India

Gold Hits Two-Week Low: గుడ్ న్యూస్, రెండు వారాల కనిష్ఠానికి పడిపోయిన బంగారం ధరలు, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధరపై రూ. 170 తగ్గుదల

Hazarath Reddy

ఈ నెలలో US ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశానికి చిన్న రేట్ల-కట్ బెట్‌లలో మార్కెట్‌లు ధరలను తగ్గించడంతో బంగారం ధరలు బుధవారం దాదాపు రెండు వారాల్లో కనిష్ట స్థాయికి పడిపోయాయి, ఇది నాలుగో వరుస సెషన్‌కు క్షీణించింది. ఫలితంగా పుత్తడి ధరలు రెండు వారాల కనిష్ఠానికి పడిపోయాయి.

Budameru River Flood: బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద, నీట మునిగిన పలు కాలనీలు, ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్న ప్రజలు

Hazarath Reddy

విజయవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరుగుతోంది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి.

TDP Suspends MLA Koneti Adimulam: రాసలీలల ఎఫెక్ట్, టీడీపీ నుండి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు!

Arun Charagonda

రాసలీలల ఎఫెక్ట్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు సత్యవేడు ఎమ్మెల్యే, టీడీపీ నేత కోనేటి ఆదిమూలం. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గోవా లిక్కర్ స్వాధీనం, 12 లక్షల విలువ చేసే 415 బాటిళ్లు సీజ్

Arun Charagonda

గోవా నుంచి విమానం ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్న నాన్ డ్యూటీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులు. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.నాన్ డ్యూటీ మద్యాన్ని తరిలిస్తున్న12 మందిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Communal Tensions Erupt in Asifabad: ఆదివాసీ యువతిపై అత్యాచారయత్నం, ఆసిఫాబాద్ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీలు, 144వ సెక్షన్ విధింపు

Hazarath Reddy

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆదివాసీ యువతిపై జరిగిన అఘాయిత్యాన్ని నిరసిస్తూ జైనూర్ పట్టణంలో ఈరోజు ఆదివాసీలు బంద్‌కు పిలుపునిచ్చారు.

HC on Poker and Rummy: పేకాట, రమ్మీ జూదం కాదు, నైపుణ్యానికి సంబంధించిన ఆటలు, అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Hazarath Reddy

పేకాట మరియు రమ్మీ నిర్వహణకు కంపెనీకి అనుమతిని నిరాకరిస్తూ ఆగ్రా సిటీ కమిషనరేట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ DM గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ శేఖర్ బి సరాఫ్ మరియు జస్టిస్ మంజీవ్ శుక్లాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.

Andhra pradesh: ఫార్చునర్ కారులో వచ్చి చోరి, బంగారం షాపులో 38 కిలోల వెండి ఆబరణలు అపహరణ, దొంగల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు..వీడియో

Arun Charagonda

ఖరీదైన కారులో వచ్చి చోరీ చేసి దొరికిపోయిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. ఫార్చునర్ కారులో వచ్చి బంగారం షాపులో 38 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. పారిపోతున్న దొంగల్లో ఒకడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితులది రాజస్థాన్‌గా భావిస్తున్నారు పోలీసులు.

TDP MLA Koneti Adimulam Episode: టీడీపీ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకుంటా..ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై బాధితురాలు, పలు న్యూడ్ వీడియోలు రిలీజ్

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో ఉన్న న్యూడ్ వీడియో వైరల్‌గా మారగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో బాధితురాలు పలు న్యూడ్ వీడియోలను రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని గతంలో సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించింది.

Advertisement

TDP MLA Koneti Adimulam: అది మార్ఫింగ్ వీడియో, టీడీపీ నేతలే తనపై కుట్ర చేశారని వెల్లడించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటన

Arun Charagonda

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ మహిళతో రొమాన్స్ చేస్తున్న వీడియో బయటకు రాగా దీనిపై స్పందించారు ఆదిమూలం. సొంతపార్టీ నేతలే తనపై కుట్రచేశారని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

TDP MLA Koneti Adimulam: ఓ వైపు వర్షం..మరోవైపు రాసలీలల్లో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు చేసిన మహిళా..వీడియో ఇదిగో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వివాదంలో చిక్కుకున్నారు. సత్యవేడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆదిమూలం. చెల్లి అంటూనే తనపై లైంగికంగా దాడి చేశారని కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా రాసలీలకు సంబంధించిన వీడియో లీక్ అయింది.

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పసిడి పతకం,ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా హర్విందర్ సింగ్ రికార్డ్, 24కి చేరిన భారత్ పతకాల సంఖ్య

Arun Charagonda

పారాలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తాచాటుతున్నారు. తాజాగా పారా ఆర్చరీ మెన్స్ రికర్వ్ ఓపెన్ ఫైనల్స్ లో సత్తా చాటారు హర్విందర్ సింగ్. పోలాండ్ కు చెందిన లుకాస్జ్ సిజెక్ ను 6-0 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.

CM Revanth Reddy On Global AI Summit: హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సు, ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు

Arun Charagonda

హైదరాబాద్‌లో గ్లోబల్ ఏఐ సదస్సును ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుండగా దేశ చరిత్రలోనే తొలిసారి హైదరాబాద్‌లో ఏఐ సదస్సు జరుగుతోంది. సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఈ సదస్సు జరగనుంది.

Advertisement

Basara IIIT Students Protest: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన, సమస్యలను పరిష్కరించాలని 2 వేల మంది విద్యార్థుల నిరసన

Arun Charagonda

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.

Money Fraud In Hyderabad: హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ మోసం, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి, అధిక వడ్డీ ఆశతో డబ్బులు వసూలు, బోర్డు తిప్పేసిన కంపెనీ

Arun Charagonda

హైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్వె‌స్ట్‌మెంట్ పేరుతో ప్రజలను ముంచేసింది డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ. ఏకంగా రూ.500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు కంపెనీ నిర్వాహకులు. రెండు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువ కావడంతో మాదాపూర్‌లోని ఆఫీసుకి తాళం వేసి.. పరారయ్యారు . హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు

Madhya Pradesh: షాకింగ్ సంఘటన, అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు పత్రాలతో కలెక్టరేట్ వరకు పాక్కుంటూ వచ్చిన బాధితుడు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

మధ్య ప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన గ్రామంలో అవినీతి, అక్రమాలపై 7 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు కంకారియాకు చెందిన ముకేశ్. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు పత్రాలను తాడుకి కట్టి కలెక్టరేట్ వరకు పాక్కుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

YS Sharmila On Rainy Season: వర్షాకాలానికి సరికొత్త అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల, రైనీ సీజన్ అంటే షర్మిల ఏం చెప్పిందో తెలుసా?, అందుకే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారా!

Arun Charagonda

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన షర్మిల తాజాగా వర్షాకాలనికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల...మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్‌ అని చెప్పేశారు. అంతే నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు

Advertisement

Vijayawada Floods: కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు

Arun Charagonda

వరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ బయటపడుతోంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్తుండగా కొడుకుని తలుచుకుని రోదిస్తున్న ఆ తల్లి బాధ మాటల్లో చెప్పలేదని. ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.

Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

Arun Charagonda

వైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.

Teachers Day Wishes In Telugu 2024: టీచర్స్ డే సందర్భగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలను పంపడం ద్వారా మీ గురువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయం ఆసన్నమైంది.

Teacher's Day 2024 Wishes In Telugu: మీ స్నేహితులు, గురువులకు టీచర్స్ డే సందర్భంగా మంచి స్ఫూర్తి వంతమైన గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించారు. మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో చదువు పూర్తి చేశారు. డాక్టర్ కృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.

Advertisement
Advertisement