Information
COVID-19 Vaccination in India: కేంద్రం నుంచి శుభవార్త..జనవరి 13 నుంచి కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ, కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధంగా ఉన్నామని తెలిపిన తెలుగు రాష్ట్రాలు
Hazarath Reddyభారతదేశంలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను (COVID-19 Vaccine First Dose in India) ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
India Covid Update: కోవిషీల్డ్ వ్యాక్సిన్ కొనాలంటే రూ. 400-రూ.600 పెట్టాలి, ధరల వివరాలను వెల్లడించిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా, దేశంలో తాజాగా 16,375 మందికి కరోనా పాజిటివ్
Hazarath Reddyకరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల (India Covid Update) చేసింది. దేశంలో గత 24 గంటల్లో 16,375 మందికి కరోనా నిర్ధారణ (COVID-19 Cases in India) అయింది. అదే స‌మ‌యంలో 29,091 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది.
LPG Refill booking: ఒక్క మిస్‌డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్, 84549 55555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌, ఎలాంటి కాల్‌ ఛార్జీలు పడవు, మిస్డ్ కాల్ సదుపాయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Hazarath Reddyఇప్పటిదాకా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ చేస్తే అవతలి వారు రిసీవ్ చేసుకోవడం తద్వారా సమయం వేస్ట కావడం లాంటివి జరుగుతుండేవి, అయితే ఇప్పుడు దీనికి ముగింపు పలుకుతూ కేవలం ఫోన్‌ మిస్డ్‌ కాల్‌తోనే ఎల్పీజీ రీఫిల్‌ బుకింగ్‌ సదుపాయం ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే రీఫిల్‌ సిలిండర్‌ బుక్‌ అవుతుందని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
New CJ to AP High Court: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పదవీ విరమణ చేసిన హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి రాకేష్ కుమార్
Hazarath Reddyఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్ మహేశ్వరీ బదిలీపై కూడా కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు.
New Covid Strain in India: భారత్‌లో మొదలైన కొత్త కరోనావైరస్ కల్లోలం, ఆరుమందికి కొత్త కోవిడ్ స్ట్రెయిన్ పాజిటివ్, హైదరాబాద్‌లో ఇద్దరికి పాజిటివ్, నెల రోజుల్లో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు
Hazarath Reddyభారత్‌లోకి కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రవేశించింది. కోవిడ్‌-19 పరీక్షలో భాగంగా ఆరుగురికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారణ (New Covid Strain in India) అయ్యింది. కాగా గత నెల రోజులలో యూకే నుంచి 33 వేల మంది ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. వీరిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
New Covid Strain Symptoms: కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి ? యూకేను వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రెయిన్, ఆ దేశానికి రాకపోకలు అన్నీ బంద్
Hazarath Reddyకొత్త కరోనావైరస్ ని ఎలా గుర్తించాలినే దానికి బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) కొన్ని లక్షణాలను (New Coronavirus variation symptoms) వెల్లడించింది.
CBSE Board Exams 2021: సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు వాయిదా, ఎగ్జామ్స్ నిర్వహణ తేదీలను తర్వాత నిర్ణయిస్తాం, కీలక ప్రకటన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Hazarath Reddyకేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం సీబీఎస్‌ఈ వార్షిక పరీక్షలు 2021 (CBSE Board Exams 2021) జనవరిలో గానీ, ఫిబ్రవరిలో గానీ జరుపలేమని తేల్చి చెప్పారు. పరీక్షలు రద్దు చేయబడవని, కానీ వాయిదా వేస్తారని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షలు సాధ్యం కానందున పరీక్షలు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయని కేంద్ర మంత్రి అన్నారు.
New COVID-19 Variant: కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చింది, లాక్‌డౌన్-4 దిశగా ప్రపంచ దేశాలు, మళ్లీ రాకపోకలపై నిషేధం, బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయిందని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్
Hazarath Reddyప్రపంచాన్ని ఇప్పటి వరకు వణికించిన కరోనావైరస్ కొత్త రూపం (New COVID-19 Variant) సంతరించుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండగానే అది మళ్లీ తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రపంచదేశాలను ఈ కొత్త రూపు (new coronavirus variant) సంతరించుకున్న వైరస్ వణికిస్తోంది.
Farmers' Protest: దేశ వ్యాప్తంగా అమరులైన రైతులకు నివాళి, లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలు, కార్యాచరణను ప్రకటించిన రైతు సంఘాలు
Hazarath Reddyనేడు దేశవ్యాప్తంగా గ్రామాల్లో అమరులైన రైతులకు నివాళులు అమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నివాళులర్పించాలని నిర్ణయించాయి. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన తర్వాత వివిధ కారణాలతో 33 మంది రైతులు మృతిచెందారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలు (Farmers to pay tribute to deceased protesters) నిర్వహించనున్నారు.
PM Modi to Interact with Farmers: డిసెంబర్ 25న రైతులనుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, వ్యవసాయ చట్టాల రద్దును కోరుతున్న రైతులు, యూపీలో 2500కిపైగా ప్రదేశాల్లో ‘కిసాన్‌ సంవాద్‌కి బీజేపీ ప్లాన్
Hazarath Reddyకొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల సమీపంలో రైతులు ఉద్యమిస్తున్న (Farmers Protest) సంగతి విదితమే. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం మాట్లాడనున్నారు.
Indian Railways: రైళ్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో తెలియదు, కరోనా దెబ్బకు భారీగా ఆదాయాన్ని కోల్పోయాం, గూడ్స్ ద్వారా రికవరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం, కీలక విషయాలను వెల్లడించిన రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్
Hazarath Reddyకరోనావైరస్ కారణంగా దేశంలో నిలిచిపోయిన సాధారణ రైళ్ల సేవలు తిరిగి ఎప్పుడు ప్రారంభించేదీ చెప్పలేమని రైల్వే బోర్డు పేర్కొంది. ఈ విషయంలో కచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
‘Covid-19 is World War’: కరోనాపై ప్రపంచ యుద్ధం జరుగుతోంది, లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించాలనుకుంటే 10 రోజుల ముందు చెప్పండి, కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే అనేక దేశాల్లో మొదటి దశను దాటుకుని రెండవ దశలోకి కరోనా ప్రవేశించింది. ఇంకొన్ని దేశాల్లో ఏకంగా మూడవ దశలోకి వెళ్లింది. మన ఇండియా విషయానికి వస్తే సెకండ్ వేవ్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాపై ప్రపం‍చ యుద్ధం (Covid-19 is world war) జరుగుతుందని, దీని వల్ల ప్రతీ ఒక్కరూ బాధపడుతున్నారని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.
Supreme court: ఏపీ హైకోర్టు ఆదేశాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపిన సుప్రీంకోర్టు, ఏపీలో రాజ్యాంగ సంక్షోభంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం
Hazarath Reddyఏపీలో ‘రాజ్యాంగ సంక్షోభం’ అయిందంటూ దాఖలు చేసిన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ సంక్షోభం అంశం విచారణలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ని విచారించిన అత్యున్నత ధర్మాససనం...ఈ వ్యాజ్యంతో ముడిపడి ఉన్న ఇతర పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను నిలిపి వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
Coronavirus Vaccine: కరోనా వ్యాక్సిన్ కోసం గుర్తింపు కార్డు తప్పనిసరి, అయితే వ్యాక్సిన్ తప్పని సరేం కాదు, వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరగాలంటే తప్పక తీసుకోవాలి, త‌ర‌చూ అడిగే ప్ర‌శ్న‌ల జాబితాను రూపొందించిన ఆరోగ్యశాఖ
Hazarath Reddyకరోనావైరస్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదని, స్వచ్ఛందంగా ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. భారతదేశంలో ప్రవేశపెట్టిన వ్యాక్సిన్ (Coronavirus Vaccine) ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వలె ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.
Mucormycosis: దేశంలో కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యాధి బయటకు, ముకోర్మైకోసిస్ వ్యాధితో 9 మంది మృతి, 44 మంది ఆస్పత్రిలో.. అహ్మదాబాద్‌ని వణికిస్తున్న మ్యూకర్‌మైకోసిస్‌ ఫంగస్
Hazarath Reddyదేశంలో కరోనావైరస్ (Covid-19 pandemic) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో మరో కొత్త వైరస్ గుజరాత్ ప్రధాన నగరం అహ్మదాబాద్‌ను వణికిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ పై ఆశలు చిగురిస్తున్న తరుణంలో మరో అంతుచిక్కని వ్యాధి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మ్యూకర్‌మైకోసిస్‌ (Mucormycosis) అనే ఫంగస్‌ బారీన పడి అహ్మదాబాద్‌లో (Another Disease Hits Ahmedabad) 9 మంది మృతి చెందగా, 44 మంది ఆస్పత్రి పాలయ్యారు.
Coronavirus Leak: కరోనావైరస్ ల్యాబ్ నుండే లీక్, జంతువుల నుండి కాదు, సంచలన విషయాన్ని వెల్లడించిన నార్వేజియన్ వైరాలజిస్ట్, ఆగస్టు లేదా సెప్టెంబర్ 2019‌లో ప్రమాదవశాత్తు ల్యాబ్ నుండి లీకయిందని వెల్లడి
Hazarath Reddyకరోనావైరస్ మానవ నిర్మితమైనదని ఇది ప్రయోగశాల నుండి “అనుకోకుండా” లీక్ (Coronavirus Leaked Accidentally From a Lab) అయిందని నార్వేజియన్ వైరాలజిస్ట్ బిర్గర్ సోరెన్‌సెన్ పేర్కొన్నారు.
Maharashtra Shakti Bill: ఏపీ దిశ చట్టం తరహాలో..మహారాష్ట్రలో శక్తి బిల్లును తీసుకువచ్చిన ఉద్ధవ్ సర్కారు, మ‌హారాష్ట్ర శ‌క్తి బిల్లు 2020 ద్వారా పోక్సో చ‌ట్టం మ‌రింత క‌ఠిన‌త‌రం
Hazarath Reddyదేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ దిశ ఘటన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మ‌హిళ‌లు, చిన్నారుల ప‌ట్ల హింస‌ను అదుపు చేసే ఉద్దేశంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఇవాళ అసెంబ్లీలో (Maharashtra Assembly) శ‌క్తి బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. ఏపీలోని దిశ చ‌ట్టం త‌ర‌హాలో శ‌క్తి బిల్లును (Maharashtra Shakti Bill) రూపొందించారు.
RTGS: గుడ్ న్యూస్..నేటి నుంచి ఎంతైనా నగదు బదిలీ చేసుకోవచ్చు, 24 గంట‌లు ఆర్‌టీజీఎస్ సేవ‌లు అందుబాటులోకి, రూ.2,000గా ఉన్న కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పరిమితి రూ.5,000కు పెంపు
Hazarath Reddyడిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహాంలో భాగంగా నేటి నుంచి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (RTGS) సేవల్ని ఇక 24 గంటలూ అందుబాటులోకి తెస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు.
Covid in India: కరోనాతో కంటి చూపుకు ముప్పు, ఊపిరితిత్తుల్లోని కణాలపై కోవిడ్ దాడి, వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా జాగ్రత్తలు తప్పనిసరి, దేశంలో తాజాగా 27 వేల కేసులు నమోదు, కరోనా భయంతో కేరళలో ఆలయం మూసివేత
Hazarath Reddyఉద్యోగులకు కరోనా రావడంతో కేరళలోని ప్రముఖ దేవాలయం గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయం రెండు వారాలపాటు మూసివేయనున్నారు. త్రిస్సూర్‌లో ఉన్న గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో పనిచేస్తున్న 22 మంది ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌ అని తేలింది.