సమాచారం

English Medium in Public Schools: ఏపీ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు, తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి, ఇంగ్లీష్ మీడియంపై జీవో జారీ చేసిన ఏపీ సర్కారు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా కొత్త నిర్ణయం

Hazarath Reddy

ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2020–21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం (English Medium in AP) అమలు కానుంది. మైనార్టీ భాషా మాధ్యమం స్కూళ్లు యధాతథంగా కొనసాగనున్నాయి.

Income Tax Return 2019-20: ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త, ఐటీ రిటర్న్ 2019-20 గడువు నవంబర్ వరకు పొడిగింపు, టీడీఎస్ రేట్లు 25 శాతం తగ్గింపు

Hazarath Reddy

ఆదాయపు పన్ను దాఖలు (ఐటిఆర్) దాఖలు 2019-2020 గడువును (Income Tax Return 2019-20) నవంబర్ 30 వరకు కేంద్రం పొడిగించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 3 నుండి అక్టోబర్ 31 వరకు పన్ను ఆడిట్ గడువును పొడిగించింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.

Rs 20 Lakh Crore Package: ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే

Hazarath Reddy

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) నిర్వచనం (New Definition of MSMEs) మారింది.నూతన నిర్వచనం ప్రకారం రూ. కోటి పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 5 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మైక్రో ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదే రూ. 10 కోట్ల పెట్టుబడి కలిగి ఉన్న సంస్థ రూ. 50 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది స్మాల్‌ ఎంటర్‌ప్రైస్‌ కిందకు.. అదేవిధంగా రూ. 20 కోట్ల పెట్టుబడితో ఉన్న సంస్థ రూ. 100 కోట్ల టర్నోవర్‌ చేస్తే అది మీడియం ఎంటర్‌ప్రైస్‌గా కేంద్ర ఆర్థికమంత్రి (FM Nirmala Sitharaman) పేర్కొన్నారు.

Atma Nirbhar India: ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

Hazarath Reddy

ఐదు మూల సూత్రాల ఆధారంగా 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' (Atamanirbhar Bharat Abhiyan) ప్రకటనను మోదీ చేశారని తెలిపారు. ఆ ఐదు సూత్రాలు... ఆర్థికం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, ప్రజలు, గిరాకీ అని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడమే ఈ ప్యాకేజీ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే... స్వయం ఆధారిత భారతం అని అర్థమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు సంబంధించిన వివరాలను రోజుకొకటి వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని చెప్పారు. ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.

Advertisement

FM Nirmala Sitharaman PC: చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు

Hazarath Reddy

ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై (Rs. 20 Lakh Crore) పూర్తి వివరాలను వెల్లడించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman on Economic Package) ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Vocal for Local: మేడ్ ఇన్ ఇండియా, పారామిలిటరీ క్యాంటిన్లలో ఇకపై స్వదేశీ వస్తువులే వాడాలి, కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం, జూన్ 1 నుంచి అమల్లోకి

Hazarath Reddy

కేంద్ర బ‌ల‌గాల‌కు చెందిన క్యాంటీన్ల‌లో ( Central Armed Police Forces) కేవ‌లం స్వదేశీ వ‌స్తువుల‌ను (Vocal for Local) మాత్ర‌మే అమ్మ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్ర‌ల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌.. క్యాంటీన్ల‌లో ఇక నుంచి కేవ‌లం మ‌న దేశంలో త‌యారైన వ‌స్తువుల‌ను అమ్మ‌ాలని హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) తెలిపారు.

Inter Spot Valuation in TS: 20 రోజుల్లో ఇంటర్ ఫలితాలు, స్పాట్ వాల్యూయేషన్‌కు పచ్చజెండా ఊపిన తెలంగాణ హైకోర్టు, జాగ్రత్తలు పాటించాలని ఆదేశం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో (Telangana) ఇంటర్మీడియట్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు (Telangana High Court) అనుమతిచ్చింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం ఆగిపోయింది. ఇప్పుడు ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి తెలంగాణ హైకోర్టు పచ్చజెండా ఊపింది. లాక్‌డౌన్‌లో ఇంటర్ మూల్యాంకనంపై (Inter spot valuation) సామాజిక కార్యకర్త ఓంప్రకాష్ వేసిన పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు, భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Liquor Sale in Maharashtra: మద్యం హోం డెలివరీ, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి

Hazarath Reddy

మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు ( Maharashtra Govt) శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్‌ (Lockdown) అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ( Home Delivery of Alcohol) అనుమతినిచ్చింది. మే 5 నుంచి లిక్కర్‌ షాపులు తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో భౌతిక దూరం ప్రధాన సమస్యగా మారింది.

Advertisement

Indian Railways: 54 వేల టికెట్లను జారీ చేసిన రైల్వే శాఖ, రైల్వే స్టేష్టన్‌లో ఆరోగ్య పరీక్షలు, ప్రతి ప్రయాణీకుల డేటా ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని తెలిపిన DG RPF Arun Kumar

Hazarath Reddy

మే 12 నుంచి 15 ప్రత్యేక ఎయిర్ కండిషన్డ్ రైళ్లను ప్రారంభించనున్నట్లు భారత రైల్వే (Indian Railways) ప్రకటించడంతో, స్టేషన్లలో ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ ( Railway Protection Force Director) జనరల్ మంగళవారం పేర్కొన్నారు. ప్రతి ప్రయాణీకుల డేటా వారి రాష్ట్ర ప్రభుత్వానికి (State Govt) అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tamil Nadu Coronavirus: ముంబై ధారావిని తలపిస్తోన్న చెన్నై కన్నాగి నగర్‌, ఒక్క రోజే 23 కోవిడ్-19 కేసులు నమోదు, తమిళనాడులో 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు

Hazarath Reddy

కోవిడ్-19 వైరస్‌తో తమిళనాడు (Tamil Nadu Coronavirus) అతలాకుతలమవుతోంది. ఇప్పటికే అక్కడ 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు (TN Corona Cases) నమోదు అయ్యాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్‌లో (Koyambedu market) చాపకింద నీరులా విస్తరించిన కరోనా వైరస్‌ తాజాగా స్లమ్‌ ఏరియా అయిన కన్నాగి నగర్‌కు వ్యాపించింది. కన్నాగి నగర్‌ ప్రస్తుతం మరో ముంబై ధారవిని తలపిస్తోంది. ఈ ఏరియాలో ఒకే రోజు 23 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

AP DGP Warning on Fake News: ఫేక్ వార్తలను నమ్మకండి, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన ఏపీ డీజీపీ దామోదర్ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఏపీలో లాక్‌డౌన్‌ (AP Lockdown) ఎత్తేశాక పెద్ద ఎత్తున చోరీలు జరుగుతాయని, నేరాల రేటు పెరిగిపోతుందని జరుగుతున్న ప్రచారాలను నమ్మ వద్దని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( AP DGP Gautam Sawang) స్పష్టం చేశారు. పోలీస్‌ హెచ్చరిక పేరుతో సోషల్‌ మీడియాలో (Social Media) వస్తున్న ఫేక్‌ పోస్టింగ్‌లపై ఆయన స్పందించారు. లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని, ఏవైనా సమస్యలుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ (Damodar Goutam Sawang) హెచ్చరించారు.

'Lockdown 4.0': నాలుగవ దశ లాక్‌డౌన్, ఈ నెల 15 లోగా రాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలు చెప్పాలన్న ప్రధాని మోదీ, వీడియో కాన్ఫరెన్స్‌లో ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

దేశంలో మూడో విడత లాక్‌డౌన్‌ (Lockdown 3.0) ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ (PM Modi 5th Video Conference) ద్వారా సమావేశమయ్యారు.కరోనా కట్టడి, ఆంక్షల సడలింపు, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణపై ముఖ్యమంత్రులతో సమగ్రంగా చర్చించారు. కరోనా విజృంభణ తర్వాత సీఎంలతో సమావేశం కావడం ఇది ఐదోసారి.

Advertisement

Badrinath Temple: మే 15న తెరుచుకోనున్న బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు, పూజారితో సహా 27 మంది మాత్ర‌మే హాజరు, కోవిడ్ 19 పరీక్షలు పూర్తి చేసుకున్న ఆలయ పూజారి

Hazarath Reddy

ఉత్త‌రాఖండ్‌లోని ప‌విత్ర పుణ్య‌క్షేత్రం అయిన బ‌ద్రీనాథ్ ఆల‌య ద్వారాలు మే 15న (Badrinath Temple to Open Portals on May 15) తెరుచుకోనున్నాయి. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 4.30 గంట‌ల‌కు జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ఆల‌య ప్ర‌ధాన పూజారితో స‌హా 27 మంది మాత్ర‌మే హాజ‌రుకానున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అనుమ‌తి లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి (Coronavirus Outbreak) విస్త‌రణ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు ఉత్త‌రాఖండ్ (Uttarakhand) అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

IRCTC website Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్, ఒక్కసారిగి పెరిగిన ట్రాఫిక్‌తో క్రాష్ అయిన ఇండియన్ రైల్వే వెబ్‌సైట్, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

irctc.co.inలో టికెట్లు బుక్ చేసుకునే వారికి నిరాశ ఎదురయింది. అందరూ ఒక్కసారిగా టికెట్ బుకింగ్ కు సైటు ఓపెన్ చేయడంతో సర్వర్ ఒక్కసారిగా డౌన్ (IRCTC website Down) అయింది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదు చేయడానికి ట్విట్టర్‌లోకి (Twitter) వెళ్లారు. ట్విట్టర్ వేదికగా ఇండియన్ రైల్వే సైటు ఓపెన్ కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. 15 ప్యాసింజర్ రైళ్ల కోసం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో (IRCTC Website) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సాయంత్రం 4 నుంచి ప్రారంభించిన సంగతి విదితమే.

Indian Railways: ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం

Hazarath Reddy

దాదాపుగా నెలన్నర తరువాత ప్రయాణికుల రైళ్లు (Trains) తిరిగి పట్టాలకెక్కనున్నాయి. రేపటి నుంచి రైల్వేశాఖ (Indian Railways) త‌న సేవ‌ల‌ను క్ర‌మంగా ప్రారంభించనుంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్లను సాధార‌ణ ప్ర‌యాణికులు ప్ర‌యాణించ‌డానికి ఉప‌యోగించ‌నున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో (Lockdown) గూడ్సు సర్వీసులు మాత్రమే కూతపెట్టగా.. రేపటి నుంచి ప్రయాణికుల రైళ్లు కూడా సేవలందించనున్నాయి.

SSC Exams in TS: కొత్త హాల్ టికెట్లు ఉండవు, తెలంగాణలో పాత హాల్ టికెట్లతోనే పదవతరగతి పరీక్షలు, క్లారిటీ ఇచ్చిన ఎస్ఎస్‌సీ బోర్డు, హైకోర్టు అనుమతి కోసం వెయిటింగ్

Hazarath Reddy

ఇప్పటికే మార్చిలో విడుదలైన పాత హాల్ టిక్కెట్లతో (Old Hall Tickets) ఎస్ఎస్సి పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. దీనిపై బోర్డు డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు హాజరు కావడానికి కొత్త హాల్ టికెట్లు అవసరం లేదని, దీనికి సంబంధించిన సూచనలు అధికారులకు అందజేస్తామని చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరం కారణంగా, ఒక విద్యార్థిని మాత్రమే బెంచ్ మీద కూర్చుని పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Advertisement

AP CM Review: ఏపీలో షాపుల ఓపెన్‌కు గ్రీన్ సిగ్నల్, ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

ఏపీలో లాక్‌డౌన్ తర్వాత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు దుకాణాలను తెరిచేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. కోవిడ్‌–19 నియంత్రణ చర్యలు (coronavirus prevention), లాక్‌డౌన్‌ (AP Lockdown) అనంతరం రాష్ట్రాల మధ్య రాకపోకలపై అనుసరించాల్సిన విధానాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఆదివారం తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

PM Modi 5th VC with CMs: ఆర్థిక పరిస్థితి సంగతేంటి, రాష్ట్రాల సీఎంలతో 3 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్‌ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వంటి అంశాలే ప్రధాన ఎజెండా

Hazarath Reddy

కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన లాక్‌డౌన్ 3.0 (Lockdown 3.0) ముగియ‌డానికి మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ (PM Modi 5th VC with CMs) ద్వారా సంభాషించనున్నారు. భ‌విష‌త్య్‌లో ఎలా ముందుకు వెళ‌దామ‌నే విష‌యంపై రాష్ట్రాల ముఖ్యమంతుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.

Mother's Day 2020: మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ, HD Images, Quotes & Wallpapers, Wish Happy Mother's Day With WhatsApp Stickers and GIF Greetings మీకోసం

Hazarath Reddy

అమ్మ... సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ..అటువంటి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే.

CBSE 10th, 12th Board Exam 2020: జూలై ఒకటి నుంచి జూలై 15 వరకూ సిబిఎస్ఇ 10, 12వ తరగతి పరీక్షలు, తేదీలను ప్రకటించిన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్

Hazarath Reddy

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10 వ తరగతి, 12 వ తరగతి పరీక్ష తేదీలను (CBSE 10th, 12th Board Exam 2020) గురువారం ప్రకటించారు. జులై ఒకటి నుంచి జులై 15 వరకూ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. దేశంలో COVID-19 లాక్డౌన్ కారణంగా చాలా ఆలస్యం తరువాత ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

Advertisement
Advertisement