తెలంగాణ
GHMC Election 2020: వెలవెలబోతున్న ఓటింగ్ కేంద్రాలు, బయటకు రాని ఓటరు, 3 గంటల వరకు 25.34 శాతం ఓటింగ్ నమోదు, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (GHMC Election 2020) ఓటింగ్ నత్త నడకన సాగుతోంది. ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో (Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections) అత్యంత దారుణంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 1గంట సమయానికి 18.20 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గుడిమల్కాపూర్‌లో 49.19 శాతం, అత్యల్పంగా తలాబ్ చంచలం 0.74 శాతం, అమీర్ పేట్ 0.79 శాతం ఓటింగ్ నమోదైంది.
TRS MLA Nomula Narsimhaiah Dies: టీఆర్ఎస్ పార్టీలో విషాదం, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో కన్నుమూత, సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddyటీఆర్‌ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) గుండెపోటుతో (TRS MLA Nomula Narsimhaiah Dies) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు.
Corona in Telangana: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, కొత్తగా మరో 502 మందికి పాజిటివ్, మరో 894 రికవరీ, రాష్ట్రంలో 9 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyరాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 259,230 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,627 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది....
GHMC Elections 2020: కొనసాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు, సాయంత్రం 6 వరకు జరగనున్న పోలింగ్
Team Latestlyఈసారి జిహెచ్‌ఎంసి ఎన్నికలను టిఆర్‌ఎస్, బిజెపి, ఎఐఐఎంఐఎం, కాంగ్రెస్ సహా ఇతర అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బిజీపీ తరఫున దిల్లీ నుంచి అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం తరలిరావడంతో బల్దియా ఎన్నికలు జాతీయ ఎన్నికలను తలపించాయి...
GHMC Elections 2020: మేయర్ పీఠం మాదే, జోస్యం చెప్పిన అమిత్ షా, కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావాలి, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని తెలిపిన కేంద్ర హోం మంత్రి
Hazarath Reddyగ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని.. మేయర్‌ పీఠం దక్కించుకుంటుందని (Hyderabad’s Next Mayor Will be From BJP) కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, తమ ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌దే కీలక పాత్ర అని ఎద్దేవా చేశారు.
GHMC Polls 2020: చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా, ఈ బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఇంతమందా? ధ్వజమెత్తిన సీఎం కేసీఆర్, బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ పేరు మార్చుతామని తెలిపిన యోగీ ఆదిత్యనాథ్
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు (GHMC polls 2020) సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు.
Covid Cases in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 625 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ, తెలంగాణలో 805 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం (Covid Cases in Telugu States) పడుతున్నాయి. ఆంధ్రపదేశ్‌లో గత 24 గంటల్లో 49,348 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 625 మందికి పాజిటివ్‌గా (AP Coronavirus) నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి.
PM Modi Tour: హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారా..? 5 మందికి మాత్రమే అనుమతిచ్చినట్లుగా వార్తలు, కరోనా వ్యాక్సిన్ పురోగతిపై మూడు నగరాల్లో ప్రధాని పర్యటన
Hazarath Reddyప్రధాని మోదీ నేడు మూడు నగరాలలో (PM Narendra Modi Tour) పర్యటించనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు (Corona vaccine‌ trials) తుది దశకు చేరుకోవడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాలను సందర్శించనున్నారు.
GHMC Elections 2020: మమ్మల్ని గెలిపిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్, విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్స్‌, ఫ్రీ వైఫై సదుపాయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బీజేపీ పార్టీ
Hazarath Reddyజీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ భాగ్యనగర వాసులపై వరాల జల్లు కురిపించింది. గ్రేటర్ ఓటర్లను ఆకర్శించేందుకు మేనిఫెస్టోను తయారుచేసింది.బిహార్‌ అసెంబ్లీ సందర్భంగా ఇచ్చిన ఉచిత కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ప్రయోగాన్ని గ్రేటర్ లో కూడా ప్రయోగించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections 2020) బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్‌ ప్రజలందరికీ ఉచిక కరోనా టీకాను (Offer free corona vaccine) అందిస్తామని తన మేనిఫెస్టోలో హామీనిచ్చింది.
GHMC Polls 2020: సర్జికల్ స్ట్రైక్ అంటే కేసులే.., బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య‌తో సహా 50 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు, మీడియాకు వెల్లడించిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
Hazarath Reddyఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
GHMC Elections 2020: హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర, కఠినచర్యలు తప్పవని హెచ్చరించిన సీపీ అంజనీకుమార్, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyజీహెచ్‌ఎంసీ ఎన్నికలను అవకాశంగా తీసుకొని అరాచకం చేయాలనుకునే మతోన్మాదులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణకు రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడేదిలేదని స్పష్టంచేశారు.
Telugu States Coronaviurs: తెలుగు రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం, ఏపీలో తాజాగా 831 మందికి కరోనా పాజిటివ్, తెలంగాణాలో తాజాగా 862 మందికి కోవిడ్ పాజిటివ్
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు (Telugu States Coronaviurs) తగ్గుముఖం పడుతున్నాయి. సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కోవిడ్ మళ్లీ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ (Covid Second Wave) ఎదుర్కునేందుకు ప్రజలంతా తగిన జాగ్రత్తలతో రెడీ కావాలని పిలుపునిస్తున్నారు.
Covid In Telangana: తెలంగాణలో తాజాగా 993 మందికి కరోనా, 2,66,042కి చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నలుగురు మృతితో 1,150కు చేరుకున్న మరణాల సంఖ్య
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 993 కరోనా కేసులు (Covid In Telangana) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,66,042కి Covid In TS) చేరింది. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు (Covid Deaths) కోల్పోగా, అదే సమయంలో 1,150 మంది కోలుకున్నారు.
'Surgical Strikes in Old City': అధికారం ఇవ్వండి..పాతబస్తీలో వారిపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyగ్రేటర్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తామని ('Surgical Strikes in Old City')సంచలన వ్యాఖ్యలు చేశారు.
Covid in TS: సినిమా థియేటర్లు నేటి నుంచి ఓపెన్, తెలంగాణలో తాజాగా 921 కరోనా కేసులు నమోదు, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 146 కోవిడ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గత 24 గంటల్లో 921 కరోనా కేసులు (Covid in TS) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,097 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,65,049కి (Coronavirus in TS) చేరింది.
GHMC Elections 2020: 24 గంటలు మంచినీటి సరఫరా, జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన టీఆర్ఎస్, ప్ర‌జా ర‌వాణాకు పెద్ద‌పీట వేస్తామని తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddy‌డిసెంబర్ 1న జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో (GHMC Elections 2020) భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను (TRS Manifesto) విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను (TRS Manifesto For GHMC Elections) విడుదల చేశారు.
TS Covid Report: తెలంగాణలో 602 కొత్త కేసులు, రాష్ట్రంలో 2,64,128కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, రెండవ దశలో కరోనా వచ్చే ప్రమాదం ఉందని అధికారులను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 602 కొత్త కేసులు (TS Covid Report) నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,64,128 కేసులు (Coronavirus in Telangana) నమోదయ్యాయి. నిన్న కరోనా బారినపడి మరో ముగ్గురు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,433కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1015 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Raghunandan Rao: వైఎస్సార్ అభిమానులు నన్ను క్షమించాలి, ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నాను. దివగంత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మంచి నాయకుడు అన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
Hazarath Reddyదివగంత ముఖ్యమంత్రి మహా నేత వైస్సార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు ఎట్టకేలకు సారీ చెప్పారు. వైఎస్సార్ అభిమానులంతా నన్ను క్షమించాలని వీడియోని విడుదల చేశారు. వెఎస్సార్ మహా నాయకుడు ఆయన పెట్టిన పథకాలు మంచివి అని నేను చాలా సార్లు చెప్పాను ఆయన్ని కించ పరిచే విధంగా నేను ఎన్నడు మాట్లాడ లేదు. నిన్న ప్రెస్ మీట్ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆయన పథకాలను ఓ సారి గుర్తు చేసుకోండని వీడియోలో తెలిపారు.
GHMC Elections 2020: ఆయన పావురాల గుట్టలో పావురమయ్యాడు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్న వైఎస్సార్ అభిమానులు, వైసీపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు
Hazarath Reddyవెనుకటికి ఒకడుండేవాడు. పావురాల గుట్టల్లో పావురమైపోయిండు. మీకు అదే గతి పడుతుంది.నేను సైన్స్‌ టీచర్‌ను. యాక్షన్‌కు రియాక్షన్‌ ఉంటుంది. టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శలు (Raghunandan Rao Comments Over YSR Death) గుప్పించారు. అయితే ఇక్కడ వైఎస్సార్ ప్రస్తావన తీసుకురావడంతో ఆయన అభిమానులు ఎమ్మెల్యేపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు.