తెలంగాణ

Covid Updates: దేశంలో కొత్తగా 18,645 కోవిడ్ కేసులు నమోదు, తెలంగాణలో 351 మందికి కరోనా పాజిటివ్, ఏపీలో తాజాగా 199 కోవిడ్ పాజిటివ్ కేసులు

Hazarath Reddy

దేశంలో గడిచిన 24 గంటల్లో 18,645 కరోనా పాజిటివ్‌ కేసులు (New Covid numbers in India) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 1,04,50,284కు (Covid numbers in India) పెరిగాయి. కొత్త వైరస్‌ నుంచి 19,299 మంది కోలుకొగా.. ఇప్పటి వరకు 1,00,75,950 మంది డిశ్చార్జి అయ్యారు.

Vikarabad: తెలంగాణలో విషాదకర ఘటన, కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి విషమం, బాధిత కుటుంబాలను పరామర్శించిన వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. వికారాబాద్‌లో కల్తీ కల్లు తాగి ( drinking spurious toddy) రెండు గ్రామాల్లో దాదాపు 30 మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు.

CM KCR Review Update: మంత్రులు, కలెక్టర్లతో జనవరి 11న సీఎం కేసీఆర్ కీలక భేటీ, వివిధ శాఖల్లోని సమస్యలపై చర్చ, విద్యాసంస్థల పున:ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం

Team Latestly

పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనల్ల ఏర్పాటు, పార్ట్.బి. లో చేర్చిన అంశాల పరిష్కారం తదితర విషయాలపై సమాశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు....

COVID in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 346 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో 5 వేలకు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో నేడు డ్రైరన్

Team Latestly

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈరోజు ఆరోగ్య శాఖ అధికారులు డ్రైరన్ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1200 కేంద్రాల్లో ఈ మాక్ డ్రిల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలివిడతలో ఫ్రంట్ లైన్ వారియర్లు టీకా అందుకోనున్నారు....

Advertisement

Corona in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా మరో 379 మందికి పాజిటివ్, నిబంధనలు పాటించకపోవడమే కారణమంటున్న ఆరోగ్య నిపుణులు

Team Latestly

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 282,177 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,053 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....

Bowenpally Kidnap Case: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్, బోయిన్‌ పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ భర్తతో సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కిడ్నాప్‌కి గురైన వ్యక్తులు సేఫ్

Hazarath Reddy

బోయినపల్లి ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్‌ కేసులో టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియను (Bowenpally Police Arrest Bhuma Akhila Priya) బుధవారం బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు (Bowenpally kidnap case) సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 417 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4982కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీకి ఆరోగ్యశాఖ సిద్ధం

Team Latestly

దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 13లోగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి....

Cyberabad Police: ఫేక్ ఇన్సూరెన్స్‌ తయారీదారులకు సీపీ సజ్జనార్ వార్నింగ్, ఇలాంటివి ఎవరూ నమ్మవద్దని తెలిపిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే 11 మంది అరెస్ట్

Hazarath Reddy

నగరంలో ఫేక్ ఇన్సూరెన్స్ తయారు చేసే ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Advertisement

Fire Accident in Kukatpally: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం, టీవీ రిపేరింగ్ సెంటర్‌లో ఎగసి పడిన మంటలు, రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ టీవీ రిపేరింగ్ సెంటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకోవడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

TS's COVID Update: తెలంగాణలో తగ్గిన కొవిడ్ తీవ్రత, కొత్తగా మరో 253 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 5,039గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,87,993కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా స్వల్పంగా 61 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ....

Bandi Sanjay: వైసీపీ మూటా ముల్లె సర్దుకునే రోజు దగ్గర పడింది, బైబిల్‌ పార్టీ కావాలో..భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలే తేల్చుకోండి, ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Hazarath Reddy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో (Tirupati Bypoll) బైబిల్‌ పార్టీ కావాలో..? భగవద్గీత పార్టీ కావాలో..? తిరుపతి ప్రజలే తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు.

COVID in TS: తెలంగాణలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు, కొత్తగా మరో 238 మందికి పాజిటివ్, వ్యాక్సిన్ పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు, ఇప్పటికే కోలుకున్న వారికి వ్యాక్సిన్ అవసరం లేదన్న మంత్రి ఈటల

Team Latestly

దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో పదిరోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.....

Advertisement

GHMC Elections Row: ఎన్నికల ఖర్చు వెంటనే తెలపండి, లేకుంటే అనర్హతకు గురవుతారు, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి

Hazarath Reddy

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సకాలంలో ఎన్నికల ఖర్చుల వివరాలను అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి సూచించారు. నిర్ణీత సమయంలో ఈ వివరాలను అందించని పక్షంలో అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 8న ఎన్నికల వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించనున్నామని చెప్పారు.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు, దేశ వ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్, తెలంగాణలో ఏడు కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్, సూర్యాపేటలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదు అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య (Coronavirus in Telangana) 2,87,108కి చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. కరోనా మరణాల సంఖ్య మొత్తంగా 1,546కు చేరుకుంది.

Covid in Suryapet: అంత్యక్రియలకు హాజరు, ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా, తెలంగాణ సూర్యాపేటలో కల్లోలం రేపిన కరోనావైరస్, అప్రమత్తమైన వైద్యాధికారులు

Hazarath Reddy

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం (22 of a family test positive for coronavirus ) ఆ జిల్లాలో ఆందోళన పుట్టిస్తోంది. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరి అందరికీ కరోనా వైరస్‌ (Telangana suryapet coronavirus) సోకింది.

Justice Hima Kohli: తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు బదిలీ అయిన ప్రస్తుత సీజే జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ హిమా కోహ్లిని (Justice Hima Kohli) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు.

Advertisement

Covid Updates: కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్

Hazarath Reddy

భారత్‌లో గత 24 గంటల్లో 20,036 మందికి కరోనావైరస్ (Coronavirus Outbreak) పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు (Coronavirus Outbreak in India) చేరింది.

CM Review on Dharani: ధరణి పోర్టల్ నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష, 2 నెలల్లోనే ధరణి ద్వారా 80 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడి, సేవలను మరింత విస్తరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు

Team Latestly

తెలంగాణలో వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీ చేసుకోవాల్సిన దుస్థితి లేకుండా....

Corona in Telangana: న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పరిశీలించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన, తెలంగాణలో కొత్తగా మరో 415 మందికి పాజిటివ్, 5,974గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

దేశంలో కొత్త రకం న్యూ స్ట్రెయిన్‌ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు, రేపు జరిగే కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.....

Telangana: బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు ఓపెన్, రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) న్యూ ఇయర్‌ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement
Advertisement