెండు విడతల ఉచిత రేషన్‌ సరుకులను పంపిణీ చేసిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడో విడత కింద ఉచిత రేషన్‌ సరుకుల పంపిణీని (3rd Phase Free Ration Distribution) ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డు ఉన్న 1,47,24,017 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి.

Andhra pradesh Coronavirus: 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి, ఏపీలో 1,259కి చేరుకున్న కోవిడ్ 19 కేసులు, తాజాగా 82 కరోనా కేసుల నమోదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra pradesh COVID-19) కొత్తగా మరో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో ఏపీలో (Andhra pradesh) కరోనా కేసుల సంఖ్య 1,259కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 5,783 మందికి పరీక్షలు నిర్వహించగా 82 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో.. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 258 డిశ్చార్జి కాగా, 31 మంది మృతిచెందారు.

Advertisement

Jagananna Vidya Deevena: విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల

Hazarath Reddy

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం పలు పథకాలు ప్రవేశపెడుతున్న ఏపీ సీఎం జగన్ (ap cm ys jagan mohan reddy) మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి (Jagananna Amma Vodi), జగనన్న వసతి దీవెన (Jagananna Vasathi Deevena) పథకాలు ప్రవేశపెట్టిన జగన్ సర్కారు (AP Govt) నేడు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించనున్నారు. దీన్ని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను (Fee reimbursement) ఒకేసారి అందజేయనున్నారు.

AP CM YS Jagan: లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు, కలిసికట్టుగా కరోనాని తరిమేద్దాం, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమైపోతుంది, ప్రెస్ మీట్లో ఏపీ సీఎం వైయస్ జగన్ వెల్లడి

Hazarath Reddy

కరోనావైరస్ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఏపీ సీఎం (AP CM YS Jagan Press Conference) రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్‌కు (AP Lockdown) సహకరిస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు. దేశంలోనే అత్యధిక కరోనావైరస్‌ (Coronavirus) టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని, ప్రతి 10 లక్షల జనాభాకు 1396 టెస్టులు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

Andhra Pradesh COVID-19: ఏపీలో కొత్తగా 80 కేసులు నమోదు, 1177 కు చేరిన కోవిడ్-19 కేసుల సంఖ్య, 31 మంది మృతి, కారణం లేకుండా బయటకు వస్తే నేరుగా క్వారంటైన్‌కే..

Hazarath Reddy

ఏపీలో కరోనావైరస్ (AP Coronavirus) మహమ్మారి రోజురోజుకూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 6517 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 80 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID-19 Report) నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177 కు చేరిందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, 235 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

AP Government Employees Salaries: ఏప్రిల్‌ నెల వేతనాలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, కొన్ని శాఖల వారికి పుల్ జీతం, పెన్సనర్లకు 100 శాతం పేమెంట్, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ

Hazarath Reddy

ఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై (AP Government Employees Salaries) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతం చెల్లించనుంది.

Advertisement
Advertisement