వార్తలు

YouTube Premium Price Hike in India: రూ.129 నుంచి రూ. 149 కి యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్‌ ధర పెంపు, అన్ని రకాల ధరలను సవరించిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్ ఫాం

Vikas M

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్ ఫాం యూట్యూబ్‌ (YouTube) భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ వీక్షించాలంటే యూజర్లు డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్‌, వ్యక్తిగత ప్లాన్‌ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

Apple Jobs in India: ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు

Vikas M

గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్‌ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని భావిస్తున్నారు.

Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

కీర దోసకాయ లో అధిక శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కీరదోస తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Jay Shah ICC New Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా..డిసెంబర్‌ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జైషా.

sajaya

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షాకు పెద్ద బాధ్యత లభించింది. ఆయన అత్యున్నత క్రికెట్ బాడీ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయ్యాడు. మంగళవారం స్వతంత్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement

Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి!

Arun Charagonda

తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా అధికారులు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలోనే జన్వాడ ఫాం హౌస్ ను కూల్చనున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు.

CM Revanth Reddy On Prajapalana: సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం, గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి తరలింపు, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు..

Arun Charagonda

సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్..రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేయాలన్నారు.

MLA Bolisetty Srinivas On Allu Arjun: అల్లు అర్జున్ ఏమైనా పుడింగా?, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్, బన్నీకి అసలు ఫ్యాన్సే లేరని మండిపాటు, స్థాయిని మించి మాట్లాడొద్దని చురకలు

Arun Charagonda

సినీ నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్ కు అసలు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని..ఉన్నదంతా కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమేనన్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? ,అతను ప్రచారం చేయకపోతే మాకేమైనా నష్టం జరిగిందా? అన్నారు.

BJP MLA Raja Singh On Akbaruddin Owaisi: బీఆర్ఎస్ మద్దతుతోనే మజ్లిస్ చెరువుల కబ్జా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్, సీఎం రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు

Arun Charagonda

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారని..ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు అని దుయ్యబట్టారు.

Advertisement

Andhra Pradesh: ఫుడ్ పాయిజన్.. 49 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

ఏపీలో మరో బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవరగం ఏలేశ్వరం బాలికల గురుకుట పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కాగా 49 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

KTR Vs Bandi Sanjay: కవితకు బెయిల్..కాంగ్రెస్‌ విజయమన్న బండి సంజయ్‌ , బండి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్, చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుండి విడుదల కానున్నారు కవిత. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల ముద్ధం నెలకొంది.

Astrology:సెప్టెంబర్ 2 నుండి శని గ్రహం.రాశి మార్పు వల్ల ఈ మూడు రాశులు వారికి జీవితంలో అద్భుతం జరుగుతుంది.

sajaya

కుంభ రాశికి ,మకర రాశికి అధిపతి అయిన శని గ్రహం శుభ ఫలితాలను ఇస్తుందని అందరూ నమ్ముతారు. శని గ్రహం రాశి మార్పు సెప్టెంబర్ 2 నుండి అన్ని రాశుల వారికి సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి.

Astrology: రాహు గ్రహం రాశి మార్పు కారణంగా..వచ్చే మూడు నెలల్లో ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు కొన్ని రాశుల వారి పైన ప్రత్యేక అనుగ్రహాన్ని చూపి వారి జీవితాన్ని ఆనందంగా చేస్తుంది. డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా చేస్తుంది.

Advertisement

Telangana Liquor Sales: మద్యం కోసమే ఎక్కువ ఖర్చు, దేశంలో తెలంగాణ టాప్‌, కరోనా సమయంలో తెలంగాణలో తెగ తాగేశారని నివేదిక వెల్లడి

Arun Charagonda

లిక్కర్ సేల్స్‌లోనే కాదు మద్యం కోసం ఖర్చు చేసే రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ టాప్‌లో నిలిచింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికలో షాకింగ్ విషయం వెల్లడైంది. మద్యం కోసం వార్షిక తలసరి ఖర్చు రూ,1623గా ఉండగా బెంగాల్‌లో కేవలం రూ.4 మాత్రమేనన్నారు. కరోనా సమయంలో తెలంగాణలో మరింత ఎక్కువ ఖచ్చు అయిందని సర్వే వెల్లడించింది.

Kolkata Nabanna Rally updates: ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల 'నబన్న మార్చ్', నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, గాల్లోకి కాల్పులు..వీడియోలు ఇదిగో

Arun Charagonda

కోల్​కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు తలపెట్టిన నబన్న మార్చ్‌ ఉద్రిక్తంగా మారింది. కోల్‌కతా సచివాలయం ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వగా సచివాలయాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు.

Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా..అయితే మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.

sajaya

క్యాల్షియం అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మన శరీర ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి ,దంతాల బలానికి ఈ కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల ఎముకలు పెలుసు బారిపోవడం వంటి వ్యాధుల వచ్చే అవకాశం.

Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్.

sajaya

ఈరోజుల్లో కండరాల నొప్పులు సర్వసాధారణమైపోయింది. కాళ్లు, చేతులు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా నొప్పులతో మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తాయి. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పడానికి జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటారు.

Advertisement

Health Tips: శొంఠి కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా..షుగర్ పేషంట్లకు ఇది ఒక అద్భుత వరం.

sajaya

మధుమేహం వ్యాధి ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్న సమస్య. ఇది సైలెంట్ కిల్లర్ గా ఉండి జీవితాంతం కూడా మనం అనేక రకాల జబ్బులకు గురిచేస్తుంది

Infosys CEO Salil Parekh: ఏఐతో ఉద్యోగాలు పోవు, గుడ్ న్యూస్‌ చెప్పిన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, ఏఐ సాంకేతికతపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వెల్లడి

Arun Charagonda

ఐఏ కారణంగా ఇన్ఫోసిస్‌లో ఉద్యోగుల తొలగింపు ఉండదని తెలిపారు సంస్థ సీఈవో సలీల్ పరేఖ్. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సలీల్..తమ సంస్థలో కొత్త టెక్నాలజీ కారణంగా ఉద్యోగాల తొలగింపులు ఉండబోవని స్పష్టం చేశారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు ఆధరణ లభించినట్లుగానే ఇప్పుడు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఆదరణ వస్తోందన్నారు.

King Cobra At Hospital: ఆస్పత్రిలో ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా,అల్లూరి జిల్లా చింతూరులో ఘటన, కోబ్రాను పట్టుకుని అడవీలో వదిలేసిన ఫారెస్ట్ సిబ్బంది..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 12 అడుగుల కోబ్రా ప్రత్యక్షమైంది. దీంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కోబ్రాను సమీపంలోని అటవీ ప్రాంతంలో తరలించింది ఫారెస్టు సిబ్బంది. నిత్యం పాములు కనిపిస్తున్నాయని, మండలంలో స్నేక్ క్యాచర్‌ని నియమించాలని కోరుతున్నారు ప్రజలు. అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం జెన్‌కో ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

MLC Kavitha Gets Bail: ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్, రూ. 10 లక్షల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు, ఐదు నెలల తర్వాత బయటకు రానున్న కవిత

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈడీ, సీబీఐ కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను అదుపులోకి తీసుకుంది ఈడీ. ఆ తర్వాత సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో తీహార్ జైలులో ఉన్నారు కవిత.

Advertisement
Advertisement